నగరయాతన
నగరవాసం ప్రజలకు పరీక్ష పెట్టింది. నగర జీవికి గురువారం నరకం కనిపించింది. కొద్దిపాటి వర్షానికే సింహపురి మడుగును తలపించగా- ప్రధాన రహదారులతో పాటు రైల్వే అండర్ పాస్ల వద్ద భారీగా నీరు చేరి జనజీవనం స్తంభించింది. పేరుగొప్ప
కొద్దిపాటి వర్షానికే జలమయం
ట్రాఫిక్ చిక్కులతో ప్రజల సతమతం
ఈనాడు డిజిటల్, నెల్లూరు: కలెక్టరేట్, న్యూస్టుడే
మాగుంట లేఅవుట్ వద్ద పరిస్థితి
నగరవాసం ప్రజలకు పరీక్ష పెట్టింది. నగర జీవికి గురువారం నరకం కనిపించింది. కొద్దిపాటి వర్షానికే సింహపురి మడుగును తలపించగా- ప్రధాన రహదారులతో పాటు రైల్వే అండర్ పాస్ల వద్ద భారీగా నీరు చేరి జనజీవనం స్తంభించింది. పేరుగొప్ప ప్రకటనలతో సరిపుచ్చుతున్న నాయకగణం మాటల్లోని డొల్లతనానికి.. యంత్రాంగం నిష్క్రియాపరత్వానికి మౌనసాక్షిగా నిలిచింది. వర్షపునీటి మడుగులకు తోడు.. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయి.. వాహనదారులతో పాటు ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర పనులపై నగరానికి వచ్చేవారు.. బయటకు వెళ్లేవారు.. తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అందరూ ఒక్కటై.. విస్తృత ప్రయోజనమే లక్ష్యంగా దిద్దుబాటుకు దిగాలన్న మాట బలంగా వినిపించింది.
నెల్లూరు.. 150 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. 54 డివిజన్లు.. పది లక్షల మంది జనాభా ఉన్న నగరం చిరు జల్లులకే చిగురుటాకులా వణికిపోయింది. గురువారం కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. వీధులన్నీ జలమయమయ్యాయి. ప్రధానంగా ఆత్మకూరు బస్టాండు, విజయమహాల్ గేటు, మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జిల్లో చేరిన వర్షపునీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో.. నగరంలోని తూర్పు, పడమరలకు రాకపోకలు నిలిచిపోయాయి. మూడు అడుగులకు పైగా నీరు నిలవడంతో.. వాహనాలు ఇరుక్కుపోయాయి. ఈ మార్గం నుంచే వెళ్లాల్సిన గుంటూరు, ఒంగోలు, హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల బస్సులు, ఇతర వాహనాలతో కి.మీ. మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పెన్నా వంతెన వాహనాలతో కిక్కిరిసిపోయింది. రంగనాయకులపేట, కొండాయపాళెం గేటు మీదుగా నగరంలోకి వచ్చేందుకు యత్నించిన వారికి రైళ్ల రాకపోకలతో నరకం కనిపించింది. వెంకటేశ్వరపురం దగ్గర నుంచి శెట్టిగుంట రోడ్డు వరకు నిలిచిపోవడంతో వాహనాలను జాతీయ రహదారిపైకి మళ్లించారు. ఉదయం 8 గంటలకు బయటకు వచ్చిన జనం.. 11.30 గంటల వరకు ట్రాఫిక్లో పడిగాపులు కాయల్సి వచ్చింది. కొందరు వాహనదారులు.. అత్యవసర పనులపై జిల్లా కేంద్రానికి వచ్చేవారు గంటల తరబడి ట్రాఫిక్లో నిరీక్షించాల్సి వచ్చింది. ఉదయం 11.30 గంటల వరకు ట్రాఫిక్లో ప్రజలు చిక్కుకుపోయారు.
శాశ్వత చర్యలేవీ?
నెల్లూరు నగరంలో 2015లో వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షానికి నగరం ముంపునకు గురైంది. సుమారు రూ. 14.32 కోట్ల మేర నష్టం వాటిల్లింది. కొన్ని ప్రాంతాల్లో పది రోజుల పాటు ఇళ్లలో నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. అప్పటి ముఖ్యమంత్రి మూడు రోజులపాటు నగరంలో ఉండి.. పరిస్థితి చక్కదిద్దాల్సి వచ్చింది. ఆ నేపథ్యంలో శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించడంతో.. రామలింగాపురం, మాగుంట లేఅవుట్ ప్రాంతాల్లో ఆర్వోబీలు నిర్మించాలని ప్రతిపాదించారు. అవి ఇప్పటికీ పత్రాలు దాటలేదు. ప్రజల కష్టాలు తీరలేదు.
రామలింగాపురం అండర్ బ్రిడ్జి వద్ద ప్రజల, విద్యార్థుల అవస్థలు
వాహనాలు వదిలి పరుగులు
ఇంటర్ సప్లిమెంటరీ, డిగ్రీ పరీక్షలు జరుగుతుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చిన వారు.. ట్రాఫిక్లో చిక్కుకోవడంతో ఆందోళనకు గురయ్యారు. సమస్య తీరేలా కనిపించకపోవడంతో.. వాహనాలు దిగి పరుగులు తీశారు. పెన్నా వంతెనపై బస్సుల్లో చిక్కుకున్న విద్యార్థులు రైల్వేస్టేషన్ వరకు వచ్చి.. అక్కడి నుంచి ఇతర వాహనాల్లో కేంద్రాలకు చేరుకున్నారు.
అధికారుల అలసత్వం..
నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది అలసత్వం నగర ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది. నగరంలోని మాగుంట లేఅవుట్, రామలింగాపురం, విజయమహల్గేటు అండర్ బ్రిడ్జిల వద్ద వర్షపు నీటిని తోడేందుకు మోటార్లు ఏర్పాటు చేశారు. విద్యుత్తు లేకపోయినా పనిజరిగేలా జనరేటరు సౌకర్యం కల్పించేందుకు సిబ్బందిని నియమించారు. వర్షం కురిసి వంతెనల కింద నీరు చేరినా.. సకాలంలో వారు స్పందించలేదు. దీంతో ట్రాఫిక్ చిక్కులను అధికం చేసింది.
నెల్లూరులో అత్యధికం
గురువారం ఉదయం 8.30 గంటల వరకు నమోదైన వర్షపాతం ప్రకారం.. నెల్లూరు గ్రామీణంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 38 మండలాల్లో.. 23 మండలాల్లో వర్షం కురిసింది. నెల్లూరు రూరల్లో 72.4 మి.మీ.లు కాగా, కోవూరులో 65.8, నెల్లూరు పట్టణంలో 60 మి.మీ. నమోదైంది. అత్యల్పంగా ఉదయగిరిలో 1.2 మి.మి. కురిసింది.
అదుపుచేసే వారేరీ!
ట్రాఫిక్ నియంత్రణలో ప్రణాళికా లోపం.. వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించి ఇష్టానుసారం దూసుకువెళ్లడం ట్రాఫిక్కు ప్రధాన కారణమైంది. అక్కడక్కడా ట్రాఫిక్ పోలీసులు ఉన్నా.. తమవల్ల గాక చేతులెత్తేయడం పరిస్థితికి అద్దం పట్టింది. అదే సమయంలో విధుల్లో లేకపోయినా.. కొందరు చొరవతో ముందుకొచ్చి.. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు యత్నించడం కనిపించింది. బుచ్చి నుంచి నెల్లూరుకు బస్సులో వస్తున్న కానిస్టేబుల్ వెంకట్రావు వెంకటేశ్వరపురం వంతెనపై ట్రాఫిక్ను నియంత్రించేందుకు ప్రయత్నించారు. నగరం నుంచి వేరే ప్రాంతానికి వెళుతున్న జిల్లా ఎక్సైజ్ అధికారి వెంకటరామిరెడ్డి, తన సిబ్బందితో వెెంకటేశ్వరపురం బ్రిడ్జిపై ఎదురుగా వచ్చే వాహనాలను వెనక్కి పంపించి ట్రాఫిక్ను గాడిలో పెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండయ్య.. లెక్కే వేరు
[ 26-04-2024]
ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసేవారిలో ఎక్కువ మంది రాజకీయ, ఆర్థిక, సామాజిక బలాలున్న వారే ఉంటున్నారు. కొందరు పార్టీల తరఫున ఇంకొందరు ప్రధాన పార్టీల అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించటానికి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయటం సాధారణం. -
రేపు జిల్లాలో చంద్రబాబు పర్యటన
[ 26-04-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 27వ తేదీ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలలో నిర్వహించే ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. -
యాడుంది శిక్షణ.. అయిదేళ్లూ వంచన
[ 26-04-2024]
అక్కాచెల్లెమ్మలను ఆర్థికంగా ప్రోత్సహించి, అన్ని విధాలా అండగా ఉంటానన్న సీఎం జగన్ మాటలు.. ప్రకటనలకే పరిమితమయ్యాయి. సంక్షేమ పథకాలు అటుంచి.. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి.. నిలదొక్కుకునేలా చూడటంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. -
సోమశిలలో అడుగంటిన జలం
[ 26-04-2024]
జిల్లా వరదాయిని సోమశిల జలాశయంలో నీటి నిల్వలు రోజు రోజుకూ అడుగంటుతున్నాయి. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకోకుండా అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు.. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 230 మంది 283 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
దోచుకున్నది.. వైకాపా ఘనులే!
[ 26-04-2024]
మొదట్లో గ్రావెల్, మట్టి కొల్లగొడుతూ విపక్ష నేతలపై నెట్టేందుకు యత్నించిన అధికార పార్టీ నాయకులు.. క్వార్ట్జ్ వ్యవహారంలోనూ అదే పద్ధతిని అవలంబించారు. తొలుత వాటాలు తేలక వారిలో వారే తిట్టుకున్న జిల్లా నాయకులు.. పార్టీ అధిష్ఠానం జోక్యంతో హద్దులు నిర్ణయించుకుని దోపిడీకి తెగబడ్డారు. -
లక్ష్యంపై గురి.. ర్యాంకుల సిరి
[ 26-04-2024]
కసితో చదివారు.. కుటుంబ నేపథ్యం ఏదైనా కలల సాధనకు తపించారు. లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రుల మోములో ఆనందం నింపారు. జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్స్ రెండో విడత ఫలితాలు గురువారం విడుదల చేశారు. -
చెన్నకేశవుడి వైభవం
[ 26-04-2024]
స్థానిక యర్రబల్లిపాలెం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రథోత్సవం గురువారం కనులపండువగా సాగింది.. -
వేణుగోపాలుడి రథోత్సవం
[ 26-04-2024]
శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారికి రథోత్సవం జరిగింది. -
మద్యం డంపుల సూత్రధారి కాకాణే : సోమిరెడ్డి
[ 26-04-2024]
సర్వేపల్లి నియోజకవర్గంలో లభ్యమవుతున్న మద్యం డంపుల్లో పాత్రదారులు వైకాపా నాయకులైతే.. సూత్రధారి మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డేనని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించారు. -
కోట్ల వ్యయం.. నిరుపయోగం
[ 26-04-2024]
ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో అప్పటి ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైద్య విద్యార్థుల విద్యాభ్యాసంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో శిక్షణ పొందేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం నిరుపయోగంగా మారింది. -
జగన్మాయ.. వైద్యం అందదయా!
[ 26-04-2024]
ఆసుపత్రులను అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్ది పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామన్న ముఖ్యమంత్రి జగన్ మాటలు ఆచరణలో కనిపించడం లేదు. అత్యవసర సమయాల్లో వైద్యానికి వెళితే చేయి చూసే నాథుడు ఉండడం లేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి