ఆ మాంసం తింటే అంతే!
కార్పొరేషన్, న్యూస్టుడే: కేరళలో.. పాడైన మాంసంతో వండివార్చిన ఆహారం తిన్న పదకొండో తరగతి విద్యార్థి అన్యాయంగా బలైపోతే.. అదే వంటకాన్ని ఆరగించిన మరో 60 మంది ఆసుపత్రి పాలయ్యారు.
ఓ హోటల్పై ఎన్ఎంసీ అధికారుల దాడులు
నోటీసులు జారీ
అధికారుల తనిఖీల్లో గుర్తించిన నిల్వ మాంసం
ఈనాడు డిజిటల్, నెల్లూరు: కార్పొరేషన్, న్యూస్టుడే: కేరళలో.. పాడైన మాంసంతో వండివార్చిన ఆహారం తిన్న పదకొండో తరగతి విద్యార్థి అన్యాయంగా బలైపోతే.. అదే వంటకాన్ని ఆరగించిన మరో 60 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఆ తర్వాత.. తీరిగ్గా కళ్లు తెరిచిన అధికారులు.. ఆహార భద్రతా ప్రమాణాలు పాతిపెడుతున్నారంటూ సుమారు 200 హోటళ్లను మూయించారు. ఈ కేసులో నిందితులు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా- ‘ప్రజారోగ్యం పట్ల దేశంలో మనం వ్యహరించేంత ఉదాసీనంగా ఇంకెవరూ ఉండర’ని చెప్పి బెయిల్ నిరాకరిస్తూ ఆవేదన వెలిబుచ్చింది. నెల్లూరు నగరంలోనూ ఇంచుమించు పరిస్థితి అలాగే ఉంటోంది. అధికారుల తనిఖీల్లో తరచూ కుళ్లిన మాంసం.. రోజుల కొద్దీ ఫ్రిజ్లో నిల్వ చేసిన ఆహారం.. అపరిశుభ్రత మధ్యే వంటలు.. డ్రైనేజీల పక్కనే గ్యాస్ స్టవ్లు.. అడ్డగోలుగా రంగులు గుప్పించిన పదార్థాలు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో హోటళ్లకు వెళ్లాలంటేనే జనం భయపడాల్సిన పరిస్థితి.
ఫిర్యాదుల నేపథ్యంలో..
నెల్లూరులోని ఓ హోటల్లో నగరపాలక సంస్థ అధికారులు శనివారం తనిఖీలు చేశారు. సుమారు వంద కిలోలకు పైగా మాంసం, చేపలు, రొయ్యలు ఫ్రిజ్లో నిల్వ ఉన్నట్లు గుర్తించారు. వండిన వాటిలో మిగిలిన ఆహార పదార్థాలను.. వండని మాంసంలో కలిపి పెట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మాంసం వ్యర్థాలనూ అదే ఫ్రిజ్లో పెట్టారు. దానికి తోడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంలో నిబంధనలు పాటించడం లేదని.. మిఠాయిలు, ఇతర ప్యాకేజీ చేసిన ఆహార పదార్థాలపై గడువు తేదీ వేయలేదని గుర్తించారు. ఆ పరిస్థితులపై నగరపాలక సంస్థ ఎంహెచ్వో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల హోటల్లో ఆహారం తీసుకున్న వినియోగదారులు అనారోగ్యానికి గురయ్యారని, దానిపై నిర్వాహకులు సరిగ్గా స్పందించలేదని తమకు ఫిర్యాదు చేశారని, ఆ మేరకు తనిఖీలు చేశామని ఎన్ఎంసీ అధికారులు తెలిపారు.
రూ. లక్ష జరిమానా
తనిఖీలకు వెళ్లిన నగరపాలక సిబ్బందితో హోటల్ సిబ్బంది వాగ్వాదానికి దిగారు. మా దగ్గర తాజా ఆహారం ఉందని.. దానికి సంబంధించిన ఓచర్లు ఉన్నాయని, ల్యాబ్కు పంపించి తనిఖీలు చేయకుండా నిల్వ మాంసం అని ఎలా నిర్ధారిస్తారని అధికారులను ప్రశ్నించారు. దానికి స్పందించిన అధికారి.. ఈ రోజు కొన్న మాంసం ఫ్రీజర్లో పెట్టాల్సిన అవసరం ఏమిటని? అసలు మీ దగ్గర పనిచేసే సిబ్బంది ఆరోగ్యంగా ఉన్నట్లు ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయా? వండిన ఆహారాన్ని పచ్చి మాంసంతో కలిపిపెట్టారు. దాన్నే ప్రజలకు పెడతారా? అని ప్రశ్నించారు. ఇక్కడ ఫ్రిజ్లో పెట్టిన మాంసం వండి పెడతామని వినియోగదారుడికి తెలిసేలా బయట బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. హోటల్ నిర్వాహకులకు రూ.లక్ష జరిమానా విధించడంతో పాటు..నోటీసులు జారీ చేశారు.
