logo

చెరువును కాపాడుకుందాం

కావలి పట్టణంలోని మందాటి చెరువును కాపాడుకుందాం అంటూ ముసునూరు వాసులు నిరసన ర్యాలీ చేపట్టారు.

Updated : 27 Apr 2024 16:32 IST

కావలి: కావలి పట్టణంలోని మందాటి చెరువును కాపాడుకుందాం అంటూ ముసునూరు వాసులు నిరసన ర్యాలీ చేపట్టారు. శనివారం మందాటి చెరువు కట్టపై ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిరక్షణ సమితికి చెందిన విశ్రాంత అధ్యాపకులు కనుమూరు బాపిరెడ్డి మాట్లాడుతూ.. చెరువు ఆక్రమణలకు గురి కావడం బాధాకరమన్నారు. అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఆక్రమణల నుంచి చెరువులు కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మందాకిరణ్, కోటేశ్వరరావు, రమణయ్య, జార్జి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని