logo

ఇద్దరిని బలి తీసుకున్న అతిసారం

రాయగడ జిల్లా కాశీపూర్‌ సమితిలోని ఓడజార్‌ పంచాయతీ కొర్లజార్‌ గ్రామానికి చెందిన మొనిమాఝి (43), ధన మాఝి (25) అతిసారంతో మృతి చెందారు. మరో నలుగురు పంకజ్‌ మాఝి, జుగ్ని మాఝి,

Published : 19 Aug 2022 03:25 IST

రాయగడ గ్రామీణం, న్యూస్‌టుడే: రాయగడ జిల్లా కాశీపూర్‌ సమితిలోని ఓడజార్‌ పంచాయతీ కొర్లజార్‌ గ్రామానికి చెందిన మొనిమాఝి (43), ధన మాఝి (25) అతిసారంతో మృతి చెందారు. మరో నలుగురు పంకజ్‌ మాఝి, జుగ్ని మాఝి, నమిత మాఝి, ధను మాఝి కాశీపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. గ్రామానికి రోడ్లు సౌకర్యం లేకపోవడంతో రోగులను మంచంపై నది దాటించి, ఆసుపత్రికి తీసుకొస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని