నోట్లతో ఎర.. బెదిరింపులు జర
పార్వతీపురం నియోజకవర్గంలోని అంగన్వాడీ కార్యకర్తలను ఎన్నికల విధులకు తీసుకున్నారు. వారికి పోస్టల్ బ్యాలెట్ జారీ చేశారు.
ఉద్యోగుల ఓట్లకు తంటాలు
మన్యంలో నగదు చెల్లింపులు
విజయనగరంలో బుజ్జగింపులు
జేఎన్టీయూ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగులు
ఈనాడు, విజయనగరం:్య పార్వతీపురం నియోజకవర్గంలోని అంగన్వాడీ కార్యకర్తలను ఎన్నికల విధులకు తీసుకున్నారు. వారికి పోస్టల్ బ్యాలెట్ జారీ చేశారు. వైకాపా నాయకులు బలిజిపేట మండలంలో పనిచేసే ఒక్కొక్కరికీ రూ.2 వేల చొప్పున ఇచ్చారు. వారు నిరాకరించినా బలవంతంగా చేతిలో పెట్టారు. సుమారు 61 మంది తీసుకున్నట్లు సమాచారం. బలిజిపేట వైకాపా అభ్యర్థి అలజంగి జోగారావు సొంత మండలం కావడం గమనార్హం.
- సీతానగరం మండలంలో మరో 60 మంది అంగన్వాడీలకు కాసులు ఎర వేశారు. అందరూ డబ్బులు తీసుకుని తమ పార్టీకే ఓటేయాలని నాయకులు కోరగా.. వారంతా తిరస్కరించినట్లు తెలుస్తోంది.
- పార్వతీపురం పట్టణ పరిధిలోని అంగన్వాడీలతోనూ అధికార పార్టీ నాయకులు మాట్లాడారు. వారు ససేమిరా అనడంతో వారి చరవాణి నంబర్లు సంపాదించి రూ.2 వేల చొప్పున ఫోన్పే చేసినట్లు తెలిసింది.
- బొబ్బిలి నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్లు అందుకున్న వారిలో ఉపాధ్యాయులు అధికం. సోమవారం ఓట్లు వేసేందుకు వచ్చిన వారికి ఆయా ప్రాంతాల వైకాపా నాయకులు ఫోన్లు చేశారు. తమ పార్టీకి ఓటేసి, దాన్ని చరవాణిలో ఫొటో తీసి పంపించాలని ఆదేశించారు. పంపని వారు ఓటేయలేదని భావిస్తామని, తదుపరి పరిణామాలకు సిద్ధంగా ఉండాలని బెదిరించినట్లు తెలిసింది. వీటిని వారెవరూ పట్టించుకోకుండా వెళ్లినట్లు సమాచారం. ప్రభుత్వంపై ఉద్యోగులందరూ వ్యతిరేకతతో ఉన్నారు. పైగా వారికి ఎంత పగ ఉందో ఈసారి పోస్టల్ బ్యాలెట్ల కోసం అందిన దరఖాస్తులు తెలియజేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వంపై మీకు వ్యతిరేకత ఉండవచ్చు.. కానీ మీకు ఎప్పుడూ మేము అందుబాటులో ఉంటాం.. అర్థం చేసుకోండి.. మాకే ఓటేయండని నాయకులు ప్రాథేయపడినా ఛీకొట్టారు.
జాబితాల్లో పేర్లు లేవు..
విజయనగరంలోని జేఎన్టీయూలో పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసినా జాబితాలో పేర్లు లేవని కొందరు.. ఉన్నా జారీ చేయలేదని మరికొందరు ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల శిక్షణలో దరఖాస్తులు ఇచ్చామని, ఇప్పుడు ఓటు వినియోగానికి వస్తే పేర్లు లేవని చెబుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులు వారి ఓటుహక్కు ఉన్న నియోజకవర్గంలోని ఫెసిలిటేషన్ కేంద్రానికే వెళ్లాలని కలెక్టర్ కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇసుకపై.. డేగకన్ను
[ 19-05-2024]
ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలో గనుల శాఖ అధికారులు తనిఖీలకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్లు చూసీచూడనట్లు వ్యవహరించిన వారంతా గత రెండు రోజులుగా రేవులను పరిశీలించే పనిలో పడ్డారు. -
జీర్ణావస్థలో జీసీసీ
[ 19-05-2024]
గిరిజనులకు అండగా నిలిచి.. వారు సేకరించే అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఏర్పాటు చేసిన జీసీసీ (గిరిజన సహకార సంస్థ)ని ప్రభుత్వం ఖూనీ చేసింది. -
భూసార పరీక్షల ఫలితాలేవీ..?
[ 19-05-2024]
ఏ పంట పండించినా దిగుబడి బాగుండాలంటే భూమి సారవంతంగా ఉండాలి. దీని కోసం భూమిలో లోపాలు తెలుసుకొని, అవసరమైన చర్యలు చేపట్టాలి. దీంతో దిగుబడి పెరిగి వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. -
కూటమికి 160 పైగా సీట్లు ఖాయం
[ 19-05-2024]
రాష్ట్రంలో కూటమికి 160కి పైగా సీట్లు రావడం ఖాయమని చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు అన్నారు. శనివారం చీపురుపల్లిలోని నటరాజ్ రెసిడెన్సీలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. -
ఉన్నవి 24 రోజులే.. నాడు-నేడు మాటేమిటి?
[ 19-05-2024]
రెండో విడత నాడు నేడు పనులు నిధుల కొరతతో 2023 అక్టోబరు నుంచి నిలిచిపోయాయి. ఏప్రిల్లో డబ్బులు విడుదలైనా సిమెంట్, ఇసుక వంటివి అందుబాటులో లేకపోవడంతో ముందుకు సాగలేదు. -
వైకాపా కదలికలపై నిఘా అవసరం
[ 19-05-2024]
స్థానిక తహసీల్దారు కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ గది తెరిచిన ఘటనపై శనివారం బంగ్లాలో పొలిట్బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్గజపతిరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి అదితి గజపతిరాజు పార్టీ ముఖ్య నాయకులతో చర్చించారు. -
ఈ ఖరీఫ్లో కన్నీరే!
[ 19-05-2024]
కళ్లెదుటే నీళ్లున్నాయి.. చేతుల్లో డబ్బులున్నాయి.. కానీ ఫలితం లేదు.. పొలం తడవదు.. పంట పండదు.. జలాశయాల ఆధునికీకరణకు జైకా నిధులిచ్చినా.. పనులు చేయడంలో ప్రభుత్వం నిర్లిప్తత చూపించింది. ఫలితంగా మూడేళ్లు అవుతున్నా పనుల్లో ఆశించిన పురోగతి లేదు. -
అనంతపురం ఎస్పీగా గౌతమీశాలి
[ 19-05-2024]
విశాఖపట్నం 16 బెటాలియన్ కమాండెంట్గా పనిచేస్తున్న గౌతమీశాలిని ఎన్నికల సంఘం అనంతపురం ఎస్పీగా నియమించింది. -
ఈఏపీసెట్లో మెరుపులు
[ 19-05-2024]
తెలంగాణ ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో ఉమ్మడి జిల్లాల విద్యార్థులు మెరిశారు. వ్యవసాయం, ఫార్మసీ విభాగంలో బలిజిపేట మండలం చిలకలపల్లికి చెందిన నాగుదాసరి రాధాకృష్ణ రెండో ర్యాంకు, ఇంజినీరింగ్ విభాగంలో విజయనగరానికి చెందిన దనుకొండ శ్రీనిధి పదో ర్యాంకు పొందారు. -
స్ట్రాంగ్ రూం తెరుస్తున్నట్లు సమాచారం ఇవ్వలేదు
[ 19-05-2024]
విజయనగరం తహసీల్దారు కార్యాలయంలో ఈ నెల 16న పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్రూం తెరిచినప్పుడు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని విజయనగరం అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పాండ్రంకి వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫుట్బోర్డు మీదనుంచి జారిపడి మహిళ దుర్మరణం
-
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
-
‘డబ్బు తిన్న వారిపై కుక్కల్ని వదలండి’.. కొడాలి నాని అనుచరుడి వీడియో వైరల్
-
భూమి రాసివ్వకపోతే.. చంపేస్తామన్నారు!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!