ఆపన్నులకు ఇస్తారా అభయం?
వారు ఏ ఆధారం లేని అభాగ్యులు. ఒకరు చేతుల బలంతో నడిచేవారు.. మరొకరు అడుగు తీసి అడుగేయలేనివారు.
సాయం కోసం అవస్థలు
న్యూస్టుడే, నెల్లూరు (కలెక్టరేట్)
వారు ఏ ఆధారం లేని అభాగ్యులు. ఒకరు చేతుల బలంతో నడిచేవారు.. మరొకరు అడుగు తీసి అడుగేయలేనివారు. తమకు చేయూతనందించాలని వీరిద్దరూ కొన్నేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయ్యో పాపమని స్పందించి వారికి సాయం చేసిన నాథులు లేరు. వారం కిందట కలెక్టరేట్కు వచ్చి జిల్లా అధికారులకు మొర పెట్టుకున్నా.. నేటికీ సాయం అందలేదని వారు ‘న్యూస్టుడే’కు తెలిపారు.
మూడేళ్లుగా పండుటాకు ప్రదక్షిణ
సైదాపురం మండలం కలిచేడు గ్రామానికి చెందిన షేక్ హసీనాబేగం వయస్సు 70 ఏళ్లు. ఏ ఆధారం లేదు. ఎవరి అండా లేదు. కనీసం ఉండేందుకు ఇళ్లు కూడా లేదు. వృద్ధాప్యం కారణంగా నడవలేని పరిస్థితి. తనకు పింఛను మంజూరు చేయాలని మూడేళ్లుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఏదో ఒక వంకతో పింఛను మంజూరు చేయడం లేదని ఆమె ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమిచ్చే పింఛను నగదు కొంతవరకైనా ఆదరవుగా ఉంటుందని, ఉన్నతాధికారులైనా స్పందించి తనను ఆదుకోవాలని ఆ పండుటాకు దీనంగా వేడుకుంటున్నారు.
రెండు చేతులే ఆధారం.. కావాలి మీ సహకారం
రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి.. ఆపై పక్షవాతం.. రెండు కాళ్లు పని చేయవు.. ఎక్కడి వెళ్లాలన్నా కుమారుడి సాయం లేనిదే వెళ్లలేని పరిస్థితి. దాంతో కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. మర్రిపాడు మండలం భీమవరం గ్రామానికి చెందిన తిరుపతి కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కొన్నేళ్ల కిందట పక్షవాతం రావడంతో రెండు కాళ్లు చచ్చుపడిపోయాయి. భూమిపై రెండు చేతులు కింద పెట్టి రాకపోకలు సాగించాల్సిన దుస్థితి. దాంతో కూలి పనులకు వెళ్లలేరు. కుమారుడు తోడుంటే.. బాడుగ ఆటోలో తన పనులపై వెళుతుంటారు. ఈక్రమంలో గతనెల 30వ తేదీన బాడుగ ఆటోకు రూ.2 వేలు అద్దె చెల్లించి కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమానికి వచ్చి జిల్లా అధికారులను కలిసి తన దీనగాథను విన్నవించుకున్నారు. తనకు బ్యాటరీ సైకిల్ ఇప్పించాలని కోరారు. ఈరోజు వరకు ఆయనకు అధికారుల నుంచి సమాచారం లేకపోవడంతో దీనంగా ఎదురుచూస్తున్నారు. అధికారులు, దాతలు ఎవరైనా స్పందించి బ్యాటరీ సైకిల్ ఇప్పించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. దీని సాయంతో తాను ఏదోఒక చిన్న వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటానని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండయ్య.. లెక్కే వేరు
[ 26-04-2024]
ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసేవారిలో ఎక్కువ మంది రాజకీయ, ఆర్థిక, సామాజిక బలాలున్న వారే ఉంటున్నారు. కొందరు పార్టీల తరఫున ఇంకొందరు ప్రధాన పార్టీల అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించటానికి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయటం సాధారణం. -
రేపు జిల్లాలో చంద్రబాబు పర్యటన
[ 26-04-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 27వ తేదీ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలలో నిర్వహించే ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. -
యాడుంది శిక్షణ.. అయిదేళ్లూ వంచన
[ 26-04-2024]
అక్కాచెల్లెమ్మలను ఆర్థికంగా ప్రోత్సహించి, అన్ని విధాలా అండగా ఉంటానన్న సీఎం జగన్ మాటలు.. ప్రకటనలకే పరిమితమయ్యాయి. సంక్షేమ పథకాలు అటుంచి.. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి.. నిలదొక్కుకునేలా చూడటంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. -
సోమశిలలో అడుగంటిన జలం
[ 26-04-2024]
జిల్లా వరదాయిని సోమశిల జలాశయంలో నీటి నిల్వలు రోజు రోజుకూ అడుగంటుతున్నాయి. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకోకుండా అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు.. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 230 మంది 283 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
దోచుకున్నది.. వైకాపా ఘనులే!
[ 26-04-2024]
మొదట్లో గ్రావెల్, మట్టి కొల్లగొడుతూ విపక్ష నేతలపై నెట్టేందుకు యత్నించిన అధికార పార్టీ నాయకులు.. క్వార్ట్జ్ వ్యవహారంలోనూ అదే పద్ధతిని అవలంబించారు. తొలుత వాటాలు తేలక వారిలో వారే తిట్టుకున్న జిల్లా నాయకులు.. పార్టీ అధిష్ఠానం జోక్యంతో హద్దులు నిర్ణయించుకుని దోపిడీకి తెగబడ్డారు. -
లక్ష్యంపై గురి.. ర్యాంకుల సిరి
[ 26-04-2024]
కసితో చదివారు.. కుటుంబ నేపథ్యం ఏదైనా కలల సాధనకు తపించారు. లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రుల మోములో ఆనందం నింపారు. జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్స్ రెండో విడత ఫలితాలు గురువారం విడుదల చేశారు. -
చెన్నకేశవుడి వైభవం
[ 26-04-2024]
స్థానిక యర్రబల్లిపాలెం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రథోత్సవం గురువారం కనులపండువగా సాగింది.. -
వేణుగోపాలుడి రథోత్సవం
[ 26-04-2024]
శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారికి రథోత్సవం జరిగింది. -
మద్యం డంపుల సూత్రధారి కాకాణే : సోమిరెడ్డి
[ 26-04-2024]
సర్వేపల్లి నియోజకవర్గంలో లభ్యమవుతున్న మద్యం డంపుల్లో పాత్రదారులు వైకాపా నాయకులైతే.. సూత్రధారి మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డేనని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించారు. -
కోట్ల వ్యయం.. నిరుపయోగం
[ 26-04-2024]
ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో అప్పటి ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైద్య విద్యార్థుల విద్యాభ్యాసంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో శిక్షణ పొందేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం నిరుపయోగంగా మారింది. -
జగన్మాయ.. వైద్యం అందదయా!
[ 26-04-2024]
ఆసుపత్రులను అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్ది పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామన్న ముఖ్యమంత్రి జగన్ మాటలు ఆచరణలో కనిపించడం లేదు. అత్యవసర సమయాల్లో వైద్యానికి వెళితే చేయి చూసే నాథుడు ఉండడం లేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్