విద్యుదాఘాతంతో కార్మికుడికి అస్వస్థత
గజపతి జిల్లా మోహన ఠాణా పరిధిలోని పుతిలిపోంకలో విద్యుదాఘాతంతో కార్మికుడు అస్వస్థకు గురయ్యాడు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడు
పర్లాఖెముండి, న్యూస్టుడే: గజపతి జిల్లా మోహన ఠాణా పరిధిలోని పుతిలిపోంకలో విద్యుదాఘాతంతో కార్మికుడు అస్వస్థకు గురయ్యాడు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే ఠాణా పరిధిలోని గోవిందపూర్ పంచాయతీ పుతిలిపోంకలో ప్రభుత్వ మార్కెట్ కాంప్లెక్స్ పైకప్పుపై నిలుచొని పనిచేస్తున్న క్రమంలో పై నుంచి వెళ్తున్న 11కేవీ విద్యుత్తు తీగలు తగిలి అస్వస్థతకు గురయ్యాడు. స్థానికులు మోహన ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స చేసి, మెరుగైన చికిత్స కోసం బ్రహ్మపుర ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. అస్వస్థతకు గురైన వ్యక్తి నజారిత్ సైబర్(22)గా తెలుస్తోంది.
గంజాయి స్వాధీనం... ముగ్గురి అరెస్ట్
నవరంగపూర్, న్యూస్టుడే: అక్రమంగా గంజాయి రవాణా చేస్తుండగా నవరంగపూర్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులు టెంటులిఖుంటి ఠాణా పరిధిలో మెంట్రి గ్రామానికి చెందిన హఫీజ్ ఖా, బరగావ్కి చెందిన బేణుధర్ సౌర, సిరాగూడ గ్రామానికి చెందిన ఆమన్ ఖాగా గుర్తించారు. వారి నుంచి 16 కిలోల గంజాయి, ఒక స్కూటీ, మూడు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నిందితులని కోర్టుకు తరలించారు.
రిజర్వాయరులో ఇద్దరి జలసమాధి
భువనేశ్వర్, న్యూస్టుడే: ఉక్కునగరం రవుర్కెలాలో శనివారం సాయంత్రం విషాధఛాయలు అలముకున్నాయి. కోల్ నది రిజర్వాయరులో స్నానానికి దిగిన ముగ్గురు యువకులు మునిగిపోయారు. అక్కడున్నవారు ఒకర్ని కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఆయన కోలుకున్నాడు. మిగిలిన ఇద్దరు జలసమాధి అయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం తరలించారు. మృతులు ఎవరన్నది స్పష్టం కాలేదు.
నకిలీ పొల్యూషన్ పత్రాలు జారీ- ఏజెంట్ అరెస్ట్
జయపురం, న్యూస్టుడే: నకిలీ పొల్యూషన్ పత్రాలు మిల్లర్లకు ఇచ్చి వారి ద[గ్గర నుంచి రూ. లక్షలు దోచుకున్న కేసులో జయపురం టౌన్ పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఐఐసీ రమణి రంజన్ దొలై తెలిపిన వివరాలు ప్రకారం, స్థానిక లింగరాజ్ నగర్కు చెందిన సమీర్కుమార్ పండా 2019లో పట్టణంకి చెందిన 10 మంది మిల్లర్ల వద్ద రూ.50వేలు చొప్పున తీసుకొని పొల్యూషన్ క్లియరెన్స్ సర్టిఫికేట్లు ఇచ్చారు. కాల వ్యవధి ఈ ఏడాది మార్చి 31తో గడువు ముగిసింది. కొరాపుట్ కాలుష్య విభాగంలో సర్టిఫికెట్ పునరుద్ధరణ కోసం మిల్లర్లు దరఖాస్తు చేసుకోగా, ఆ పత్రాలు నకిలీవని తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జోయల్, దిలీప్ల మధ్య హోరాహోరీ
[ 18-05-2024]
కేంద్రమాజీ మంత్రి, సుందర్గఢ్ సిటింగ్ ఎంపీ జోయల్ ఓరంకు ఈసారి అగ్నిపరీక్ష ఎదురవుతోంది. -
రాష్ట్రంలో 15 ఎంపీ, 75 కు పైగా అసెంబ్లీ స్థానాలు మావే
[ 18-05-2024]
ఒడిశాలో ఈసారి 15 లోక్సభ, 75కుపైగా అసెంబ్లీ స్థానాల్లో భాజపా విజయం తథ్యమని, తమిళపాలనకిక తెరపడుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్షా చెప్పారు. -
రత్నభాండాగారం తాళం చెవి పాండ్యన్ వద్ద ఉంది
[ 18-05-2024]
ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని పేదలందరికీ ఉచితంగా బియ్యం (రేషన్) ఇస్తున్నారని, ఒడిశా సీఎం నవీన్ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు వట్టి గోనె సంచులిచ్చారని, ఈ సంచులు తమిళనాడులో తయారైనవని అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ ఎద్దేవా చేశారు. -
కుందిలిలో కృషి బజార్కు మోక్షమెప్పుడో
[ 18-05-2024]
కనీస సౌకర్యాల కరవు.. శిథిల భవనాలు, నిత్యం వెంటాడుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు.. వినియోగానికి నోచుకోని బజార్.. ఇదీ కొరాపుట్ జిల్లాలోని కుందిలి వారపు సంతలో పంటలు విక్రయించేందుకు వచ్చిన అన్నదాతలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. -
19న రాష్ట్రానికి మోదీ
[ 18-05-2024]
ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం (19న) రాత్రి 7 గంటలకు భువనేశ్వర్ రానున్నారు. -
గంజాం జిల్లాకు అదనపు కేంద్ర బలగాలు
[ 18-05-2024]
గంజాం జిల్లా అస్కా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని కళ్లికోట అసెంబ్లీ సెగ్మెంట్లో పోలింగుకు ముందు చెలరేగిన రాజకీయ హింస నేపథ్యంలో ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. -
నాలుగున్నర కోట్ల ప్రజలు నా ఊపిరి: నవీన్
[ 18-05-2024]
రాష్ట్రంలోని నాలుగున్నర కోట్ల ప్రజలు తన ఊపిరని, అందరి ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నానని, తన పాలనలో అన్ని వర్గాలవారికి న్యాయం జరిగిందని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు. -
నవీన్జీ... మీకు 25 ఏళ్లు చాల్లేేదా?: ధర్మేంద్ర
[ 18-05-2024]
రాష్ట్రాన్ని 25 ఏళ్లు పాలించిన మీకు ఈ వ్యవధి చాలలేదా? సుదీర్ఘపాలనలో మీరు సాధించిందేమిటి?, ప్రజలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చగలిగారా? అంటూ సీఎం నవీన్ను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశ్నించారు. -
రాష్ట్రంలో అన్నదాతలకు అన్యాయం: విష్ణుదేవ్
[ 18-05-2024]
నవీన్ పట్నాయక్ పాలనలో ఒడిశాలో అన్నదాతలకు అన్యాయం జరిగిందని, ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు (ఎంఎస్పీ) కల్పించడంలో విఫలమయ్యారని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయె అన్నారు. -
ముగ్గురు భాజపా నేతలపై వేటు
[ 18-05-2024]
-
నిందితుడ్ని తప్పించే యత్నం పోలీసు స్టేషన్లోకి చొరబాటు
[ 18-05-2024]
గంజాం జిల్లాలో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
-
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
-
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
-
విడాకుల్లో ఎవరి జోక్యం లేదు: గాయని సైంధవి
-
రద్దయిన క్రికెట్ మ్యాచ్కు టికెట్ల డబ్బు వాపసు
-
పని ఒత్తిడి, విజిలెన్స్ విచారణ..ఎస్టీపీపీ అధికారి బలవన్మరణం