నెల్లూరు గళం పార్లమెంట్లో వినిపిస్తాం
నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొప్పుల రాజు గతంలో ఈ జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఇక్కడి సమస్యలపై ఆయనకు అవగాహన ఉంది.
హామీల పత్రం చూపుతున్న వై.ఎస్. షర్మిల, ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు, చిత్రంలో అసెంబ్లీ అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డి, దేవకుమార్రెడ్డి
కోవూరు, న్యూస్టుడే: నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొప్పుల రాజు గతంలో ఈ జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఇక్కడి సమస్యలపై ఆయనకు అవగాహన ఉంది. ఎంపీగా గెలిపిస్తే.. దిల్లీలో మీ కోసం పోరాడుతారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రజలను కోరారు. ఆదివారం కోవూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే.. పదేళ్ల పాటు ప్రత్యేక హోదా తీసుకొచ్చి.. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కొప్పుల రాజు మాట్లాడుతూ.. తాను కలెక్టర్గా విధులు నిర్వహించిన సమయంలో ఇక్కడ జరిగిన సారా వ్యతిరేక, అక్షరాస్యత, పొదుపు ఉద్యమాలకు సహకారం అందించానన్నారు. ఇప్పుడు మళ్లీ జిల్లాలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే.. వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు కలిగే ప్రయోజనాలను, ఇచ్చిన హామీలను వివరించారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి వెంటనే పూర్తి చేయాల్సి ఉన్నా.. సీఎం జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. కోవూరు అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు దేవకుమార్రెడ్డి, సీపీఎం నాయకులు జొన్నలగడ్డ వెంకమరాజు, శేషయ్య, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దారులిలా.. సాగేదెలా?
[ 18-05-2024]
గ్రామీణ రహదారుల అభివృద్ధిని పాలకులు విస్మరించారు. అవి అధ్వాన స్థితికి చేరినా.. అభివృద్ధి మాట దేవుడెరుగు? కనీస మరమ్మతులనూ పట్టించుకోలేదు. -
కత్తి దూసిన ఉన్మాదం
[ 18-05-2024]
తనతో పెళ్లికి నిరాకరించారని కక్ష పెంచుకున్న ఓ యువకుడు.. యువతితో పాటు ఆమె తల్లిపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ ఉన్మాద సంఘటన వింజమూరులోని పాతూరులో శుక్రవారం చోటు చేసుకుంది. నిందితుడు బాధితులకు సమీప బంధువు కావడం గమనార్హం. -
ఓట్ల లెక్కింపునకు సన్నద్ధం కావాలి
[ 18-05-2024]
ఓట్ల లెక్కింపునకు సన్నద్ధం కావాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. శుక్రవారం రిటర్నింగ్, నోడల్ అధికారులతో వెబెక్స్ సమావేశాన్ని నిర్వహించారు. -
సంగం చుట్టూ.. సవాళ్లెన్నో!
[ 18-05-2024]
సంగం బ్యారేజీ ప్రారంభించాం.. ఇక తమకేమీ సంబంధం లేదన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తుండటంతో అయిదు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సరఫరా సమస్యాత్మకంగా మారింది. -
వేసవి శిబిరాలు.. సృజనకు సోపానాలు
[ 18-05-2024]
చిరిగిన చొక్కా అయినా తొడుక్కో .. కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్న.. కందుకూరి వీరేశలింగం సూక్తి పుస్తకాల ప్రాముఖ్యాన్ని తెలియజేస్తోంది. -
డీకే మహిళా కళాశాలలో వినూత్న విద్యాబోధన
[ 18-05-2024]
డిగ్రీ, పీజీ కోర్సులతోపాటు ఆనర్స్ డిగ్రీ కోర్సుల్లో విద్యాబోధన అందిస్తున్న నెల్లూరు నగరంలోని దొడ్ల కౌశల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాలలో త్వరలో స్టూడియో ద్వారా విద్యాబోధన జరగనుంది. -
కొండెక్కిన చికెన్ ధర
[ 18-05-2024]
కూరగాయలు, నిత్యావసరాల ధరలు అందనంతదూరంలో ఉండగా.. కోళ్లు, గుడ్ల ధరలు కొండెక్కాయి. జిల్లాలో నెల వ్యవధిలో కోళ్ల ధరలు రూ.100-120.. గుడ్ల ధర డజను రూ.20 పెరిగింది. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
[ 18-05-2024]
మన్నేటికోట అడ్డరోడ్డు వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.
తాజా వార్తలు (Latest News)
-
శస్త్రచికిత్సలో అపశ్రుతి.. యువతి చనిపోయినా చెప్పకుండా దాచిన వైద్యులు
-
బెంబేలెత్తిస్తున్న ‘ఎస్బీఐ’ సందేశం
-
ఎప్సెట్ ఫలితాలు నేడే
-
ఫోన్ తీయట్లేదని.. చంపేశాడట
-
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
-
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!