logo

11న ఒంగోలుకు చంద్రబాబు

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 11న తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒంగోలు రానున్నారు.

Published : 05 May 2024 02:36 IST

9న జనసేనాని రాక ?

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 11న తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒంగోలు రానున్నారు. ఆ రోజున మధ్యాహ్నం 3 గంటలకు నగరంలో రోడ్డుషోతో పాటు, స్థానికులనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఎన్నికల ప్రచారానికి 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు తుది గడువు కానున్న నేపథ్యంలో ఆయన చివరి ప్రసంగం ఒంగోలులోనే ఇవ్వనున్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఈ నెల 9వ ఒంగోలు వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది. ఆ రోజు రాకుంటే 11న చంద్రబాబుతో కలిసి పాల్గొనే అవకాశముందని  సమాచారం. ఆయన పర్యటనపై జిల్లా తెదేపా నాయకులు చర్చిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని