పోరు.. ఖరారు..!
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారాస, భాజపా తమ అభ్యర్థులను ఖరారు చేసింది.
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారాస, భాజపా తమ అభ్యర్థులను ఖరారు చేసింది.దీంతో గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ప్రారంభించాలని అభ్యర్థులు ముందుకెళ్తున్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంటులో గ్రామాలు, మండలాల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి ప్రచారాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తుండగా.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాటి అమలు, పంటలు ఎండిపోతుండటంతో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టాలని భారాస నిర్ణయించింది. గత పదేళ్ల భారాస పాలనతో పాటూ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోనూ ప్రజలకు ఏమీ ఒనగూరలేదని చెబుతూ..కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రధాని మోదీ సుస్థిర పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేలా భాజపా ప్రచార వ్యూహాలను సిద్ధం చేస్తోంది.
ఈనాడు, నల్గొండ
బలమైన పోటీ ఇచ్చేలా.. భారాస
అధికారంలో కోల్పోవడంతో డీలా పడ్డ కార్యకర్తలను తిరిగి లోక్సభ ఎన్నికలకు సన్నద్ధం చేసేలా భారాస ఎత్తుగడలు వేస్తోంది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో రెండు జనరల్ స్థానాల్లో ఒకటి బీసీకి, ఒకటి ఓసీకి కేటాయించిన పార్టీ నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డిని, భువనగిరి నుంచి క్యామ మల్లేష్లను బరిలోకి దింపింది. ఒకట్రెండు రోజుల్లో మాజీ సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించినా.. ఇప్పటివరకు రూట్మ్యాప్ ఖరారు కాలేదు. దీంతో వచ్చే నెల మొదటివారంలో పార్టీ అధినేత పర్యటన ఉండొచ్చని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.ఆ కార్యక్రమం నుంచే ప్రచార కార్యక్రమాలకు తెర తీయాలని పార్టీ నాయకులు భావిస్తున్నారు. నల్గొండ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన కంచర్ల కృష్ణారెడ్డి నియోజకవర్గ పరిధిలోని పార్టీ మాజీ ఎమ్మెల్యేలను కలిసి తనకు మద్దతివ్వాలని కోరుతున్నారు. భువనగిరి నుంచి పోటీ చేస్తున్న క్యామ మల్లేష్ త్వరలోనే నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంటుల్లో ఆత్మీయ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు.
సిట్టింగులను నిలబెట్టుకునేలా..కాంగ్రెస్
రెండు సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రచార వ్యూహాలను సిద్ధం చేస్తోంది. నల్గొండ లోక్సభ స్థానానికి సీనియర్ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్రెడ్డిని ప్రకటించగా.. భువనగిరి స్థానానికి సీఎం రేవంత్రెడ్డికి సన్నిహితుడైన చామల కిరణ్ను అభ్యర్థిగా ఎంపిక చేశారు. నల్గొండ స్థానంలో ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసేందుకు లోక్సభ పరిధిలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో ఈ నెల 30న మట్టపల్లిలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మంత్రి కోమటిరెడ్డితో పాటూ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలంతా హాజరుకానున్నారు. అభ్యర్థిగా ఎంపికైన రఘువీర్రెడ్డి ఇప్పటికే నాగార్జునసాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. సీనియర్ నేత జానారెడ్డి సైతం ఉమ్మడి జిల్లా మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్లను కలిసి తన కుమారుడికి మద్దతివ్వాలని కోరారు. భువనగిరిలో అభ్యర్థి ఎంపికలో కొంత జాప్యం జరిగినందునా.. ఒకట్రెండు రోజుల్లో ఈ స్థానానికి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న మంత్రి కోమటిరెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కేంద్ర పథకాలు, మోదీ ప్రభతో..భాజపా
భువనగిరి నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ను భాజపా బరిలోకి దింపడంతో ఆయన పది రోజుల క్రితమే ప్రచారాన్ని ప్రారంభించి ఓటర్ల మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు పోటీ చేసి ఉండటం, ఒక దఫా ఎంపీగా గెలుపొందడంతో ఆయనకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పరిచయాలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఓట్లు అడుగుతున్నారు. నల్గొండ నుంచి అనూహ్యంగా టిక్కెట్ దక్కించుకున్న మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి నియోజకవర్గంలోని వివిధ వర్గాలతో సమావేశం అవుతూ భాజపాకు ఓటేయాలని కోరుతున్నారు. తాజాగా నల్గొండలో సామాజిక మాధ్యమాల కార్యకర్తలతో పాటూ సీనియర్నేతతో సమావేశమై గెలుపు వ్యూహాలను చర్చించారు. త్వరలోనే నియోజకవర్గాల వారీగా ప్రచార కార్యక్రమాలు ఉండేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో.. ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలతో పాటూ ఈ ఎన్నిక గెలుపుపైనా దృష్టి సారించాయి. -
ఇంటింటికీ పోల్ చిట్టీలు..!
[ 27-04-2024]
ఓటు వేసేందుకు ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఓటర్లందరికీ ప్రత్యేకంగా పోల్ చిట్టీలు పంపిణీ చేస్తోంది. -
పురంపై సైబర్ ఉచ్చు..!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో రాకేశ్ అనే వ్యాపారికి ఈ నెల 21న సాయంత్రం సెల్ నంబరు 63054 68441 నుంచి ఫోన్ కాల్ వచ్చింది. -
మామిడీలా
[ 27-04-2024]
మామిడి.. భారతదేశపు పండుగా గుర్తింపు పొందింది. ప్రపంచ ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో ఉంది. ఇది నిన్నామొన్నటి మాట. -
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాడు: రాజగోపాల్రెడ్డి
[ 27-04-2024]
రాబోయే నాలుగేళ్లలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తానని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
పద తమ్ముడూ.. పార్టీ మారుదాం!
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీల క్యాడర్ స్వరూపం మారిపోతోంది. రాజకీయ సమీకరణాలూ శరవేగంగా మారుతున్నాయి. -
సమగ్ర సమాచార మార్గదర్శి
[ 27-04-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక రకాల చర్యలు చేపడుతోంది. -
‘గుర్తు’ తెచ్చుకుందాం..రండి
[ 27-04-2024]
రాజకీయ పార్టీల ఉనికిని చాటేది వాటి గుర్తులే. గుర్తుల ఆధారంగానే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించడమే కాకుండా ఓటర్లు ఓటు వేస్తుంటారు. -
ప్రజల మనిషి ధర్మభిక్షం
[ 27-04-2024]
మునుగోడు మండలం ఊకొండిలో కల్లుగీత వృత్తి పని చేసుకునే ధర్మభిక్షం కుటుంబం సూర్యాపేటకు వలసవెళ్లి అక్కడే స్థిరపడింది. -
ఈతకెళ్లి తండ్రీతనయుల మృతి
[ 27-04-2024]
నీటి ప్రమాదాల నుంచి తప్పించుకునేలా తన ఇద్దరు కుమారులకు ఈత నేర్పాలని భావించిన ఆ తండ్రి. -
అవార్డుల ఉపాధ్యాయుడు ఆదె..!
[ 27-04-2024]
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా రెండు దశాబ్దాల నుంచి చిన్నారులకు విద్యాబోధన అందించటమే కాకుండా సమాజంలో విద్యాభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు ఆదె సత్యనారాయణ. -
వీడని మిస్టరీ..!
[ 27-04-2024]
ఈ నెల 18 నుంచి కనిపించకుండా పోయిన సూర్యాపేట మండలం యల్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్య కేసు మిస్టరీ వీడటం లేదు. -
చివరికి మొగి పురుగు దాడి
[ 27-04-2024]
ఈ సీజన్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు ఆలస్యంగా విడుదల కావడంతో తుంగతుర్తి నియోజకవర్గంలో 40 శాతం వరి సాగు జనవరి మాసంలో చేపట్టారు. -
వేతనాలు రాక టీఏల ఇబ్బందులు
[ 27-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి పనులను చూపిస్తూ విధులు నిర్వహిస్తున్న సాంకేతిక సహాయకుల ( టెక్నికల్ అసిస్టెంట్లు)కు రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
బరిలో..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం జరిగిన నామపత్రాల పరిశీలన కార్యక్రమంలో నల్గొండ లోక్సభ పరిధిలో 25 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా లేకపోవడంతో తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్