సమీపిస్తున్న గడువు
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయి పడిన మిల్లర్లు మరో 15 రోజుల్లో వాటిని అప్పగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
సీఎంఆర్ లక్ష్యాల పూర్తిపై అధికారుల కసరత్తు
సూర్యాపేట: కలెక్టరేట్లో మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ వెంకట్రావు
సూర్యాపేట కలెక్టరేట్, న్యూస్టుడే: జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయి పడిన మిల్లర్లు మరో 15 రోజుల్లో వాటిని అప్పగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత సీజన్లకు సంబంధించి బకాయి ఉండకూడదని, గడువు లోపు అందించకుంటే సంబంధిత మిల్లులను బ్లాక్ లిస్టులో పెడతామని జిల్లా పాలనాధికారి ఇటీవల జరిగిన సమావేశంలో హెచ్చరించారు. 2021-22 వానాకాలం, యాసంగి, 2022-23 వానాకాలానికి సంబంధించి సీఎంఆర్ బకాయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలో బకాయి ఉన్న మిల్లుల వివరాలు సేకరిస్తున్నారు. తక్షణమే బియ్యం అప్పగించేలా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎంత అందించారు.. ఇంకా ఎంత అందించాల్సి ఉంది, తదితర వివరాలపై ఆరా తీస్తున్నారు. జిల్లాలో మూడు సీజన్లకు సంబంధించి మూడు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్లు బకాయి పడ్డారు.
నెలాఖరు లోగా లక్ష్యం చేరుకోవడంపై కసరత్తు
రైస్ మిల్లర్లు నిర్దేశించిన లక్ష్యం చేరుకోవడానికి ఈ నెల చివరి వరకు గడువు ఉంది. ఆలోపు లక్ష్యం చేరేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ధాన్యం అందించిన మూడు నెలల్లోపే బియ్యంగా మార్చి అందించాల్సి ఉంది. కానీ కొందరు మిల్లర్లు ఆ ధాన్యంతో వ్యాపారం చేస్తూ బియ్యం అప్పగింతలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అయినా ప్రభుత్వం పలుమార్లు గడువు పొడిగిస్తూ వచ్చింది. మరో అవకాశం కల్పించి గడువు పొడిగించడంతో ఇప్పటికైనా లక్ష్యం అందుకొని బకాయిలు పూర్తి చేయించేందుకు పౌరసరఫరాల సంస్థ అధికారులు పాటుపడుతున్నారు ఇటీవల సూర్యాపేటలో కలెక్టర్ మిల్లర్లతో సమావేశంలో ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని సూచించారు. గడువులోగా బకాయిలు పూర్తి చేయకుంటే మిల్లులకు రావాల్సిన కమీషన్, బిల్లులను నిలిపివేయడంతోపాటు బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరికలు జారీ చేశారు.
బకాయిలు ఇలా..
జిల్లాలో 2021-22 వానాకాలం, యాసంగి సీజన్ నుంచి సీఎంఆర్ బకాయి ఉన్నాయి. ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని స్థానికంగా రైసుమిల్లులకు తరలిస్తారు. ఆ ధాన్యాన్ని మిల్లరు మరాడించి క్వింటాలుకు 67 కిలోల చొప్పున బియ్యం పౌర సరఫరాల సంస్థకు అప్పగించాలి. క్వింటాలు రా రైస్ మర పట్టిస్తే రూ.15, బాయిల్డ్ రైస్ అయితే రూ.25 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే మూడు సీజన్లకు కలిపి తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ కింద జిల్లాలో 75 రైస్ మిల్లులకు కేటాయించారు. ఆయా మిల్లులు 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అప్పగించాల్సి ఉంది. ఇప్పటి వరకు అందులో సగమే అందించాయి. మరో 3 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు మిల్లర్లు అప్పగించాల్సి ఉంది. గడువు ఈ నెలాఖరు వరకు మాత్రమే ఉండటంతో అధికారులు సీఎంఆర్ను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. 2022-23 వానాకాలం సంబంధించి సీఎంఆర్కు గడువు పొడిగించే అవకాశం ఉంది. కాగా, తాము అందించే ప్రతి బియ్యం గింజను ఎఫ్సీఐ సిబ్బంది పరిశీలిస్తున్నారని, కొంచెం నల్లబారినా తీసుకోవడం లేదని మిల్లర్లు పేర్కొంటున్నారు. దీంతో రవాణా భారం, కూలీల ఖర్చు పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లక్ష్యాన్ని పూర్తి చేస్తాం: మోహన్రావు, అదనపు కలెక్టర్, సూర్యాపేట
ప్రభుత్వ మిల్లర్లకు ఇచ్చిన గడువు ప్రకారం సీఎంఆర్ లక్ష్యాలను పూర్తి చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వ ఆదేశానుసారం మిల్లర్ల బకాయి వివరాలను తెలుసుకుంటున్నాం. బకాయి ఉంటే ఉన్నతాధికారుల సూచనల ప్రకారం మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెట్టేలా చర్యలు తీసుకుంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: కలెక్టర్
[ 26-04-2024]
ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. -
పోరుబాట.. ఓటు మాట..!
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువు గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్సభ స్థానానికి 56 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
గిరి గీశారు అందరూ.. బరిలో నిలిచేది ఎందరో
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి అఫిడవిట్లు సమర్పించారు. -
దేవరకొండ నుంచి 450 మంది పోటీ
[ 26-04-2024]
లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆయా శాసన సభ నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. అక్కడి జనాభాను బట్టి ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండొచ్చు. అలాంటిది లోక్సభ నియోజకవర్గానికి ఒకే శాసనసభ నియోజకవర్గం నుంచి 450 మంది పోటీ చేసి ఆకర్షించారు. -
జోజిలపాస్ను అధిరోహించిన దేవరకొండ వాసి
[ 26-04-2024]
అత్యంత ధైర్య సాహసాలతో.. ఎత్తయిన ప్రాంతం జోజీలపాస్కు చేరుకొని ఔరా అనిపించాడు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన అజీజ్. ఇతని తల్లిదండ్రులు అబ్దుల్ సలాం, ఖుర్షీద్భేగంలు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్య కారకాలు!
[ 26-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇక చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఆటలాడుతుంటే.. వారిలో క్రమశిక్షణకు తోడు నైపుణ్యాభివృద్ధి, సృజనకు మెరుగులుదిద్దాలని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. -
బంజరు భూముల్లో ఆడుకునేవాళ్లం
[ 26-04-2024]
వేసవి సెలవులొస్తే చాలు.. బాల్యమిత్రులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించేవాళ్లం. అప్పట్లో బంజరు భూములే మాకు క్రీడా మైదానాలు. ఆ భూములను మేమే స్వయంగా పిచ్చి మొక్కలు తొలగించి బాగు చేసుకునేవాళ్లం. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 26-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులకు హారతినిచ్చి కొలిచారు. -
యువకుడి బలవన్మరణం
[ 26-04-2024]
పురుగుమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు, నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయసు ఆరేళ్లలోపే. -
సీ విజిల్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద సీవిజిల్ యాప్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే అన్నారు. భువనగిరి గ్రామీణ పోలీస్పరిధిలోని రాయగిరిలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. -
ఈవో ఉంటేనే తెరుస్తారా!
[ 26-04-2024]
యాదాద్రికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందించేందుకు కొండపైన ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ మూణ్నాల ముచ్చటగానే మారింది. -
బీసీ గురుకులాల్లో 83.94 శాతం ఉత్తీర్ణత
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకులాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 83.94శాతం ఉత్తీర్ణత సాధించారని బీసీ గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ షకీనా తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 70.15శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.