అవ్వా తాతాలకు.. పింఛన్ టెన్షన్
జిల్లాలో 37 మండలాలు, 768 గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి. వీటి పరిధిలో ప్రస్తుతం 3,15,423 మంది పింఛనుదారులున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పింఛన్ల మంజూరు నుంచి పంపిణీ వరకు లబ్ధిదారులను వంచనకు గురిచేస్తోంది.
నాడు : తెదేపా ప్రభుత్వ హయాంలో అర్హులైన వారికి తెలుపు రేషన్ కార్డు ప్రామాణికంగా పింఛన్లు మంజూరు చేశారు. ఒకసారి పింఛను లబ్ధిదారునిగా నమోదయ్యాక మధ్యలో తొలగించేవారే లేరు. పింఛనుదారులు ఏదైనా కారణంతో ఒకటి, రెండు నెలలు వరుసగా పింఛను తీసుకోలేకపోతే మూడు నెలల మొత్తం సొమ్ము కలిపి చెల్లించారు. జీవనోపాధి నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లినవారు రెండు నెలలకొకసారి స్వగ్రామానికి వచ్చి తీసుకునేవారు. ఒక నెల అందకుంటే తరువాత అయినా తీసుకోవచ్చనే ధీమా పింఛనుదారుల్లో ఉండేది.
నేడు: ప్రస్తుత వైకాపా ప్రభుత్వంలో పింఛనుదారులు ప్రతి నెలా ఆందోళన చెందాల్సి వస్తోంది. ఒకసారి పింఛను ఇస్తున్నారు కదా... బతికున్నంత కాలం అందుతుందనుకుంటే పొరపాటే. ఆరంచెల పరిశీలనలో ఎప్పుడైనా వాటిని తొలగించేయచ్చు. ఏదైనా కారణంతో ఒక నెల అందుకోకపోతే ఆ డబ్బులు హుష్కాకే. ఈ భయంతో లబ్ధిదారులు జీవనోపాధికి దూర ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నారు. వెళ్లినవారు వారు నెలనెలా పింఛనుకు వచ్చి అందులో సగం రవాణా ఛార్జీలకే ఖర్చు చేయాల్సి వస్తోంది.
న్యూస్టుడే, దుత్తలూరు : జిల్లాలో 37 మండలాలు, 768 గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి. వీటి పరిధిలో ప్రస్తుతం 3,15,423 మంది పింఛనుదారులున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పింఛన్ల మంజూరు నుంచి పంపిణీ వరకు లబ్ధిదారులను వంచనకు గురిచేస్తోంది. మొదట్లో ప్రభుత్వం కొత్త పింఛన్లకు ప్రతినెలా వచ్చే దరఖాస్తుల్లో అర్హులైన వారికి తరువాత నెలలోనే మంజూరు చేస్తామని ప్రకటించింది. అనంతరం కొద్ది రోజులకే ‘అబ్బే... నెలనెలా కొత్తవి మంజూరు చేయలేం... ఆరు నెలలకొకసారి మాత్రమే ఇస్తామని ప్రకటించింది. వాటికి కూడా ఆరు దశల ఆంక్షలు పెట్టింది. పింఛనుకు దరఖాస్తు చేసుకునేవారికి అయిదెకరాలపైన భూమి, ఇల్లు పెద్దగా, ఇంట్లో ఎవరూ నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉండకూడదు. విద్యుత్తు వినియోగం 300 యూనిట్లకు మించకూడదు. ఆదాయ పన్ను చెల్లించకూడదనే నిబంధనలు విధించారు. ఇదిలా ఉండగా ప్రతి ఆరు నెలలకొకసారి ఓ చేత్తో కొత్త పింఛన్లు ఇస్తూనే... మరోవైపు పాతవి తొలగిస్తున్నారు.
గతంలో వృద్ధాప్య పింఛను అందుకునే పురుషులు ఎవరైనా చనిపోతే వారి భార్యకు ఒకటి, రెండు నెలల్లో వితంతు పింఛను మంజూరు చేసి ఆర్థిక భరోసా కల్పించారు. ప్రస్తుతం ఆరు నెలల వరకు మంజూరు చేయటంలేదు. జిల్లాలో ఇలాంటి అవస్థలు పడుతున్న వితంతువులు ప్రతి మండలంలో పదుల సంఖ్యలో ఉన్నారు. పింఛను వస్తూ ఏదైనా కారణంగా ఆగిపోతే దాని పునరుద్ధరణకు కూడా ఆరు నెలలు ఆగాల్సిన దుస్థితి నెలకొంది. తెదేపా హయాంలో ఒక నెల ఆగితే, మరుసటి నెలలోనే లబ్ధిదారుని పింఛన్ పునరుద్ధరించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. కొత్త వాటికి నెలల తరబడి నిరీక్షిస్తున్నవారు జిల్లాలో వేల సంఖ్యలో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు.
ప్రతి నెలా రావాల్సి వస్తోంది
రమణమ్మ, దుత్తలూరు : జీవనోపాధి నిమిత్తం నా కుమారులు తెలంగాణలో ఉంటున్నారు. గత ప్రభుత్వంలో మూడు నెలలకొకసారి స్వగ్రామానికి వచ్చి పింఛను తీసుకుని వెళ్లేదాన్ని. ఈ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదు. ప్రతి నెలా తీసుకోకపోతే ఆ నెల నగదు ఇక రాదని అధికారులు చెప్పారు. దీంతో ప్రతి నెలా ఒకటో తేదీ వచ్చి తీసుకోవాలంటే అనేక అవస్థలు పడుతున్నా. దీనికితోడు వచ్చే నగదులో సగం ఛార్జీలకే సరిపోతున్నాయి.
నిబంధనలు సడలించాలి
వెంకట్రావు, వృద్ధుడు : గతంలో తెల్లరేషన్ కార్డు ఆధారంగా పింఛను మంజూరు చేసేవారు. ప్రస్తుత ప్రభుత్వం అనేక నిబంధనలు పెట్టింది. దీంతో అర్హులైన చాలా మంది అనర్హులుగా మిగిలిపోతున్నారు. అయిదెకరాలపైబడి భూమి ఉండటం, 300 యూనిట్ల విద్యుత్తు వాడకం వంటి నిబంధనలతో వృద్ధులను పింఛన్లను దూరం చేస్తోంది. వీటిని సడలిస్తే ఎంతో మంది వితంతువులు, వృద్ధులకు మేలు జరిగే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జిల్లా వ్యాప్తంగా కార్డన్ సెర్చ్
[ 19-05-2024]
నెల్లూరు ఎస్పీ ఆరీఫ్ హఫీస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఠాణాల పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
పేకమేడలా.. జగనన్న ఇళ్లు.. చేతితో లాగితే ఊడుతున్న శ్లాబ్!
[ 19-05-2024]
వెంకటాచలం మండలం కంటేపల్లికి చెందిన అద్దూరు కామాక్షికి ప్రభుత్వం జగనన్న కాలనీలో ఇంటి స్థలంతో పాటు పక్కా ఇళ్లు మంజూరు చేసింది. -
రోడ్లు అధ్వానం.. పట్టించుకోని ప్రభుత్వం
[ 19-05-2024]
కందుకూరు నియోజకవర్గంలో రహదారులు అధ్వానంగా మారాయి. ఏళ్ల తరబడి ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదు. -
బోర్లు.. బాగు చేస్తే దాహం తీరు
[ 19-05-2024]
ఎండలు ముదిరాయి. రక్షిత పథకాలు పనిచేయడం లేదు. తాగునీటికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఈసమయంలో ఉపయోగపడే చేతి పంపులు అలంకారప్రాయంగా మారాయి -
అతి తక్కువ వడ్డీకే రిటెయిల్ రుణాలు
[ 19-05-2024]
తక్కువ వడ్డీకే రిటెయిల్ రుణాలు ఇవ్వనున్నట్లు యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ రాజశేఖర్ పేర్కొన్నారు. -
తాళం వేసిన ఇళ్లే లక్ష్యం.. రాత్రులు దొంగతనం
[ 19-05-2024]
రాత్రుల్లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. -
జాతీయ రహదారిపై ప్రమాదం
[ 19-05-2024]
జాతీయ రహదారిపై వెళుతూ ఆగిన లారీని కారు ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన నార్తురాజుపాళెం సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. -
హతవిధీ..పట్టించుకునేవారేరీ!
[ 19-05-2024]
నెల్లూరు నగరంలోని ప్రసిద్ధ బారా షహీద్ దర్గా పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి గురవుతోంది. -
22న జిల్లాకు గవర్నర్ రాక
[ 19-05-2024]
రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ నెల 22వ తేదీ నెల్లూరుకు రానున్నట్లు కలెక్టర్ హరినారాయణన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
మెట్ట రైలుపై చిన్న చూపు
[ 19-05-2024]
మెట్ట ప్రాంత వాసుల దశాబ్దాల కల.. నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్.. అయిదేళ్ల వైకాపా పాలనలో ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడంతో.. పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి -
స్ట్రాంగ్ రూమ్కు పోస్టల్ బ్యాలెట్లు
[ 19-05-2024]
నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోస్టులో వచ్చిన పోస్టల్ బ్యాలెట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములో ఉంచి సీల్ వేశారు. -
నేటి నుంచి పెంచలకోన బ్రహ్మోత్సవాలు
[ 19-05-2024]
బ్రహ్మోత్సవాలకు పెంచలకోన క్షేత్రం ముస్తాబైంది. నేటి నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు 25వ తేదీ వరకు జరగనుండగా- ఆదివారం స్వామి అత్తారిల్లుగా చెప్పుకొనే గోనుపల్లి ఆలయం నుంచి ఉత్సవ మూర్తులను పెంచలకోన క్షేత్రానికి చేర్చనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్ క్యాచ్.. యశ్ లాస్ట్ ఓవర్ వీడియోలు వైరల్!
-
నరసరావుపేటలో ‘సిట్’ దర్యాప్తు.. హింసాత్మక ఘటనలపై ఆరా
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
-
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!
-
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్