e-స్మార్ట్ వేదిక..రైతులకు వేడుక
వ్యవసాయ ఉత్పత్తులు నేరుగా విక్రయించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జాతీయ స్థాయిలో ఇప్పటికే ఉన్న ఈ-నాం తరహాలో క్షేత్రస్థాయిలో ఉత్పత్తుల కొనుగోళ్లకు ఏపీ ఫార్మర్స్ ఈ-విక్రయ కార్పొరేషన్ (ఏపీఎఫ్ఈవీసీఎల్) ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా ఆన్లైన్ వేదికగా రైతుల వద్దే ఉత్పత్తులు కొనుగోళ్లు చేయడానికి నిర్ణీత
పంట ఉత్పత్తులకు ఆన్లైన్ వ్యాపారం
వ్యవసాయ ఉత్పత్తులు నేరుగా విక్రయించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జాతీయ స్థాయిలో ఇప్పటికే ఉన్న ఈ-నాం తరహాలో క్షేత్రస్థాయిలో ఉత్పత్తుల కొనుగోళ్లకు ఏపీ ఫార్మర్స్ ఈ-విక్రయ కార్పొరేషన్ (ఏపీఎఫ్ఈవీసీఎల్) ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా ఆన్లైన్ వేదికగా రైతుల వద్దే ఉత్పత్తులు కొనుగోళ్లు చేయడానికి నిర్ణీత ధరలు అందుబాటులో ఉంచనున్నారు. ఉత్పత్తిదారులు, కొనుగోలుదారుల మధ్య వారధిగా ఈ కార్పొరేషన్ వ్యవహరించనుంది. దిగుబడులకు ఎక్కడ గిరాకీ ఉందో గుర్తించి అక్కడకు సరఫరా చేసి గిట్టుబాటు ధర తీసుకొచ్చేలా చర్యలు చేపడుతోంది. ఇందుకు రాష్ట్ర ఉద్యాన, మార్కెటింగ్ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. త్వరలో కార్యాచరణ చేపట్టనుండగా ఉద్యాన రైతులకు ఇది చాలా వరకు మేలు చేయనుంది.
న్యూస్టుడే, గూడూరు జిల్లాలో 73,080 హెక్టార్లలో వివిధ రకాల ఉద్యాన పంటల సాగు జరుగుతోంది. ఆయా ప్రాంతాల్లో పప్పులు, పండ్లు, కూరగాయలు, మసాల దినుసులు, నూనె గింజల సాగు చేపడుతున్నారు. పంటల దిగుబడి సమయంలో రైతులకు గిట్టుబాటు ధరలు ఉండటం లేదు. దళారీ వ్యవస్థ రంగంలోకి దిగి ధరలను దిగ్గోస్తోంది. కూరగాయల ధరల పరిస్థితీ ఇదే. రైతు వద్ద తక్కువకు కొనుగోలు చేసి మార్కెట్లో రెట్టింపు ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒకవేళ నేరుగా రైతులే మార్కెట్కు తీసుకొచ్చినా గిట్టుబాటు ధరలు ఇవ్వకపోగా.. నగదు కూడా సక్రమంగా చెల్లించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడికక్కడే విక్రయించుకోవడానికి ఓ పోర్టల్ ఏర్పాటు చేస్తారు. ఇందుకు ఓ యాప్ను తీసుకురానున్నారు. ఉత్పత్తుల వివరాలు ఆన్లైన్లో చేరగానే కొనుగోలుదారులు నేరుగా ఇక్కడికొచ్చే తీసుకెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ-నాం పోర్టల్ మండీల స్థాయిలో పనిచేస్తోంది. జిల్లాలోని పొదలకూరు నిమ్మకాయల మార్కెట్ కూడా దీనికి అనుసంధానమైంది. తద్వారా ధరలు తెలుసుకొని మంచి ధరలు పొందుతున్నారు. ఇదే తీరుగా ఎక్కడెక్కడ ధరలెలా ఉన్నాయో రైతులు తెలుసుకొని విక్రయించుకోవచ్ఛు చెల్లింపులు పారదర్శకంగా సాగనున్నాయి. ప్రభుత్వం నిర్ణయించే ధరల కన్నా తక్కువకు ఉత్పత్తులు విక్రయించడానికి అవకాశం లేకుండా ఈ ఆన్లైన్ పోర్టల్ పనిచేస్తుంది. ప్రత్యేక యాప్ ద్వారా దీన్ని తీర్చదిద్దనున్నట్లు ప్రభుత్వ యంత్రాంగం చెబుతోంది. ఎక్కడికైనా సరకు తీసుకెళ్లడానికి ట్రాన్స్పోర్టర్లను అనుసంధానం చేయనున్నారు.
రైతు శ్రమకు తగిన ఫలితం
- ప్రదీప్కుమార్, ఉద్యాన శాఖాధికారి, నెల్లూరు
ఉద్యాన పంటల సాగు చేసే రైతులకు ఆన్లైన్ వేదిక మంచి ధరలు లభించేలా చేస్తుంది. రైతులు, వినియోగదారులకు మధ్య దళారీ వ్యవస్థ ఉండదు. ఫలితంగా రైతులకు మేలు జరుగుతుంది. ప్రజలకు తక్కువ ధరకే అన్ని అందుబాటులోకి వస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండయ్య.. లెక్కే వేరు
[ 26-04-2024]
ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసేవారిలో ఎక్కువ మంది రాజకీయ, ఆర్థిక, సామాజిక బలాలున్న వారే ఉంటున్నారు. కొందరు పార్టీల తరఫున ఇంకొందరు ప్రధాన పార్టీల అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించటానికి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయటం సాధారణం. -
రేపు జిల్లాలో చంద్రబాబు పర్యటన
[ 26-04-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 27వ తేదీ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలలో నిర్వహించే ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. -
యాడుంది శిక్షణ.. అయిదేళ్లూ వంచన
[ 26-04-2024]
అక్కాచెల్లెమ్మలను ఆర్థికంగా ప్రోత్సహించి, అన్ని విధాలా అండగా ఉంటానన్న సీఎం జగన్ మాటలు.. ప్రకటనలకే పరిమితమయ్యాయి. సంక్షేమ పథకాలు అటుంచి.. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి.. నిలదొక్కుకునేలా చూడటంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. -
సోమశిలలో అడుగంటిన జలం
[ 26-04-2024]
జిల్లా వరదాయిని సోమశిల జలాశయంలో నీటి నిల్వలు రోజు రోజుకూ అడుగంటుతున్నాయి. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకోకుండా అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు.. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 230 మంది 283 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
దోచుకున్నది.. వైకాపా ఘనులే!
[ 26-04-2024]
మొదట్లో గ్రావెల్, మట్టి కొల్లగొడుతూ విపక్ష నేతలపై నెట్టేందుకు యత్నించిన అధికార పార్టీ నాయకులు.. క్వార్ట్జ్ వ్యవహారంలోనూ అదే పద్ధతిని అవలంబించారు. తొలుత వాటాలు తేలక వారిలో వారే తిట్టుకున్న జిల్లా నాయకులు.. పార్టీ అధిష్ఠానం జోక్యంతో హద్దులు నిర్ణయించుకుని దోపిడీకి తెగబడ్డారు. -
లక్ష్యంపై గురి.. ర్యాంకుల సిరి
[ 26-04-2024]
కసితో చదివారు.. కుటుంబ నేపథ్యం ఏదైనా కలల సాధనకు తపించారు. లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రుల మోములో ఆనందం నింపారు. జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్స్ రెండో విడత ఫలితాలు గురువారం విడుదల చేశారు. -
చెన్నకేశవుడి వైభవం
[ 26-04-2024]
స్థానిక యర్రబల్లిపాలెం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రథోత్సవం గురువారం కనులపండువగా సాగింది.. -
వేణుగోపాలుడి రథోత్సవం
[ 26-04-2024]
శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారికి రథోత్సవం జరిగింది. -
మద్యం డంపుల సూత్రధారి కాకాణే : సోమిరెడ్డి
[ 26-04-2024]
సర్వేపల్లి నియోజకవర్గంలో లభ్యమవుతున్న మద్యం డంపుల్లో పాత్రదారులు వైకాపా నాయకులైతే.. సూత్రధారి మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డేనని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించారు. -
కోట్ల వ్యయం.. నిరుపయోగం
[ 26-04-2024]
ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో అప్పటి ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైద్య విద్యార్థుల విద్యాభ్యాసంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో శిక్షణ పొందేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం నిరుపయోగంగా మారింది. -
జగన్మాయ.. వైద్యం అందదయా!
[ 26-04-2024]
ఆసుపత్రులను అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్ది పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామన్న ముఖ్యమంత్రి జగన్ మాటలు ఆచరణలో కనిపించడం లేదు. అత్యవసర సమయాల్లో వైద్యానికి వెళితే చేయి చూసే నాథుడు ఉండడం లేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత