అడిగింది రూ.8,400 కోట్లు... ఇచ్చింది రూ.10,012 కోట్లు
ఒడిశా రైల్వే రంగానికి కేంద్రం ప్రాధాన్యమిచ్చిందని, ఈ ఏడాదిలో (2023-24) రూ.8,400 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా ప్రధాని నరేంద్ర మోదీ రూ.10,012 కోట్లు బడ్జెట్లో సమకూర్చారని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
ఒడిశా రైల్వేలకు ప్రాధాన్యం?: రైల్వేశాఖ మంత్రి
అశ్వినీ వైష్ణవ్
భువనేశ్వర్, న్యూస్టుడే: ఒడిశా రైల్వే రంగానికి కేంద్రం ప్రాధాన్యమిచ్చిందని, ఈ ఏడాదిలో (2023-24) రూ.8,400 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా ప్రధాని నరేంద్ర మోదీ రూ.10,012 కోట్లు బడ్జెట్లో సమకూర్చారని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. శుక్రవారం సాయంత్రం దిల్లీలో కేంద్రమంత్రి విలేకరులతో మాట్లాడుతూ...ఈసారి జరిగిన కేటాయింపుల్లో కొత్త రైలు మార్గాల పనులకు రూ.2,564 కోట్లు, డబ్లింగ్ పనులకు రూ.3,800 కోట్లు ఖర్చవుతాయన్నారు. పూరీ జగన్నాథ్ రైల్వే స్టేషన్కు ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించడం ధ్యేయంగా నిర్మాణాలు ప్రారంభం కాగా, భువనేశ్వర్ స్టేషన్ ఆధునికీకరణకూ సన్నాహాలు ముమ్మరం చేశామన్నారు. త్వరలో కటక్ కూడా మోడల్ స్టేషన్ కానుందని చెప్పారు. ఈ ఏడాదిలో ఒడిశాలోని 57 స్టేషన్ల ఆధునికీకరణ పనులు ప్రారంభం కానున్నాయన్నారు.
త్వరలో వందే మెట్రో రైళ్లు
భువనేశ్వర్-పూరీ, కటక్-భువనేశ్వర్, ఝార్సుగుడ-రవుర్కెలా, సంబల్పూర్-ఝార్సుగుడల మధ్య వందేభారత్ మెట్రో రైళ్లు నడుస్తాయని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రాష్ట్రానికి సంబంధించి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలన్నారు. అభివృద్ధి, సౌకర్యాలు ధ్యేయంగా రాజకీయాలకు అతీతంగా ప్రధాని మోదీ ఒడిశాలో రైల్వేలకు కేటాయింపులు పెంచారన్నారు. ఈ ఏడాదిలో రాష్ట్రంలోని అత్యధిక స్టేషన్ల ఆధునికీకరణ పనులు చేపడుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. 2047 నాటికల్లా ‘వికసిత భారత్’ లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని రైల్వే ప్రాజెక్టులకు ప్రాధాన్యమిచ్చారన్నారు. విలేకరుల సమావేశంలో ఈస్కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ మనోజ్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆధునిక సౌకర్యాలు కల్పించాల్సిన పూరీ స్టేషన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నవీన్ మంచివారా... కాదా? సీఎం ప్రశ్న
[ 10-05-2024]
నవీన్ మంచివారా? కాదా? మమతా, మిషన్శక్తి, కాలియా, మధుబాబు పింఛన్లు, పిల్లలకు ఉపకార వేతనాలు, 5టీ స్కూళ్లు, లక్ష్మీ బస్సు సేవలు, పూరీ శ్రీ జగన్నాథ్ కారిడార్ తదితర ప్రభుత్వ కార్యక్రమాలు బాగున్నాయా? లేదా? అంటూ ప్రశ్నించిన సీఎం ప్రజల నుంచి సమాధానాలు రాబట్టారు. -
ఆయుష్మాన్ మంత్రం ఫలించేనా?
[ 10-05-2024]
ప్రస్తుత సమాజంలో ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం మరొకటి లేదన్నది అక్షరసత్యం. ప్రస్తుతం దీనినే రాష్ట్రంలో ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకొని భాజపా ముందుకు దూసుకెళ్తోంది. -
బిజదలో చీలిక తెచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా యోచన: పాండ్యన్
[ 10-05-2024]
తొలివిడత పోలింగ్కు మూడు రోజుల వ్యవధి మిగిలున్న తరుణంలో బిజద నేత వి.కార్తికేయ పాండ్యన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. -
బ్రహ్మపురలో బహుముఖ పోటీ
[ 10-05-2024]
రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య, విద్యా కేంద్రమైన బ్రహ్మపుర అసెంబ్లీ నియోజకవర్గం కీలకమైనది. -
చందన యాత్రకు పూరీ సన్నద్ధం
[ 10-05-2024]
పూరీలో జగన్నాథుని చంద్రనయాత్ర, జల క్రీడలకు తెరలేచింది. శుక్రవారం అక్షయ తృతీయ. -
ఓలీవుడ్ నటులతో భాజపా అభ్యర్థి ప్రచారం
[ 10-05-2024]
బ్రహ్మపుర అసెంబ్లీ భాజపా అభ్యర్థి కె.అనిల్కుమార్ గురువారం నగరంలో సాంస్కృతిక బృందాలతో భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు. -
ఒడిశా వాసులు అభివృద్ధి ట్రైలర్ చూశారు
[ 10-05-2024]
ఒడిశా వాసులింత వరకు అభివృద్ది ట్రైలర్ మాత్రమే చూశారని, రానున్న అయిదేళ్లలో పూర్తి సినిమా (అభివృద్ధి పనులు) చూడగలుగుతారని కేంద్ర ఉపరితల, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. -
నిబంధనలు గాలికొదిలేస్తున్న కాంగ్రెస్
[ 10-05-2024]
చిన్నారులతో ఎన్నికల ప్రచారం, అనధికారికంగా ఓటరు వివరాలు సేకరణ చట్ట విరుద్ధమని ఎన్నికల సంఘం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఓడితే గుజరాత్ ఇంటికే.. చెన్నై గెలిస్తే ముందుకే!
-
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
-
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్