logo

హామీలను విస్మరిస్తున్న కేసీఆర్‌: తెదేపా

బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతూ కేసీఆర్‌ పాలన కొనసాగిస్తున్నారని తెదేపా  పార్లమెంట్‌ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ ఎల్‌వి యాదవ్‌ అన్నారు.

Published : 26 Mar 2023 04:45 IST

పట్టణంలోని 27వ వార్డులో ఇంటింటికీ వెళ్లి తెదేపా అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తున్న ఆపార్టీ నాయకులు

నల్గొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతూ కేసీఆర్‌ పాలన కొనసాగిస్తున్నారని తెదేపా  పార్లమెంట్‌ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ ఎల్‌వి యాదవ్‌ అన్నారు. ఇంటింటికీ తెదేపా కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని 27, 28 వార్డుల్లో నాయకులు పర్యటించారు.  బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన తెదేపాను ప్రజలు ఆదరించాలని కోరారు. కూరెళ్ల్ల విజయ్‌కుమార్‌, వెంకటేశ్వర్లు, నాగరాజు, దయాకర్‌, మధుసూదన్‌రెడ్డి, క్రాంతి, గంగాధర్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని