ద్విచక్ర వాహనాల చోరీ ముఠా పట్టివేత
నవరంగపూర్ జిల్లాలో వివిధ చోట్ల చోరీకి గురైన ద్విచక్రవాహనాలను పోలీసులు పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలు
నవరంగపూర్, న్యూస్టుడే: నవరంగపూర్ జిల్లాలో వివిధ చోట్ల చోరీకి గురైన ద్విచక్రవాహనాలను పోలీసులు పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. డాబుగావ్ పోలీస్ స్టేషన్లో ఎస్పీ సుశ్రీ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. దీని ప్రకారం.. మే 16న జబగూడకు చెందిన చంద్ర మిర్గన్ గ్రామ సమీపంలో జాతరకు వెళ్లి. తిరిగి వచ్చేసరికి ద్విచక్రవాహానం కనిపించలేదు. దీనిపై డాబుగావ్ పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేయగా, ఐఐసీ సునీల్ కుమార్ ప్రధాన్ దర్యాప్తు ప్రారంభించారు. తొలుత జయంతి నగర్ ప్రాంతానికి చెందిన రామ్చంద్ర జానిని పట్టుకొని విచారించగా చోరీ ముఠా గుట్టు దొరికింది. ఈ ముఠా సభ్యులైన ఉమ్మర్కోట్ సమితి దొడ్రకు చెందిన దుమురు హరిజన్, సుధీర్ హరిజన్, రాయ్ఘర్ సమితి జమదొరకు చెందిన చందన్ హరిజన్లను అరెస్టు చేశారు. ముఠా సభ్యులు కలసి రాయ్ఘర్, కొసగుముడ, డాబుగావ్ సమితుల్లో చోరీ చేసిన 17 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని, త్వరలో పట్టుకుంటామని ఎస్పీ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాటుదేలిన యోధులు... ఎవరో విజేతలు?
[ 26-04-2024]
రాజకీయాల్లో రాటుదేలిన ముగ్గురు యోధుల మధ్య బాలేశ్వర్ లోక్సభ పరిధిలో ఈసారి ఎన్నికల సంగ్రామం సాగుతోంది. -
కేకేలైన్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 26-04-2024]
కొరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో మూడు బోగీలు బోల్తా పడ్డాయి. -
జగన్నాథునికి సైనా పూజలు
[ 26-04-2024]
అంతర్జాతీయ బ్యాండ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గురువారం ఉదయం శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
నేటి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు
[ 26-04-2024]
ఇప్పటికే రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోంది. -
నవీన్ ప్రభుత్వాన్ని గద్దె దించండి
[ 26-04-2024]
సామర్థ్యం కొరవడిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, అయిదేళ్లు భాజపాకు అవకాశం ఇవ్వాలని, ఒడిశాను దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం మంత్రి అమిత్షా పిలుపునిచ్చారు. -
పనిచేయని బిజూ కార్డు.. ఆగిన శస్త్రచికిత్స
[ 26-04-2024]
బిజు కార్డు పని చేయకపోవడంతో ఎనిమిదేళ్ల బాలుడికి చేయవలసిన శస్త్రచికిత్స ఆపేశారు. గత్యంతరం లేక బాలుడిని పట్టుకొని తల్లిదండ్రులు ఇంటికి తిరిగొచ్చిన ఘటన నవరంగపూర్ జిల్లాలో జరిగింది. -
కాంగ్రెస్లో రాజీనామాలు
[ 26-04-2024]
గుణుపురం విధానసభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్కు సమస్యలు ఎదురవుతున్నాయి. పలువురు నాయకులు ప్రాథమిక సభ్యత్వం నుంచి రాజీనామా చేసినట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బిజయకుమార్ గమాంగ్ తెలిపారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం...
[ 26-04-2024]
గజపతి జిల్లాలో మే 13వ తేదీన జరిగే ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. మోహన నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థులుగా రూబెన్ మండల్
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?