ప్రభాస్.. శెభాష్
కూలీ పనులు..ఆపై రెండు పాడిగేదెలు. అవే వారి జీవనాధారం. తమ బిడ్డలకు కష్టం రాకూడదని శ్రమించిన దంపతులు .. ఇద్దరు కుమారులను బాగా చదివించారు.
న్యూస్టుడే, ఆత్మకూరు: కూలీ పనులు..ఆపై రెండు పాడిగేదెలు. అవే వారి జీవనాధారం. తమ బిడ్డలకు కష్టం రాకూడదని శ్రమించిన దంపతులు .. ఇద్దరు కుమారులను బాగా చదివించారు. వీరి పెద్ద కుమారుడు ప్రభాస్రెడ్డి అనంతపురం జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేశారు. క్యాంపస్ ఇంటర్వ్యూలోనే రూ. 10 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించారు. ఆపై ‘గేట్’లో 135 ర్యాంకు సాధించి ప్రశంసలు పొందుతున్నారు. ఈ విద్యార్థి ప్రస్థానాన్ని పరిశీలిస్తే..
ఆత్మకూరు పట్టణం మేధరవీధికి చెందిన ఒంటేరు లక్ష్మణరెడ్డి- మంజులమ్మ దంపతులు కూలీ ఆధారంగా జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ప్రభాస్రెడ్డి, రోహిత్రెడ్డి. ప్రభాస్రెడ్డి పాఠశాల నుంచి చదువులో ప్రతిభ చూపారు. పాఠశాల విద్య స్థానిక రవీంద్రభారతి పాఠశాలలో పూర్తిచేశారు. 10వ తరగతిలో 9.7 జీపీఏ సాధించారు. విద్యార్థి ప్రతిభను గుర్తించిన నెల్లూరు విశ్వసాయి జూనియర్ కళాశాల నిర్వాహకులు ఉచితంగా మొదటి సంవత్సరం ప్రవేశం కల్పించారు. తల్లిదండ్రుల కష్టాలను చూస్తూ పెరిగిన ప్రభాస్ ఇంటర్లో శ్రమించి ప్రతిభ చూపారు. 970 మార్కులు సాధించారు. ఎంసెట్లో ర్యాంకు సాధించి అనంతపురం జేఎన్టీయూలో ప్రవేశం పొందారు. 80 శాతంపైనే మార్కులతో ఇంజినీరింగు మూడు సంవత్సరాలు పూర్తి చేశారు. నాలుగో ఏడాది క్యాంపస్ ఇంటర్వ్యూలో ఫ్యాక్ట్సెట్ అనే కంపెనీ హైద్రరాబాద్లో కొలువు ఇచ్చింది. ఈ ఉద్యోగంలో చేరిన ప్రభాస్ గేట్ పరీక్షలు రాశారు. అదే క్రమంలో 135 ర్యాంకు సాధించి దేశంలో ఏ ఐఐటీలో అయినా ప్రవేశం పొందేలా అర్హత సాధించారు. ఇలా పేద కుటుంబం నుంచి వచ్చిన ప్రభాస్రెడ్డి ప్రతిభతో ఐఐటీలో ఎంటెక్ చేయనున్నారు.
తల్లిదండ్రుల కష్టమే స్ఫూర్తి
- ప్రభాస్రెడ్డి
మా చదువులకు అమ్మానాన్న ఎంత కష్టపడుతున్నారో దగ్గర నుంచి చూశాం. వారి కష్టాలు తీరాలంటే బాగా చదవాలనే ఆలోచన మనస్సులో నిలిచిపోయింది. దీంతో శ్రమించి చదవడంతో మంచి ఫలితాలు వచ్చాయి. రూ. 10 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. గేట్లో మంచి ర్యాంకు సాధించా. ఐఐటీ ముంబయి, బెంగళూరుల్లోని ఐఐటీలో ఒకదానిలో ఎంటెక్లో చేరి పూర్తి చేస్తా. సాఫ్ట్వేర్ నిపుణుడిగా రాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలంటే శ్రమించాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండయ్య.. లెక్కే వేరు
[ 26-04-2024]
ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసేవారిలో ఎక్కువ మంది రాజకీయ, ఆర్థిక, సామాజిక బలాలున్న వారే ఉంటున్నారు. కొందరు పార్టీల తరఫున ఇంకొందరు ప్రధాన పార్టీల అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించటానికి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయటం సాధారణం. -
రేపు జిల్లాలో చంద్రబాబు పర్యటన
[ 26-04-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 27వ తేదీ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలలో నిర్వహించే ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. -
యాడుంది శిక్షణ.. అయిదేళ్లూ వంచన
[ 26-04-2024]
అక్కాచెల్లెమ్మలను ఆర్థికంగా ప్రోత్సహించి, అన్ని విధాలా అండగా ఉంటానన్న సీఎం జగన్ మాటలు.. ప్రకటనలకే పరిమితమయ్యాయి. సంక్షేమ పథకాలు అటుంచి.. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి.. నిలదొక్కుకునేలా చూడటంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. -
సోమశిలలో అడుగంటిన జలం
[ 26-04-2024]
జిల్లా వరదాయిని సోమశిల జలాశయంలో నీటి నిల్వలు రోజు రోజుకూ అడుగంటుతున్నాయి. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకోకుండా అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు.. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 230 మంది 283 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
దోచుకున్నది.. వైకాపా ఘనులే!
[ 26-04-2024]
మొదట్లో గ్రావెల్, మట్టి కొల్లగొడుతూ విపక్ష నేతలపై నెట్టేందుకు యత్నించిన అధికార పార్టీ నాయకులు.. క్వార్ట్జ్ వ్యవహారంలోనూ అదే పద్ధతిని అవలంబించారు. తొలుత వాటాలు తేలక వారిలో వారే తిట్టుకున్న జిల్లా నాయకులు.. పార్టీ అధిష్ఠానం జోక్యంతో హద్దులు నిర్ణయించుకుని దోపిడీకి తెగబడ్డారు. -
లక్ష్యంపై గురి.. ర్యాంకుల సిరి
[ 26-04-2024]
కసితో చదివారు.. కుటుంబ నేపథ్యం ఏదైనా కలల సాధనకు తపించారు. లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రుల మోములో ఆనందం నింపారు. జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్స్ రెండో విడత ఫలితాలు గురువారం విడుదల చేశారు. -
చెన్నకేశవుడి వైభవం
[ 26-04-2024]
స్థానిక యర్రబల్లిపాలెం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రథోత్సవం గురువారం కనులపండువగా సాగింది.. -
వేణుగోపాలుడి రథోత్సవం
[ 26-04-2024]
శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారికి రథోత్సవం జరిగింది. -
మద్యం డంపుల సూత్రధారి కాకాణే : సోమిరెడ్డి
[ 26-04-2024]
సర్వేపల్లి నియోజకవర్గంలో లభ్యమవుతున్న మద్యం డంపుల్లో పాత్రదారులు వైకాపా నాయకులైతే.. సూత్రధారి మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డేనని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించారు. -
కోట్ల వ్యయం.. నిరుపయోగం
[ 26-04-2024]
ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో అప్పటి ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైద్య విద్యార్థుల విద్యాభ్యాసంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో శిక్షణ పొందేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం నిరుపయోగంగా మారింది. -
జగన్మాయ.. వైద్యం అందదయా!
[ 26-04-2024]
ఆసుపత్రులను అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్ది పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామన్న ముఖ్యమంత్రి జగన్ మాటలు ఆచరణలో కనిపించడం లేదు. అత్యవసర సమయాల్లో వైద్యానికి వెళితే చేయి చూసే నాథుడు ఉండడం లేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా