ఉపాధి లక్ష్యం చేరేలా అడుగులు
జిల్లాలో 1.30 కోట్ల పనిదినాలను ఉపాధిహామీ పథకంలో కల్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పంట పొలాలకు సాగునీరు అందించే కాలువలను మెరుగుపర్చే పనులను ప్రతిపాదిస్తేనే లక్ష్యం నెరవేరుతోందని అధికారులు నిర్ణయించారు.
కాలువల ఆధునికీకరణకు ప్రణాళిక
గుమ్మలక్ష్మీపురం మండలంలో గుమ్మిడిగెడ్డపై చెక్డ్యాం కాలువ పరిస్థితి
పార్వతీపురం, న్యూస్టుడే: జిల్లాలో 1.30 కోట్ల పనిదినాలను ఉపాధిహామీ పథకంలో కల్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పంట పొలాలకు సాగునీరు అందించే కాలువలను మెరుగుపర్చే పనులను ప్రతిపాదిస్తేనే లక్ష్యం నెరవేరుతోందని అధికారులు నిర్ణయించారు. దీనిలో భాగంగా జిల్లాలోని సాగునీటి వనరుల కింద పంట కాలువల్లో పూడిక తీతలను ఉపాధి పనుల్లో చేసేందుకు ప్రతిపాదించారు. మొత్తం రూ.1.40 కోట్లతో 304 కిలోమీటర్ల పొడవున పూడికలు తీసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. గిరిజన ప్రాంతంలో చెక్డ్యాం కింద కాలువలను శుభ్రం చేయనున్నారు.
చెక్డ్యాంల పరిధిలో మెరుగులు..
జైకా సహకారంతో పెద్దగెడ్డ, పెదంకలాం, ఒట్టిగెడ్డ, వెంగళరాయసాగర్ ప్రాజెక్టుల ఆధునికీకరణ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఆయా చోట్ల ఇప్పటికే కాలువలను బాగు చేస్తుండగా మళ్లీ పూడిక తీతలు ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో కైరాడ, పనసభద్ర, గుమ్మిడిగెడ్డపై నిర్మించిన చెక్డ్యాంల పరిధిలోని కాలువలు, వరహాలగెడ్డ, పాచిపెంట, సాలూరు మండలాల్లో వేగావతి నదిపై ఉన్న సాగునీటి కాలువలకు మెరుగులు దిద్దనున్నారు.
వీటితో పాటు వరహాల గెడ్డ, గుమ్మిడిగెడ్డ, కొండలేవిడి, కైరాడ, పాచిపెంట మండలంలోని వట్టిగెడ్డ, వేగావతి నదులపై ఉన్న చిన్న చిన్న జలవనరులకు సంబంధించిన కాలువల్లో పూడిక తీసే పనులను ఉపాధి హామీ నిధులతో చేపట్టనున్నారు.
ఇబ్బందులు లేకుండా..:
జైకా నిధులతో చేపట్టిన పనులు కాకుండా మిగిలిన కాలువలపై చేసేందుకు ప్రతిపాదనలు పంపించాం. దీనిలో భాగంగా పిల్లకాలువల్లాంటివి జలయాజమాన్య సంస్థ చేపడుతుంది. జైకా పనులకు వీటికి సంబంధం ఉండదు. రెండు శాఖల సమన్వయంతో పనులు గుర్తించడంతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండదు.
ఆర్.అప్పలనాయుడు, జిల్లా జలవనరుల శాఖాధికారి
అనుమతుల మేరకు పనులు..:
కలెక్టర్ ఇచ్చిన అనుమతుల మేరకు ఉపాధి పనుల్లో కాలువలను ప్రతిపాదించాం. వీటిని నిర్ధిష్ట కాలవ్యవధిలో వేతనదారులతో చేయించేలా చర్యలు తీసుకుంటున్నాం.
రామచంద్రరావు, డ్వామా పీడీ, పార్వతీపురం మన్యం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసుపు సంద్రం
[ 26-04-2024]
సాలూరు పట్టణంలోని జాతీయ రహదారి పసుపు సంద్రంగా మారింది. కూటమి అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి గురువారం ఎన్నికల నామపత్రం సమర్పించి, ప్రచార ర్యాలీ నిర్వహించారు. -
మామయ్య రాసిన మరణ శాసనం
[ 26-04-2024]
‘అక్క.. చెల్లెమ్మకు అండగా మీ అన్న జగన్ ఉన్నాడు. మీ పిల్లల బాధ్యతను మేనమామగా తీసుకుంటా’ అంటూ ఎన్నికల ముందు, తర్వాత అనేక సందర్భాల్లో సీఎం పలికిన ప్రగల్భాలివి. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్