ఆహుతవుతున్న పచ్చదనం
రాష్ట్రంలో పచ్చదనం అగ్నికి ఆహుతవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2030 నాటికి అడవులకు నిప్పు ఘటనలు మరింత తీవ్ర రూపం దాల్చనున్నట్లు అధ్యయనాలు పేర్కొంటుండడం గుబులు రేపుతోంది.
2030 నాటికి తీవ్రం కానున్న అడవులకు నిప్పు ఘటనలు
అటవీ ప్రాంతంలో చెలరేగుతున్న మంటలు
రాయగడ పట్టణం, న్యూస్టుడే: రాష్ట్రంలో పచ్చదనం అగ్నికి ఆహుతవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2030 నాటికి అడవులకు నిప్పు ఘటనలు మరింత తీవ్ర రూపం దాల్చనున్నట్లు అధ్యయనాలు పేర్కొంటుండడం గుబులు రేపుతోంది. రాష్ట్రంలో బూడిదవుతున్న పచ్చదనం అంశంపై భౌగోళిక శాస్త్రవేత్తలు, పర్యావరణ శాస్త్రవేత్తల బృందం తాజాగా చేపట్టిన ఓ అధ్యయనం ఈ వివరాలను బహిర్గతం చేసింది. వాటి ప్రకారం.. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో విచ్చలవిడిగా సహజవనరుల వినియోగం కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతిని ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మైనింగ్, పోడు వ్యవసాయం, పారిశ్రామిక కార్యకలాపాల వల్ల ఉష్ణోగ్రతలు పెరగడం, గాలిలో తేమ తగ్గడం కారణంగా అడవులకు నిప్పు ఘటనలు చోటుచేసుకునే ప్రమాదముంది. అధ్యయన రచయిత బృందంలో ఒకరైన ఎఫ్.ఎం. విశ్వవిద్యాలయం (బాలేశ్వర్) భౌగోళిక శాస్త్ర ప్రొఫెసర్ మనోరంజన్ మిశ్ర మాట్లాడుతూ... రాష్ట్రంలో ఉన్న భౌగోళిక ప్రాంతంలో దాదాపు 31,666 చదరపు కి.మీలో అత్యధిక అడవులకు నిప్పు ఘటనలు చోటుచేసుకునే ప్రమాదముందని హెచ్చరించారు. మంటల నియంత్రణకు సమగ్ర నిర్వహణ ప్రణాళికలు అమలు చేయడం, ముందుగా గుర్తించడం, మంటల వ్యాప్తిని అరికట్టడం తదితర చర్యలతో ఈ ప్రభావాన్ని కొంతమేర తగ్గించవ్చని మిశ్ర సూచించారు.
మంటలను అదుపు చేెస్తున్న సిబ్బంది
పది జిల్లాల్లో తీవ్రత:- రాయగడ, అనుగుల్, సంబల్పూర్, సుందరగఢ్, కొంధమాల్, మల్కాన్గిరి, కొరాపుట్, గజపతి, కలహండి, మయూర్భంజ్ జిల్లాల్లో వీటి తీవ్రతకు ఎక్కువ అవకాశాలున్నట్లు అధ్యయనం వెల్లడించింది. 2001-2022 మధ్య రాష్ట్రంలో ఏడాదికి సగటున 3,877 చొప్పున మొత్తం 85,307 ఘటనలు వెలుగుచూసినట్లు అధ్యయనం ప్రస్తావించింది. 2015 తరువాత ఇవి ఎక్కువగా పెరిగినట్లు బృందం బహిర్గతం చేసింది. 2001-2010 మధ్య 28,286 ఘటనలు వెలుగుచూడగా 2011-2022 మధ్య ఇవి 57,021గా నమోదు కావడం గమనార్హం. గడిచిన 22 ఏళ్లలో ఈ తరహా ఘటనలు అనుగుల్ జిల్లాలో అత్యధికంగా 14,009 వెలుగు చూసినట్లు అధ్యయన బృందం పేర్కొంది. రుతుపవనాలకు ముందు సీజన్లో (జనవరి-మే) మొత్తం ఘటనల్లో 67.73 శాతం ఘటనలు నమోదవుతున్నట్లు ఈ బృందం స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యుదాఘాతంతో వృద్ధుడి మృతి
[ 27-04-2024]
విద్యుదాఘాతంతో వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన గజపతి జిల్లా మోహన ఠాణా పరిధిలోని బేతర్ సింగ్ గ్రామంలో జరిగింది. -
పాము కాటుతో వ్యక్తికి అస్వస్థత
[ 27-04-2024]
పాము కాటుతో వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. గజపతి జిల్లా మోహన సమితి అడవా ఠాణా పరిధిలోని జిలికి గ్రామంలో శంకర్ ప్రధాన్ (30) శుక్రవారం రాత్రి మలవిసర్జనకు బయటికి వెళ్లాడు. -
గజపతి సేవలు చిరస్మరణీయం: నవీన్
[ 27-04-2024]
స్వతంత్ర ఒడిశా ఏర్పాటు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మహారాజా కృష్ణచంద్ర గజపతి సేవలు చిరస్మరణీయమని, రాష్ట్ర ప్రజలకు ఆయన మార్గదర్శిగా నిలిచారని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అభివర్ణించారు. -
కాంగ్రెస్కు పూర్వవైభవం దక్కేనా
[ 27-04-2024]
కొరాపుట్ జిల్లాలోని అయిదు నియోజకవర్గాలు ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేవి. ఆ పార్టీలో నెలకొన్న వివాదాలు పార్టీకి తీవ్ర నష్టాన్ని తీసుకువస్తున్నాయి. -
హింజిలికి ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయండి
[ 27-04-2024]
‘ముఖ్యమంత్రిగా 25 ఏళ్ల కాలంలో మీ సొంత నియోజకవర్గం హింజిలికి ఏం చేశారు?.. వలసలు నివారించడానికి అక్కడ పరిశ్రమలు ఏవైనా ప్రారంభించగలిగారా? అన్నదానిపై శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని నవీన్కు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సవాల్ విసిరారు. -
ధర్మేంద్ర మాతృభూమికి చేసిందేమిటి?
[ 27-04-2024]
స్థిరమైన పాలన అందించిన ఘనచరిత్ర ముఖ్యమంత్రి నవీన్ సొంతమని, ఉత్తమ పాలకునిగా మన్ననలందుకున్నారని, అన్ని రికార్డులు ఆయన సొంతమని సంబల్పూర్ లోక్సభ బిజద అభ్యర్థి ప్రణవ ప్రకాష్ దాస్ (బొబి) పేర్కొన్నారు. -
5 లోక్సభ, 35 అసెంబ్లీ స్థానాలకు నోటిఫికేషన్
[ 27-04-2024]
రాష్ట్రంలో రెండోవిడతగా మే 20న జరగనున్న అస్కా, కొంధమాల్, బొలంగీర్, బరగఢ్, సుందర్గఢ్ లోక్సభ స్థానాలు, వాటి పరిధుల్లోని 35 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. -
రాయగడ జిల్లాలో 62 నామినేషన్లు
[ 27-04-2024]
జిల్లాలో రాయగడ, గుణుపురం, బిసంకటక్ నియోజకవర్గ శాసనసభ స్థానాలకుగాను ప్రధాన పార్టీలతోసహా ఇతర పార్టీ అభ్యర్థులు, స్వతంత్రులతో కలిపి 62 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు శుక్రవారం ఆర్వో సంఘమిత్రా దేవి వెల్లడించారు. -
రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత
[ 27-04-2024]
కేంద్ర హోంమంత్రి, భాజపా సిద్ధాంతకర్త అమిత్షా రాష్ట్ర పర్యటన పార్టీ నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. గురువారం సాయంత్రం పశ్చిమ ఒడిశాలోని సోన్పూర్ బహిరంగ సభలో నవీన్ పట్నాయక్ పాలనా వైఫల్యాలను విమర్శించిన షా తాము బిజదకు అనుకూలం కాదన్న సందేశమిచ్చారు. -
నాడు బిజద.. నేడు భాజపా
[ 27-04-2024]
రాయగడ జిల్లా గుణుపురం నియోజకవర్గంలో కొందరు నిన్నటి వరకు బిజూ జనతా దళ్లో ఉండి ఎన్నికల ముందు భాజపాలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. -
బిజదలో చేరికలు
[ 27-04-2024]
బ్రహ్మపుర మున్సిపల్ కార్పొరేషన్ (బీఈఎంసీ) అయిదో వార్డుకు చెందిన యువ నాయకుడు సనాతన సాహు శుక్రవారం రాత్రి బిజదలో చేరారు. అంతకుముందు ఆయన వందలాది మంది వార్డు ప్రజలు, మద్దతుదారులతో కలిసి వార్డులో పాదయాత్ర నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్