స్వేచ్ఛగా నిర్లక్ష్యం
పాఠశాలల్లో కిశోర బాలికల ఆరోగ్యం, పరిశుభ్రత లక్ష్యంగా స్వేచ్ఛ కార్యక్రమాన్ని గతేడాది అక్టోబరులో ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద బాలికలకు ఉచితంగా న్యాప్కిన్లు పంపిణీ చేస్తున్నారు. పాఠశాలల్లో వీటి వితరణ, నిర్వీర్యం కోసం లక్షలాది రూపాయల
పాఠశాలల్లో అమలుకు నోచుకోని వితరణ యంత్రాలు
విద్యార్థినులకు తప్పని ఇబ్బందులు
ఈనాడు డిజిటల్, ఒంగోలు పాఠశాలల్లో కిశోర బాలికల ఆరోగ్యం, పరిశుభ్రత లక్ష్యంగా స్వేచ్ఛ కార్యక్రమాన్ని గతేడాది అక్టోబరులో ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద బాలికలకు ఉచితంగా న్యాప్కిన్లు పంపిణీ చేస్తున్నారు. పాఠశాలల్లో వీటి వితరణ, నిర్వీర్యం కోసం లక్షలాది రూపాయల విలువైన యంత్రాలను పాఠశాలలకు అందజేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అవి నిరుపయోగంగా పడి ఉన్నాయి. కొన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేసినా వినియోగం కావడంలేదు. చాలా చోట్ల ఆ యంత్రాలను ఏర్పాటు చేయలేదు. చాలా చోట్ల వీటిని మూలన పడేసి నేరుగా విద్యార్థినులకు రెండు మూడు నెలలకు ఒకసారి ప్యాడ్లు అందజేస్తున్నారు. యంత్రాలను ఏర్పాటు చేయకపోవడంతో అత్యవసర సమయాల్లో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు.
నిర్వహణ లోపించి
యుక్తవయసులో ఉన్న బాలికలు, మహిళల్లో రుతుక్రమం పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలో స్వేచ్ఛ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లు అందజేయాలని, ఈ సమయంలో ఆరోగ్యం, పరిశుభ్రత ప్రాముఖ్యతపై అవగాహన తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అక్టోబరులో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి రాష్ట్రంలోని 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 10లక్షల మంది విద్యార్థినులకు న్యాప్కిన్లు అందజేస్తామని, ఇందులో భాగంగా రాష్ట్రంలోని 6,417 పాఠశాలల్లో వితరణ మిషన్లు, వాటిని కాల్చి నిర్వీర్యం చేసే యంత్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
386 యంత్రాల అందజేత
జిల్లాలో 192 పాఠశాలల్లో 192 న్యాప్కిన్లు వితరణ యంత్రాలు, 192 వినియోగించిన వాటిని నిర్వీర్యం చేసే యంత్రాలను ఆయా పాఠశాలలకు అందజేశారు. ఆయా పాఠశాలల్లో దాదాపు లక్షమంది బాలికలకు వీటిని పంపిణీ చేస్తున్నారు. ఏడాదికి 120 చొప్పున అందజేయాల్సి ఉండగా వారి కోటా మేరకు రెండు మూడు నెలలకు ఒకసారిగా అందజేస్తున్నారు. ఒకేసారి ఇస్తుండటంతో కొందరు బాలికలు వాటిని ఇంటి వద్ద ఉంచుతున్నారు.
ఏర్పాటు చేసినా పనిచేయడం లేదు
గుడ్లూరులోని నాలుగు ఉన్నతపాఠశాలల్లో అమర్చేందుకు శానిటరీ న్యాప్కిన్ల వితరణ యంత్రం, వినియోగించిన న్యాప్కిన్లను నిర్వీర్యం చేసే పరికరాలను అందజేశారు. ఆ యంత్రాలను పాఠశాలల్లో అమర్చేందుకు సరైన విద్యుత్తు సదుపాయం లేకపోవడం, ఇన్స్టాల్ చేసే సాంకేతిక సిబ్బంది రాకపోవడంతో ఇప్పటి వరకు వాటిని వినియోగించడం లేదు. పాఠశాలలకు ఇచ్చిన ఈ యంత్రాలు ఆయా పాఠశాలల స్టోర్ రూములు, వంట గదుల్లో పడి ఉన్నాయి. దీంతో వేల రూపాయల మిషన్లు తుప్పు పట్టి పాడై పోతున్నాయి. ఒంగోలు, కందుకూరు, మార్కాపురం అన్ని డివిజన్లలోనూ చాలా పాఠశాలల్లో ఇంకా అమర్చనవి, వినియోగించనవి ఉన్నాయి. కొన్నిచోట్ల ఏర్పాటు చేసినా అవి పనిచేయడంలేదు. ఒంగోలులోని ఒక ఉన్నత పాఠశాలలో సాంకేతిక నిపుణులు రాక అలాగే పడి ఉన్నాయి. కనిగిరి జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో యంత్రాలను ఏర్పాటు చేసినా అవి పనిచేయడంలేదు. అయినా విద్యార్థినులకు సంబంధించిన శానిటరీ న్యాప్కిన్లు వారి కోటా ప్రకారం పంపిణీ చేస్తున్నామని పాఠశాల అధ్యాపకులు చెబుతున్నారు.
కనిగిరి జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేయని యంత్రం
నిర్వహణ చర్యలు చేపడతాం
రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాంట్రాక్టు తీసుకున్న హెఎల్ఎల్ కంపెనీ న్యాప్కిన్లు వితరణ, వినియోగించిన వాటిని నిర్వీర్యం చేసే యంత్రాలను పాఠశాలల్లో ఇన్స్టాల్ చేయాలి. ఒప్పందం ప్రకారం ఇన్స్టాలేషన్, నిర్వహణపై డెమో ఇవ్వాల్సి ఉన్నా ఇంకా కొన్ని పాఠశాలల్లో ఇవ్వలేదు. జిల్లాలోని పరిస్థితి పైౖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. త్వరలోనే ఇన్స్టాల్ చేసి సక్రమంగా నిర్వహణ చేసే పనులను చేపడతాం. - బి.విజయభాస్కర్, డీఈవో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు