logo

‘రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు అన్యాయం’

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడం ఆటవిక చర్య అని సిమిలిగుడ కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనగా సత్యగ్రహ ఆందోళన చేపట్టారు.

Published : 30 Mar 2023 03:13 IST

ఆందోళనలో పాల్గొన్న నేతలు

సిమిలిగుడ, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడం ఆటవిక చర్య అని సిమిలిగుడ కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనగా సత్యగ్రహ ఆందోళన చేపట్టారు. కొరాపుట్‌ జిల్లా కాంగ్రెస్‌ ఆదివాసీ, హరిజన, ఓబీసీ, మైనారిటీ వర్గం బుధవారం జై భారత్‌ సత్యాగ్రహ ఉద్యమం ప్రారంభించారు. స్థానిక బస్టాండ్‌ వద్ద మహాత్మ గాంధీ విగ్రహానికి నివాళులర్పించి ఆందోళన ప్రారంభించారు. రాహుల్‌ రాజకీయ జీవితానికి సమాధి చేయాలని భాజపా యోచిస్తోందని ధ్వజమెత్తారు. ఆందోళనతో మాజీ ఎమ్మెల్యే, కొరాపుట్‌ ఆదివాసీ సెల్‌ అధ్యక్షులు రామ్‌ చంద్ర కదమ్‌ నేతృత్వంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు సోనియా మాఝి, నేతలు సుక్రా ఖోరా తదితరులు కాషాయ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని