పల్లెలకు కరెంట్ షాక్
ఉమ్మడి జిల్లాలోని 46 మండలాల్లో పంచాయతీలు రూ.198 కోట్ల విద్యుత్తు బిల్లుల బకాయిలున్నాయని మూడు నెలల కిందట అధికారులు లెక్కతేల్చారు.
చెల్లించాల్సిన బిల్లులు రూ.89 కోట్లు
సర్ఛార్జి రూ.56 కోట్లు
విస్తుపోతున్న అధికారులు
న్యూస్టుడే, నెల్లూరు (జడ్పీ)
వెంకటాచలం మండల పరిధిలో చెముడుగుంట పంచాయతీకి 18 విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. వీటికి ఇటీవల రూ.57 లక్షల విద్యుత్తు బిల్లు చెల్లించాలని ఆశాఖ అధికారులు నోటీసులిచ్చారు. దీనిపై స్పందించిన గ్రామ కార్యదర్శి అంత బిల్లు ఎందుకు వచ్చిందని లోతుగా ఆరా తీశారు. బిల్లులన్నీ లెక్కిస్తే దాదాపు రూ.39 లక్షలు మాత్రమే వచ్చింది. మరి మిగతా రూ.18 లక్షలు ఎందుకు కట్టాలని వారం రోజులుగా విద్యుత్తుశాఖ అధికారుల చుట్టూ ఆయన తిరుగుతున్నా ఫలితం లేకపోయింది. జిల్లాలోని పలు పంచాయతీలకూ ఇదే తరహాలోనే అదనపు బిల్లుల భారం పడింది.
పంచాయతీల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతోంది. ఇప్పటికే రావాల్సిన 15వ ఆర్థిక సంఘాల నిధుల జాడ లేక పరిపాలన నీరసించిన క్రమంలో.. విద్యుత్తు బిల్లులు ఆలస్యంగా చెల్లిస్తున్నారని రాష్ట్ర విద్యుత్తు శాఖ అదనపు వడ్డింపులకు దిగింది. అసలే బిల్లులు కట్టలేక అవస్థ పడుతున్న పంచాయతీలకు ఇది శరాఘాతంగా మారిందని సర్పంచులు, కార్యదర్శులు వాపోతున్నారు.
కొత్త స్తంభాలను తరలిస్తున్న విద్యుత్తు శాఖ అధికారులు
ఉమ్మడి జిల్లాలోని 46 మండలాల్లో పంచాయతీలు రూ.198 కోట్ల విద్యుత్తు బిల్లుల బకాయిలున్నాయని మూడు నెలల కిందట అధికారులు లెక్కతేల్చారు. ఈమేరకు కొత్త జిల్లాలోని 37 మండలాలు రూ.145 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ఇటీవల రూ.5 కోట్ల వరకు జమ చేసినట్లు పంచాయతీ అధికారులు చెబుతున్నాయి. ఇంకా రూ.140 కోట్ల భారం అలాగే ఉంది. అనేక పంచాయతీలకు మీటర్లు కూడా లేని నేపథ్యంలో భారీగా బిల్లులు రావడం ఏంటని పంచాయతీ సిబ్బంది విస్తుపోతున్నారు.
అసలు కన్నా కొసరే ఎక్కువ..
చెల్లించాల్సిన రూ.145 కోట్లలో విద్యుత్తు ఛార్జీలు రూ.89 కోట్లు కాగా పంచాయతీలు ఆలస్యం చేస్తున్నాయని, అదనంగా విద్యుత్తు వాడుతున్నాయని సాకులు చూపి మరో రూ.56 కోట్లు అదనంగా విధించినట్లు విద్యుత్తు శాఖ లెక్కలు చూపింది. ఈ విషయం తెలుసుకున్న పంచాయతీ జిల్లా అధికారులు కూడా కంగుతిన్నారు. బిల్లులు ఎక్కువగా రావడానికి గల కారణాలపై కింది నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు పరిశీలన చేయకపోవడంతో సర్ఛార్జీల విషయం గుట్టుగా ఉంది. కొంత మంది కార్యదర్శులు లోతుగా పరిశీలన చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆర్థిక సంఘాల నిధులొచ్చిన సమయంలో పంచాయతీలపై ఒత్తిడి తెచ్చి కొంత భాగం విద్యుత్తు బిల్లులకు చెల్లించేలా ఒత్తిడి చేస్తున్న జిల్లా అధికారులు.. బిల్లులు, ఇతర ఖర్చులు, చెల్లింపులు తదితరాలను పట్టించుకోకపోవడంతో సర్ఛార్జీల బాదుడు వెలుగులోకి రాలేదు.
అధికారుల నిర్లక్ష్యం.. ప్రగతికి ఆటంకం
ఇంటికి కరెంటు బిల్లు గడువులోగా కట్టకపోతే అపరాధ రుసుం విధిస్తారు. ఇది అందరికీ తెలిసిందే. పంచాయతీ అధికారులు మాత్రం దీన్ని విస్మరించారు. విద్యుత్తు శాఖ అధికారులు అనేక పంచాయతీలకు మీటర్లు బిగించకుండానే బిల్లులు ఎలా వేస్తున్నారనే విషయాన్ని గ్రామస్థాయి అధికారులు పట్టించుకోవడంలేదు. కనీసం వచ్చిన బిల్లులను సకాలంలో చెల్లించలేదు. దాంతో విద్యుత్తుశాఖ సర్ఛార్జి, ఇతర కారణాల పేరుతో పంచాయతీలపై రూ.కోట్లు అదనంగా వసూలు చేస్తోంది. గ్రామాల్లో ప్రగతి పనులకు వాడాల్సిన నిధులను విద్యుత్తు సర్ఛార్జీలకు చెల్లించడం ఏంటని ప్రజలు పెదవి విరుస్తున్నారు.
విద్యుత్తు శాఖకు లేఖలు రాస్తున్నాం
బి.చిరంజీవి, ఇన్ఛార్జి జిల్లా పంచాయతీ అధికారి
గ్రామ పంచాయతీల విద్యుత్తు బిల్లుల బకాయిలపై సర్ఛార్జీల రూపంలో దాదాపు రూ.89 కోట్ల భారం మోపిన విషయం మా సిబ్బంది బయటపెట్టారు. కానీ కొన్ని చిన్న పంచాయతీలకు పలుచోట్ల మీటర్లు లేకుండా బిల్లులు వేస్తున్నారని పలువురు నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై తప్పక స్పందిస్తాం. వెంటనే గ్రామ కార్యదర్శులను అడిగి వివరాలు సేకరిస్తాం. విద్యుత్తు శాఖ అధికారులకూ లేఖలు రాస్తున్నాం. కొద్ది బిల్లులున్న పంచాయతీలు సకాలంలో చెల్లించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండయ్య.. లెక్కే వేరు
[ 26-04-2024]
ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసేవారిలో ఎక్కువ మంది రాజకీయ, ఆర్థిక, సామాజిక బలాలున్న వారే ఉంటున్నారు. కొందరు పార్టీల తరఫున ఇంకొందరు ప్రధాన పార్టీల అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించటానికి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయటం సాధారణం. -
రేపు జిల్లాలో చంద్రబాబు పర్యటన
[ 26-04-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 27వ తేదీ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలలో నిర్వహించే ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. -
యాడుంది శిక్షణ.. అయిదేళ్లూ వంచన
[ 26-04-2024]
అక్కాచెల్లెమ్మలను ఆర్థికంగా ప్రోత్సహించి, అన్ని విధాలా అండగా ఉంటానన్న సీఎం జగన్ మాటలు.. ప్రకటనలకే పరిమితమయ్యాయి. సంక్షేమ పథకాలు అటుంచి.. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి.. నిలదొక్కుకునేలా చూడటంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. -
సోమశిలలో అడుగంటిన జలం
[ 26-04-2024]
జిల్లా వరదాయిని సోమశిల జలాశయంలో నీటి నిల్వలు రోజు రోజుకూ అడుగంటుతున్నాయి. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకోకుండా అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు.. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 230 మంది 283 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
దోచుకున్నది.. వైకాపా ఘనులే!
[ 26-04-2024]
మొదట్లో గ్రావెల్, మట్టి కొల్లగొడుతూ విపక్ష నేతలపై నెట్టేందుకు యత్నించిన అధికార పార్టీ నాయకులు.. క్వార్ట్జ్ వ్యవహారంలోనూ అదే పద్ధతిని అవలంబించారు. తొలుత వాటాలు తేలక వారిలో వారే తిట్టుకున్న జిల్లా నాయకులు.. పార్టీ అధిష్ఠానం జోక్యంతో హద్దులు నిర్ణయించుకుని దోపిడీకి తెగబడ్డారు. -
లక్ష్యంపై గురి.. ర్యాంకుల సిరి
[ 26-04-2024]
కసితో చదివారు.. కుటుంబ నేపథ్యం ఏదైనా కలల సాధనకు తపించారు. లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రుల మోములో ఆనందం నింపారు. జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్స్ రెండో విడత ఫలితాలు గురువారం విడుదల చేశారు. -
చెన్నకేశవుడి వైభవం
[ 26-04-2024]
స్థానిక యర్రబల్లిపాలెం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రథోత్సవం గురువారం కనులపండువగా సాగింది.. -
వేణుగోపాలుడి రథోత్సవం
[ 26-04-2024]
శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారికి రథోత్సవం జరిగింది. -
మద్యం డంపుల సూత్రధారి కాకాణే : సోమిరెడ్డి
[ 26-04-2024]
సర్వేపల్లి నియోజకవర్గంలో లభ్యమవుతున్న మద్యం డంపుల్లో పాత్రదారులు వైకాపా నాయకులైతే.. సూత్రధారి మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డేనని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించారు. -
కోట్ల వ్యయం.. నిరుపయోగం
[ 26-04-2024]
ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో అప్పటి ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైద్య విద్యార్థుల విద్యాభ్యాసంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో శిక్షణ పొందేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం నిరుపయోగంగా మారింది. -
జగన్మాయ.. వైద్యం అందదయా!
[ 26-04-2024]
ఆసుపత్రులను అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్ది పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామన్న ముఖ్యమంత్రి జగన్ మాటలు ఆచరణలో కనిపించడం లేదు. అత్యవసర సమయాల్లో వైద్యానికి వెళితే చేయి చూసే నాథుడు ఉండడం లేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్