logo

డిసెంబరు 1న ఎకో రిట్రీట్‌ ప్రారంభం

కొరాపుట్‌ జిల్లా సిమిలిగుడ సమితిలోని ఫుట్‌సీల్‌లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎకో రిట్రీట్‌ కేంద్రం డిసెంబర్‌ 1న ప్రారంభమవుతుందని కలెక్టర్‌ మొహమ్మద్‌ అబ్దల్‌ అక్తర్‌ తెలిపారు.

Published : 28 Nov 2022 01:21 IST

ఫుట్‌సీల్‌లో పర్యటకులు బస చేసేందుకు ఏర్పాట్లు

సిమిలిగుడ, న్యూస్‌టుడే: కొరాపుట్‌ జిల్లా సిమిలిగుడ సమితిలోని ఫుట్‌సీల్‌లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎకో రిట్రీట్‌ కేంద్రం డిసెంబర్‌ 1న ప్రారంభమవుతుందని కలెక్టర్‌ మొహమ్మద్‌ అబ్దల్‌ అక్తర్‌ తెలిపారు. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. నాలుగు రోజులే సమయం ఉండటంతో పనులు శరవేగంగా సాగుతున్నాయని, పర్యటకులు రాత్రివేళల్లో ఇక్కడ బస చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, 28 టెంట్లు ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ ఎకో రిట్రీట్‌ ఏర్పాటుతో పర్యటకపరంగా అభివృద్ధి చెందడంతోపాటు గిరిజనులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని