రాచబాటలో సమస్యల మేట
విస్తరించిన 65వ నెంబరు జాతీయ రహదారిపై ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల చేయాల్సిన పనులు నేటికీ అసంపూర్తిగా వదిలేశారు. దీంతో వాహనాదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇబ్బందుల్లో వాహన చోదకులు, గ్రామీణులు
కేతేపల్లి శివారులో అర్ధాంతరంగా నిలిపివేసిన డ్రైనేజీ కాలువ
కేతేపల్లి, న్యూస్టుడే: విస్తరించిన 65వ నెంబరు జాతీయ రహదారిపై ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల చేయాల్సిన పనులు నేటికీ అసంపూర్తిగా వదిలేశారు. దీంతో వాహనాదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామ శివారులోని నకిరేకల్ బైపాస్ జంక్షన్ వద్ద అండర్ నిర్మించాలని ప్రతిపాదించినా ఆచరణలోకి రాలేదు. మల్లన్నగుట్ల వద్ద ప్రమాదకర కూడలిలో అండర్పాస్ నిర్మించాలని స్థానికులు పదేళ్లుగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కొర్లపహాడ్, కేతేపల్లి, చీకటిగూడెం, ఉప్పలపహాడ్ గ్రామాల బస్స్టేజీల వద్ద జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ప్రతిపాదించిన పనులు ప్రారంభానికి నోచుకోలేదు. రాచబాటలో ప్రతిపాదించిన గ్రామాలలో సర్వీసు రోడ్ల వెంట డ్రైనేజీలను అవసరమైన చోట నిర్మించలేదు. గ్రామాలలో అర్ధాంతరంగా ఆగిపోయాయి. దీంతో వానలు వచ్చిన ప్రతిసారీ ఇళ్లముందు వర్షపు నీరు నిలుస్తోంది.
ఉమ్మడి జిల్లాలో ఇబ్బంది
ఉమ్మడి జిల్లాలో చౌటుప్పల్, చిట్యాల, నార్కట్పల్లి, కట్టంగూర్, నకిరేకల్, కేతేపల్లి, సూర్యాపేట, చివ్వెంల, మునగాల, నడిగూడెం, కోదాడ మండలాల్లోని 31 గ్రామాల్లో సర్వీసు దారులు ఉన్నాయి. వాటివెంట డ్రైనేజీలు, వీధిదీపాలు ఏర్పాటు చేయక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై ప్రమాదాలు జరిగిన సందర్భంలో ఆందోళనలు చేస్తే సంబంధిత అధికారులు, గుత్తేదారులు హామీలు ఇస్తున్నారే తప్ప పనులు మాత్రం చేయడం లేదు. ఉమ్మడి జిల్లాలోని సుమారు పద్దెనిమిది గ్రామాల్లో సర్వీసు రహదారులు అసంపూర్తిగా ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారు. సర్వీసుదారుల ఉన్న బస్షెల్టర్లు పల్లెలకు దూరంగా ఉండటంతో అవికూడా నిరుపయోగంగా ఉన్నాయి.
పట్టించుకునే వారు లేరు
చెనగోని వెంకన్నగౌడ్, ఇనుపాముల
జాతీయ రహదారి విస్తరణ సమయంలో ప్రభుత్వం, అధికారులు అనేక హామీలు ఇచ్చారు. రహదారి విస్తరణలో స్థానికంగా చేయాల్సి పనులు సూచించాలని గుత్తేదారు సంస్థ, జాతీయరహదారుల అభివృద్ధి సంస్థ వారు కోరారు. వారి సూచనల మేరకు అవసరమైన ప్రతిపాదనలు ఇంజినీరింగ్ నిపుణుల సహకారంతో అందజేశాం. అయినా పట్టించుకునేవారు లేరు. దీంతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.
మంజూరైతే పనులు చేస్తాం
శ్రీధర్రెడ్డి, జీఎమ్మార్ అధికారి
జాతీయ రహదారి విస్తరణలో గ్రామాలలో ప్రజలకు అవసరమైన పనులకు ప్రతిపాదనలను ఎన్హెచ్ఐ అదికారులతో కలిసి మా సంస్థ ప్రతిపాదించింది. ఆయా పనులు జాతీయ రహదారుల విభాగం వారు మంజూరు చేయగానే ప్రారంభిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుబాట.. ఓటు మాట..!
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు. -
ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: కలెక్టర్
[ 26-04-2024]
ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువు గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్సభ స్థానానికి 56 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
గిరి గీశారు అందరూ.. బరిలో నిలిచేది ఎందరో
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి అఫిడవిట్లు సమర్పించారు. -
దేవరకొండ నుంచి 450 మంది పోటీ
[ 26-04-2024]
లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆయా శాసన సభ నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. అక్కడి జనాభాను బట్టి ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండొచ్చు. అలాంటిది లోక్సభ నియోజకవర్గానికి ఒకే శాసనసభ నియోజకవర్గం నుంచి 450 మంది పోటీ చేసి ఆకర్షించారు. -
జోజిలపాస్ను అధిరోహించిన దేవరకొండ వాసి
[ 26-04-2024]
అత్యంత ధైర్య సాహసాలతో.. ఎత్తయిన ప్రాంతం జోజీలపాస్కు చేరుకొని ఔరా అనిపించాడు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన అజీజ్. ఇతని తల్లిదండ్రులు అబ్దుల్ సలాం, ఖుర్షీద్భేగంలు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్య కారకాలు!
[ 26-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇక చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఆటలాడుతుంటే.. వారిలో క్రమశిక్షణకు తోడు నైపుణ్యాభివృద్ధి, సృజనకు మెరుగులుదిద్దాలని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. -
బంజరు భూముల్లో ఆడుకునేవాళ్లం
[ 26-04-2024]
వేసవి సెలవులొస్తే చాలు.. బాల్యమిత్రులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించేవాళ్లం. అప్పట్లో బంజరు భూములే మాకు క్రీడా మైదానాలు. ఆ భూములను మేమే స్వయంగా పిచ్చి మొక్కలు తొలగించి బాగు చేసుకునేవాళ్లం. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 26-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులకు హారతినిచ్చి కొలిచారు. -
యువకుడి బలవన్మరణం
[ 26-04-2024]
పురుగుమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు, నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయసు ఆరేళ్లలోపే. -
సీ విజిల్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద సీవిజిల్ యాప్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే అన్నారు. భువనగిరి గ్రామీణ పోలీస్పరిధిలోని రాయగిరిలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. -
ఈవో ఉంటేనే తెరుస్తారా!
[ 26-04-2024]
యాదాద్రికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందించేందుకు కొండపైన ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ మూణ్నాల ముచ్చటగానే మారింది. -
బీసీ గురుకులాల్లో 83.94 శాతం ఉత్తీర్ణత
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకులాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 83.94శాతం ఉత్తీర్ణత సాధించారని బీసీ గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ షకీనా తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 70.15శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్