పోరు.. ఇక జోరు
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి.
క్షేత్రస్థాయిలోకి పార్టీల అభ్యర్థులు, అధినేతలు
ఈనాడు, కామారెడ్డి : జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్, భాజపా భావిస్తున్నాయి. కాంగ్రెస్ గెలుపు కోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తూ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, పార్టీ బాధ్యులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ ప్రచార వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. సభల్లో పాల్గొనేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. జాతీయ నేతల ప్రచారంతో నియోజకవర్గంలో పాగా వేయాలని భాజపా ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. మరోవైపు భారాస అధినేత కేసీఆర్ నియోజకవర్గంలో బస్సు యాత్రకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.
కేసీఆర్ బస్సు యాత్రకు సన్నాహాలు
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం కార్యకర్తలను సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తం చేసే ఉద్దేశంతో భారాస ఇప్పటికే నియోజకవర్గ, మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ భవన్లో గురువారం భారాస అధినేత కేసీఆర్ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై సమీక్షించినట్లు సమాచారం. బస్సుయాత్ర మెదక్ నియోజకవర్గంలో పూర్తయిన తర్వాత జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లను కవర్ చేసేలా ఉంటుందని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని నేతలకు సూచించినట్లు సమాచారం.
జహీరాబాద్లో 24న సీఎం పర్యటన
జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలో.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి, జుక్కల్, అందోల్, నారాయణఖేడ్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. కామారెడ్డి, బాన్సువాడ, జహీరాబాద్లో పార్టీ అభ్యర్థులు గణనీయంగా ఓట్లు సాధించారు. లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థి విజయావకాశాలపై అంచనాకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెల 24న జహీరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో భారీ బహిరంగ సభ లేదా రోడ్షో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ నేతలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పీసీసీ నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. ప్రచారం ముగిసేలోపు ఎల్లారెడ్డి, బాన్సువాడ, అందోల్, కామారెడ్డిలలో సీఎం సభలు నిర్వహించేందుకు పార్టీ అభ్యర్థి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
జాతీయ నాయకులతో ప్రచారానికి భాజపా
కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టాలనే లక్ష్యంతో ఉన్న భాజపా జహీరాబాద్ నియోజకవర్గంలో పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పార్టీ జాతీయ నేతలను ప్రచారానికి ఆహ్వానించి సభలు నిర్వహించేందుకు సమాయత్తం అవుతోంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను నామినేషన్ కార్యక్రమానికి రప్పిస్తోంది. ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులను ఆహ్వానించి భారీ బహిరంగసభలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఇంటింటి ప్రచారం నిర్వహించేలా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ ఇంటింటి ఎన్నికల ప్రచారం
[ 01-05-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశాల మేరకు నాయకులు నాగిరెడ్డిపేట మండలంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
‘పది’లమైన ఫలితాలు
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో ఈ సారి 14వ స్థానంలో నిలిచింది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు నిర్వహించగా మంగళవారం ఫలితాలు విడుదలయ్యాయి. జిల్లాలో 11,144 మంది బాలురు, 10,714 బాలికలు మొత్తంగా 21858 మంది పరీక్షలకు హాజరయ్యారు. -
పదిలో కాస్త తడబడి
[ 01-05-2024]
జిల్లాలో మంగళవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో గతేడాది కన్నా ఈ సారి వెనుకబడ్డారు. గతేడాది 93.32 శాతం ఉత్తీర్ణత కాగా ఈ సారి 0.61 శాతం తగ్గి 92.71కి పడిపోయింది. రాష్ట్రస్థాయిలో కామారెడ్డి జిల్లాకు గతేడాది 7వ ర్యాంకు దక్కగా ఈ సారి 19కి చేరింది. -
విమర్శల జోరు... కేరింతల హోరు
[ 01-05-2024]
మెదక్ జిల్లా అల్లాదుర్గం చిల్వేర్ ఐబీ చౌరస్తాలో మంగళవారం మెదక్-జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాల భాజపా విశాల్ జనసభలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలను ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా దుయ్యబట్టారు. -
న్యాయం చేయాలని గుత్తేదారు నిరసన
[ 01-05-2024]
తాను చేపట్టిన పనులకు బిల్లులు ఇవ్వకుండా పంచాయతీ అధికారులు రెండేళ్లుగా ఇబ్బందులు పెడుతున్నారని ఓ గుత్తేదారు పంచాయతీ కార్యాలయంలో అధికారులు ఉండగా.. గేట్కు తాళం వేసిన ఘటన బీర్కూర్ మండలకేంద్రంలో చోటుచేసుకుంది. -
పరిధి దాటింది.. బిల్లు వచ్చింది
[ 01-05-2024]
ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద తెల్లరేషన్కార్డులు కలిగిన లబ్ధిదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తోంది. వీరికి శూన్య బిల్లులు అందజేస్తున్నారు. ఉష్ణోగ్రతలు 44-45 డిగ్రీలకు చేరడంతో ప్రజలు ఉక్కపోతలతో అల్లాడుతున్నారు. -
దడ పుట్టిస్తున్న వడగాలులు
[ 01-05-2024]
జిల్లాలో మంగళవారం ఎండ మండిపోయింది. భానుడు తన ప్రతాపాన్ని రోజురోజుకూ పెంచుతుండడంతో వడగాలులు దడ పుట్టిస్తున్నాయి. -
ఇంటి వద్ద ఓటేసేది 1,758 మంది
[ 01-05-2024]
నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు, 85 ఏళ్లు పైబడిన వృద్ధులకు పార్లమెంటు ఎన్నికల్లో ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం కల్పించారు. కర్ణాటకలో ఈ పద్ధతి సత్ఫలితం ఇవ్వడంతో ఎన్నికల సంఘం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మనవద్ద ప్రవేశపెట్టింది. -
‘ఆ రెండు పార్టీలు ఒక్కటే’
[ 01-05-2024]
కాంగ్రెస్, భాజపా ఒక్కటేనని భారాస నిజామాబాద్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మంగళవారం భారాస జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, మాజీ మంత్రి జి.రాజేశంగౌడ్, మాజీ మార్క్ఫెడ్ ఛైర్మన్ లోక బాపురెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. -
బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్
[ 01-05-2024]
బడుగు బలహీన వర్గాలకు తమ పార్టీ అండగా ఉంటుందని నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి తెలిపారు. -
‘యూనిఫాం సివిల్ కోడ్తో ఇబ్బంది లేదు’
[ 01-05-2024]
యూనిఫాం సివిల్ కోడ్ అమల్లోకి వస్తే దేశంలో ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఎంపీ అర్వింద్ భరోసా ఇచ్చారు. మోదీ తీసుకున్న ఈ నిర్ణయం ముస్లిం మహిళలకు సంతోషాన్నిచ్చిందన్నారు. -
పదిలో మెరిశారు
[ 01-05-2024]
రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభ చాటారు. వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన బాలబాలికలు పది జీపీఏ పాయింట్లు సాధించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘హార్దిక్ను ఎంచుకోవడం తప్పిదమా?’.. విమర్శలకు గావస్కర్ స్ట్రాంగ్ ఆన్సర్!
-
ఎఫ్డీ కంటే మెరుగైన రిటర్నులు.. స్టాక్స్ కంటే తక్కువ రిస్క్
-
పోలీస్ స్టేషన్లో రూ.5.6లక్షలు కాజేసిన హోంగార్డు
-
దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులకు ఊరట
-
డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడు మృతి
-
ప్రపంచకప్కి రింకూని విస్మరించడమా? ఇదో చెత్త సెలక్షన్!