నిల్వ ఆహారం అమ్మితే కఠిన చర్యలు
వెంకటరమణ, ఎంహెచ్వో : వినియోగదారుల ఫిర్యాదు మేరకు తనిఖీ చేశాం. ఫ్రీజర్లో నిల్వ చేసిన మాంసం ఉంది. పచ్చి మాంసంతో పాటు వండిన పదార్థాలనూ అందులోనే ఉంచారు. మాంసం వ్యర్థాలను కవర్లో పెట్టి ఫ్రిజ్లో పెట్టారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదు. నాణ్యతలేని ఆహారం విక్రయించేందుకు ఉంచడంతో పాటు.. అధికారుల విధులకు ఆటంకం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా నిల్వ చేసిన ఆహారం విక్రయిస్తే.. భారీ జరిమానా విధించడంతో పాటు, హోటల్ సీజ్ చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండయ్య.. లెక్కే వేరు
[ 26-04-2024]
ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసేవారిలో ఎక్కువ మంది రాజకీయ, ఆర్థిక, సామాజిక బలాలున్న వారే ఉంటున్నారు. కొందరు పార్టీల తరఫున ఇంకొందరు ప్రధాన పార్టీల అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించటానికి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయటం సాధారణం. -
రేపు జిల్లాలో చంద్రబాబు పర్యటన
[ 26-04-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 27వ తేదీ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలలో నిర్వహించే ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. -
యాడుంది శిక్షణ.. అయిదేళ్లూ వంచన
[ 26-04-2024]
అక్కాచెల్లెమ్మలను ఆర్థికంగా ప్రోత్సహించి, అన్ని విధాలా అండగా ఉంటానన్న సీఎం జగన్ మాటలు.. ప్రకటనలకే పరిమితమయ్యాయి. సంక్షేమ పథకాలు అటుంచి.. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి.. నిలదొక్కుకునేలా చూడటంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. -
సోమశిలలో అడుగంటిన జలం
[ 26-04-2024]
జిల్లా వరదాయిని సోమశిల జలాశయంలో నీటి నిల్వలు రోజు రోజుకూ అడుగంటుతున్నాయి. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకోకుండా అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు.. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 230 మంది 283 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
దోచుకున్నది.. వైకాపా ఘనులే!
[ 26-04-2024]
మొదట్లో గ్రావెల్, మట్టి కొల్లగొడుతూ విపక్ష నేతలపై నెట్టేందుకు యత్నించిన అధికార పార్టీ నాయకులు.. క్వార్ట్జ్ వ్యవహారంలోనూ అదే పద్ధతిని అవలంబించారు. తొలుత వాటాలు తేలక వారిలో వారే తిట్టుకున్న జిల్లా నాయకులు.. పార్టీ అధిష్ఠానం జోక్యంతో హద్దులు నిర్ణయించుకుని దోపిడీకి తెగబడ్డారు. -
లక్ష్యంపై గురి.. ర్యాంకుల సిరి
[ 26-04-2024]
కసితో చదివారు.. కుటుంబ నేపథ్యం ఏదైనా కలల సాధనకు తపించారు. లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రుల మోములో ఆనందం నింపారు. జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్స్ రెండో విడత ఫలితాలు గురువారం విడుదల చేశారు. -
చెన్నకేశవుడి వైభవం
[ 26-04-2024]
స్థానిక యర్రబల్లిపాలెం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రథోత్సవం గురువారం కనులపండువగా సాగింది.. -
వేణుగోపాలుడి రథోత్సవం
[ 26-04-2024]
శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారికి రథోత్సవం జరిగింది. -
మద్యం డంపుల సూత్రధారి కాకాణే : సోమిరెడ్డి
[ 26-04-2024]
సర్వేపల్లి నియోజకవర్గంలో లభ్యమవుతున్న మద్యం డంపుల్లో పాత్రదారులు వైకాపా నాయకులైతే.. సూత్రధారి మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డేనని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించారు. -
కోట్ల వ్యయం.. నిరుపయోగం
[ 26-04-2024]
ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో అప్పటి ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైద్య విద్యార్థుల విద్యాభ్యాసంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో శిక్షణ పొందేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం నిరుపయోగంగా మారింది. -
జగన్మాయ.. వైద్యం అందదయా!
[ 26-04-2024]
ఆసుపత్రులను అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్ది పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామన్న ముఖ్యమంత్రి జగన్ మాటలు ఆచరణలో కనిపించడం లేదు. అత్యవసర సమయాల్లో వైద్యానికి వెళితే చేయి చూసే నాథుడు ఉండడం లేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక