logo

ప్రజల గుండెచప్పుడు బిజుబాబు: నవీన్‌

బిజుబాబు భౌతికంగా లేకపోయినా, రాష్ట్ర ప్రజల గుండె చప్పుడుగా అందరి హృదయాల్లో ఉన్నారని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ అన్నారు.

Published : 18 Apr 2024 05:28 IST

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: బిజుబాబు భౌతికంగా లేకపోయినా, రాష్ట్ర ప్రజల గుండె చప్పుడుగా అందరి హృదయాల్లో ఉన్నారని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ అన్నారు. బుధవారం బిజు వర్ధంతిని పురస్కరించుకుని, భువనేశ్వర్‌లో ఆ మహానీయుని ఘాట్‌ వద్ద బిజద నేతలు, అభిమానులు నివాళులు అర్పించారు. పాల్గొన్న నవీన్‌ తన తండ్రి విగ్రహానికి పుష్ఫగుచ్ఛాలు సమర్పించి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి, రాష్ట్రానికి బిజుబాబు చేసిన సేవలను ప్రస్తుతించారు. ఆ మహానీయుని ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడానికి అంతా కలసి రావాలని పిలుపునిచ్చారు. మరోవైపు శంఖభవన్‌ (బిజద కార్యాలయం)లోనూ బిజు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకులంతా పాల్గొని మాట్లాడారు. రక్తదాన శిబిరం ఏర్పాటైంది. రాష్ట్రవ్యాప్తంగా బిజు వర్ధంతిని పురస్కరించుకొని నేతలు, కార్యకర్తలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని