సెబ్ అదనపు ఎస్పీ బాధ్యతల స్వీకరణ
స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో (సెబ్) అదనపు ఎస్పీగా ఎన్.సూర్యచంద్రరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం... జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మలికా గార్గ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. 1989 బ్యాచ్లో ఎస్సైగా పోలీసు శాఖలో
ఎస్పీ మలికా గార్గ్కు మొక్క అందజేస్తున్న సెబ్ అదనపు ఎస్పీ సూర్యచంద్రరావు
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో (సెబ్) అదనపు ఎస్పీగా ఎన్.సూర్యచంద్రరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం... జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మలికా గార్గ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. 1989 బ్యాచ్లో ఎస్సైగా పోలీసు శాఖలో చేరిన సూర్యచంద్రరావు... విశాఖపట్నం రేంజి పరిధిలో బాధ్యతలు నిర్వహించారు. డీఎస్పీ హోదాలో అనిశాలో పనిచేశారు. అదనపు ఎస్పీగా ఉద్యోగోన్నతి పొందిన తర్వాత విజయనగరంలో ఓఎస్డీగా పనిచేస్తూ జిల్లా సెబ్కు బదిలీ అయ్యారు. సారా నిర్మూలనతో పాటు... గంజాయి, గుట్కా అక్రమ రవాణాను అడ్డుకుంటామని, ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారిస్తామని సూర్యచంద్రరావు తెలిపారు.
రీసర్వే, భూ దస్త్రాల స్వచ్ఛీకరణ వేగవంతం
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: రీసర్వే, భూ దస్త్రాల స్వచ్ఛీకరణపై సంబంధిత అధికారులతో సంయుక్త కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. భూ రీసర్వేను వేగవంతం చేయడంతో పాటు... జిల్లా ముందు స్థానంలో ఉండేందుకు కృషి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో డ్రోన్ ఫ్లయింగ్, దస్త్రాల స్వచ్ఛీకరణ సక్రమంగా జరగేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. మండలాల వారీగా పురోగతిపై సమీక్షించారు. సమావేశంలో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఎం.శ్రీదేవి, సర్వే విభాగం ఏడీ గౌస్బాషా తదితరులు పాల్గొన్నారు.
పొగాకు కిలో గరిష్ఠ ధర రూ.186
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: పొదిలి కేంద్రంలో బుధవారం నిర్వహించిన వేలంలో పొగాకు కిలో గరిష్ఠ ధర రూ.186; మిగతా కేంద్రాల్లో రూ.185 చొప్పున లభించింది. ఎస్బీఎస్ రీజియన్లోని కేంద్రాలకు అమ్మకాల నిమిత్తం 3,850 బేళ్లు రాగా... వాటిలో 3,469; ఎస్ఎల్ఎస్ రీజియన్ పరిధిలో 4,136 రాగా... 3,799 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. పొదిలి కేంద్రంలో కిలో కనిష్ఠ ధర రూ.40 చొప్పున లభించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ చేతిలో జనం బికారులు
[ 05-05-2024]
జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం (టైటిలింగ్ యాక్ట్-2022)పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
కూటమిదే పక్కా విజయం
[ 05-05-2024]
‘సభకు వచ్చిన జనం చూపుతున్న ఉత్సాహం.. యువత, మహిళల కేరింతలు చూస్తుంటే దర్శిలో మన విజయం పక్కా అని తేలిపోయింది. ఈ సారి కచ్చితంగా తెదేపా జెండా ఎగరేస్తాం. -
పోలింగ్కు ఇదేం సన్నద్ధత!
[ 05-05-2024]
తపాలా ఓటింగ్ మొదటి రోజైన శనివారం జిల్లాలో పలు చోట్ల అధికారులు నిర్లిప్తంగా వ్యవహరించారు. ఒంగోలు డీఆర్ఆర్ఎం ఉన్నత పాఠశాలలోని సగం కేంద్రాల్లో గెజిటెడ్ అధికారులు అందుబాటులో లేరు. -
జగన్ రాసిన మరణ శాసనం
[ 05-05-2024]
అయిదేళ్ల క్రితం వచ్చిన ఆ పాద యాత్రికుడు అక్కడి వారిపై అమృతం కురిపించారు..జీవచ్ఛవాల్లా ఉన్న కనిగిరివాసులకు ఊరడించారు..ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమికొడతానన్నారు. -
11న ఒంగోలుకు చంద్రబాబు
[ 05-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 11న తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒంగోలు రానున్నారు. -
తెదేపా గూటికి వైకాపా సర్పంచి
[ 05-05-2024]
పొన్నలూరు మండలంలో సైకిల్ జోరు మీదుంది. మండలంలోని కె.అగ్రహారం గ్రామ సర్పంచి షేక్ చిన్న మస్తాన్ శుక్రవారం రాత్రి దామచర్ల సత్య సమక్షంలో తెదేపాలో చేరారు. -
పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలి
[ 05-05-2024]
పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ దినేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
కొత్తపట్నంలో భద్రతా ఏర్పాట్ల పరిశీలన
[ 05-05-2024]
సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కొత్తపట్నం మండలం రెడ్డిపాలెం, కె.పల్లెపాలెం, ఈతముక్కలలోని పోలింగ్ కేంద్రాలను శనివారం జిల్లా పోలీసు పరిశీలకులు హసిబ్ ఉర్ రెహమాన్ పరిశీలించారు. -
చట్టం ముసుగులో దోపిడీకి జగన్ కుట్ర
[ 05-05-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఆస్తులు, భూములకు రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంతో పాటు జిల్లాలోని మార్కాపురం పశ్చిమ ప్రాంతంలో రైతులకు చెందిన భూములు, పట్టా భూములను పట్టపగలే ఆక్రమణ చేసుకోని కబ్జా చేస్తున్న, చేసిన ఉదంతాలు అనేకం ఉన్నాయి.