logo

అందాల కృతి

ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సినీ, బుల్లితెర తారలు శుక్రవారం నెల్లూరులో సందడి చేశారు.

Published : 03 Dec 2022 02:23 IST

ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సినీ, బుల్లితెర తారలు శుక్రవారం నెల్లూరులో సందడి చేశారు. వారిని తిలకించేందుకు వచ్చిన అభిమానులతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. ఆ సందర్భంగా కథానాయిక కృతిశెట్టి ఇలా వారిని అలరించారు. 

ఈనాడు, నెల్లూరు


నెల్లూరు చేపల పులుసు బాగుంది

బెలూన్లను ఎగురవేస్తున్న సినీతారలు, హోటల్‌ అధినేత శ్రీనివాసులరెడ్డి

ఈనాడు, నెల్లూరు: నెల్లూరు మాగుంట లేఅవుట్‌లోని అన్నమయ్య సర్కిల్‌ వద్ద హోటల్‌ తేజస్విని గ్రాండ్‌ని శుక్రవారం వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రారంభించారు. ఏడు అంతస్తుల్లో ఒక్కో భవనాన్ని సినీతారలు కృతిశెట్టి, హెబ్బాపటేల్‌, యాంకర్‌ శ్యామల, మిమిక్రీ ఆర్టిస్టు శివారెడ్డి, టీవీ ఆర్టిస్టు నిరుపమ, అషురెడ్డి, హిమజ, సిమ్రాన్‌ చౌదరి, హేమంత్‌, భానుశ్రీ, బిగ్‌బాస్‌ 4 ఫైనలిస్ట్‌ ఆరియానా గ్లోరి ప్రారంభించారు. అనంతరం హోటల్‌ బయట ఏర్పాటు చేసిన వేదికపై సందడి చేశారు. వీరిని చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. హోటల్‌లో గదులు, ఆహారపదార్థాలు, నెల్లూరు చేపల పులుసు బాగుందని కొనియాడారు.  కార్యక్రమానికి విచ్చేసిన ప్రతిఒక్కరికీ హోటల్‌ అధినేత తోట శ్రీనివాసులరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని