ఆహ్లాదం.. హామీలకే పరిమితం
ఆత్మకూరు పట్టణ ప్రజలు కాసింత సేదతీరటానికి ఏర్పాటు చేస్తామన్న ఉద్యానవనాలు హామీలు అమలుకు నోచుకోలేదు. జిల్లాలో ముఖ్య పట్టణాల్లో ఆత్మకూరుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ గత పాలక వర్గం కాలంలో ఉద్యానవనాల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు.
ఆత్మకూరు పట్టణ ప్రజలు కాసింత సేదతీరటానికి ఏర్పాటు చేస్తామన్న ఉద్యానవనాలు హామీలు అమలుకు నోచుకోలేదు. జిల్లాలో ముఖ్య పట్టణాల్లో ఆత్మకూరుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ గత పాలక వర్గం కాలంలో ఉద్యానవనాల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు. సోమశిల నీటి శుద్ధి విభాగం పక్క స్థలంలో పనులు సైతం మొదలు పెట్టారు. ఆవరణ చదును చేసి చుట్టూ ప్రహరీ పునాదులు నిర్మించే సమయానికి రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. దాంతో పనులు అర్ధాంతరంగా ఆగాయి. ఆపై పనుల్లో కదలిక లేదు.
ఆత్మకూరు, న్యూస్టుడే: పట్టణంలో ఉద్యానవనాల నిర్మాణంపై నాయకులు అనేక హామీలు ఇచ్చారు. అయినా కార్యరూపంలోకి రాలేదు. పట్టణంలో ఇప్పటి వరకు నాలుగు ప్రాంతాల్లో ఉద్యానవనాలు నిర్మించాలని సంకల్పించారు. సోమశిల నీటి శుద్ధి విభాగం పక్కన, బస్టాండు సమీపంలోని ఎస్పీకాలనీ మధ్య, ఆత్మకూరు చెరువు, సోమశిల రోడ్డు మధ్య, ఏపీటిడ్కో భవనాల వద్ద వీటిని నిర్మించాలని నిర్ణయించారు.
వీటిలో సోమశిల నీటిశుద్ధి విభాగం వద్ద మంజూరైన ఉద్యానవనం నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆగాయి. దీని కోసం తెప్పించిన వ్యాయామ పరికరాలను పాత పురపాలక కార్యాలయం ఆవరణలºని నేతాజీ క్లబ్లో ఏర్పాటు చేశారు. ఎస్సీ కాలనీ మధ్యలో నిర్మించే ఉద్యానవనం పనులు ముందుకు సాగలేదు. ఇటీవల ప్రతిపాదనలు పెట్టినా ఇంకా కార్యరూపంలోకి రాలేదు. చెరువు పక్కన ఉద్యానవనం.. బోట్ షికారు పనులు కార్యరూపంలోకి రాలేదు. ఏపీ టిడ్కో సముదాయం మధ్య ఉద్యానవనం పనులు కొంతమేరకు జరిగినా ఆగిపోయి ఉన్నాయి. టిడ్కో భవనాల మధ్య తలపెట్టిన ఉద్యానవనానికి వ్యాయామ పరికరాలు తెప్పించారు. వాటిని బిగించక అలానే పక్కన వదిలేశారు. దాంతో అవి తుప్పుపడుతున్నాయి. సంవత్సరాల తరబడి వీటిని నిర్లక్ష్యంగా వదిలివేశారు.
అవన్నీ గతంలోని ప్రతిపాదనలే
ఫజులుల్లా కమిషనర్ ఆత్మకూరు పురపాలకం
ప్రస్తుతం ఎలాంటి ప్రతిపాదనలు లేవు. గతంలో బస్టాండు సమీపంలోని ఉద్యానవనం నిర్మాణానికి ప్రతిపాదనలు పెట్టి ఉన్నారు. ఇంకా కార్యరూపంలోకి రాలేదు. మిగిలిన ఉద్యానవనాల విషయం తెలియదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనసేన విస్తృత ప్రచారం
[ 27-04-2024]
జనసేన కావలి నియోజకవర్గం ఇన్ఛార్జి అళహరి సుధాకర్ అధ్యక్షతన కృష్ణా-పెన్నా వీర మహిళ కమిటీ మెంబర్ నాగరత్నం యాదవ్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. -
లారీని ఢీకొట్టిన కంటైనర్.. ఇద్దరు మృతి
[ 27-04-2024]
నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని తుమ్మలపెంట జాతీయ రహదారి వద్ద మినీ లారీని వెనుక నుంచి కంటైనర్ ఢీకొట్టింది. -
రాష్ట్రంలో దొంగలు పడ్డారు.. కాపాడుకోవాలి: చంద్రబాబు
[ 27-04-2024]
కూటమి ప్రభుత్వం రాగానే అంగన్వాడీలు, హోంగార్డులు, ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. -
చెరువును కాపాడుకుందాం
[ 27-04-2024]
కావలి పట్టణంలోని మందాటి చెరువును కాపాడుకుందాం అంటూ ముసునూరు వాసులు నిరసన ర్యాలీ చేపట్టారు. -
ఇష్టంతో చదివితే కొలువులు
[ 27-04-2024]
ఇష్టంతో చదివితే కొలువులు సులువుగా వస్తాయని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మన్ డాక్టర్ పి.గుణశేఖర్ తెలిపారు. -
తెదేపా సూపర్ సిక్స్ పథకాలపై ప్రచారం
[ 27-04-2024]
దగదర్తిలోని పెద్దపుత్తేడు గ్రామం అరుంధతి వాడలో మండల తెదేపా నాయకుడు మాలేపాటి రవీంద్ర నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
[ 27-04-2024]
వైద్యసేవలు ప్రతి ఇంటికి అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం.. హెల్త్ క్లినిక్ సెంటర్లను ఏర్పాటు చేసింది. వైద్యసేవలను అందించేందుకు ఎంఎల్హెచ్పీలు సిబ్బందిని నియమించారు. -
ఉన్నత విద్య.. జగన్ మిథ్య
[ 27-04-2024]
విశ్వవిద్యాలయాలు ప్రగతిపథంలో నడవాలన్నా.. విద్యార్థులు చేరేందుకు పోటీపడాలన్నా.. పేరున్న విదేశీ విశ్వవిద్యాలయాలు అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు రావాలన్నా.. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
జిల్లాలో సాధారణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ముగిసింది. శుక్రవారం నెల్లూరు పార్లమెంటు, ఎనిమిది నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. -
నేడు తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన
[ 27-04-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.25కు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. -
ఓటుతో.. వైకాపాను తరిమికొడదాం
[ 27-04-2024]
‘ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా వైకాపా అరాచక పాలనకు చరమగీతం పాడాలి. ప్రజల సంక్షేమం.. అభివృద్ధే లక్ష్యంగా పనిచేసే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిగా కాదు.. -
అధికారమే అండ.. ఆక్రమణలే అజెండా!
[ 27-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక సాగునీటి వనరులకు రక్షణ లేకుండా పోయింది. ఖాళీగా కనిపిస్తే చాలు.. అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. సాగునీటి కాలువలనే ఆలోచన లేకుండా కబ్జా చేస్తున్నారు. -
నిమ్మధరలు ఆశాజనకం
[ 27-04-2024]
పొదలకూరు నిమ్మ మార్కెట్లో శుక్రవారం 80 కిలోల నిమ్మకాయల బస్తా రూ.9500 పలికింది. రెండు రోజుల నుంచి నిమ్మ ధరల్లో అనూహ్యమైన మార్పు వచ్చింది. -
ఎన్నికల్లో అక్రమాలపై కఠినంగా వ్యవహరించండి
[ 27-04-2024]
ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని జిల్లా పోలీసు పరిశీలకులు అశోక్ టి దుధే పోలీసు అధికారులకు సూచించారు. -
జగనన్నా.. గొంతెండుతోందయ్యా!
[ 27-04-2024]
ఎండలు మండిపోతున్నాయి. నీటి వనరులు వట్టిపోతున్నాయి. దాహం తీర్చుకోవడానికి చుక్క నీరు దొరకడం లేదు. గొంతులు తడారిపోతున్నాయి. -
పట్టణాభివృద్ధిలో వైశ్యుల పాత్ర కీలకం: తెదేపా
[ 27-04-2024]
పట్టణ అభివృద్ధిలో ఆర్యవైశ్యుల పాత్ర కీలకమైందని తెదేపా అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని 30వ వార్డులో తెదేపా ఎన్నికల కార్యాలయాన్ని ఆర్యవైశ్య నాయకులు గాదంశెట్టి వేణుగోపాల్ నేతృత్వంలో ప్రారంభించారు. -
బాలయ్యా.. మా గుండెల్లో నీవేనయ్యా!
[ 27-04-2024]
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం కావలి, గుడ్లూరులో పర్యటించారు. -
జగన్ సర్కార్ ఉత్తుత్తి సాయం
[ 27-04-2024]
మహిళలను ఆర్థికంగా లక్షాధికారులు చేయాలనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం రుణాలు అందజేస్తామనీ, వృత్తి శిక్షణ కార్యక్రమాలు చేపడతామనే ఆశయం గాడి తప్పింది. -
వైకాపా పాలనలో కూలేందుకు సిద్ధం
[ 27-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో గ్రామీణ ప్రాంత ప్రజలకు అవస్థలు తప్పడం లేదు... పలు గ్రామాల్లో వంతెనలు శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి...
తాజా వార్తలు (Latest News)
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!