ఎక్కడున్నా.. వివరణ ఇవ్వండి
ఫిర్యాదు తీసుకున్నారు.. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు... పలు కేసుల్లో నిందితులకు 41 సీఆర్పీసీ అనుసరించి నోటీసులు జారీ చేశారు.
సమావేశంలో ఎస్పీ ఆగ్రహం
పలువురు అధికారులకు సంజాయిషీ నోటీసులు
నేరాలపై సమీక్షిస్తున్న ఎస్పీ మలికా గార్గ్.. హాజరైన పోలీసు అధికారులు
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: ఫిర్యాదు తీసుకున్నారు.. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు... పలు కేసుల్లో నిందితులకు 41 సీఆర్పీసీ అనుసరించి నోటీసులు జారీ చేశారు. అనంతరం ఆ కేసు పక్కన పడేశారు. కనీస దర్యాప్తు కూడా సాగని ఇటువంటివి ఎన్నో...ఈ తరహా నిర్లక్ష్యంపై ఎస్పీ మలికా గార్గ్ ఆగ్రహించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో పెద్దసంఖ్యలో సీఐ, ఎస్సైలకు ఛార్జిమెమోలు జారీ చేశారు. పర్యవేక్షణాధికారులైన డీఎస్పీలకూ మెమోలు ఇచ్చారు. గతంలో సదరు సర్కిళ్లు, స్టేషన్లలో పనిచేసి ప్రస్తుతం బదిలీపై ఇతర ప్రాంతాల్లో ఉన్నవారిని సైతం ఉపేక్షించలేదు. మీ హయాంలో ఆయా కేసుల దర్యాప్తులో ఎందుకు నిర్లక్ష్యం చేశారో వచ్చి వివరణ ఇచ్చి వెళ్లండంటూ సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు 200 కేసులను ఎస్పీ స్వయంగా పరిశీలించారు. 2020 సంవత్సరంలో నమోదై ఇప్పటికీ దర్యాప్తు పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఒంగోలు సబ్ డివిజన్లోని వివిధ సర్కిళ్లలో పనిచేసి ప్రస్తుతం వేకెన్సీ రిజర్వ్లో ఉన్న సీనియర్ సీఐకు ఛార్జిమెమో ఇచ్చినట్లు తెలిసింది. సిôగరాయకొండ సర్కిల్ పరిధిలోని స్టేషన్లో గతంలో పనిచేసిన ముగ్గురు ఎస్సైలకూ వీటిని జారీచేశారు. ఇదే సర్కిల్లో టోల్ప్లాజాకు సంబంధించిన కేసులో చరవాణిని ఎఫ్ఎస్ఎల్కు పంపడంలో జాప్యం చేసినందుకు గతంలో పనిచేసిన ఇద్దరు సీఐలకు ఛార్జిమెమోలు జారీచేసినట్లు సమాచారం.
మహిళలపై నేరం జరిగితే జీరో ఎఫ్ఐఆర్
జిల్లాలో మహిళలు, చిన్నారులపై నేరాలు జరిగితే సంబంధిత పోలీసు అధికారులు సత్వరం స్పందించాలని.. నేర ప్రదేశం తమ పరిధిలోకి రాకపోయినా కచ్చితంగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎస్పీ ఆదేశించారు. దోపిడీలు, దొంగతనాలు, అదృశ్యం కేసుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించి మంచి ఫలితాలు రాబట్టాలన్నారు. నేర నియంత్రణకు పెట్రోలింగ్, రాత్రి గస్తీ వ్యవస్థలను పటిష్టం చేసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీలు కె.నాగేశ్వరరావు(అడ్మిన్), ఎస్.వి.శ్రీధర్రావు(క్రైమ్స్), ఎన్.సూర్యచంద్రరావు(సెబ్), అశోక్బాబు(ఏఆర్), ఎస్బీ డీఎస్పీ మరియదాసు.. ఒంగోలు, దర్శి, మార్కాపురం డీఎస్పీలు యు.నాగరాజు, నారాయణస్వామిరెడ్డి, కిషోర్కుమార్; డీటీసీ డీఎస్పీ రామకృష్ణ, డీసీఆర్బీ సీఐ పి.దేవప్రభాకర్, న్యాయసలహాదారు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిరుద్యోగులకు ‘జగనన్న ద్రోహం’
[ 07-05-2024]
ఏటా జాబ్ క్యాలెండర్..మెగా డీఎస్సీ..ఆపై ఏపీపీఎస్సీ..ఇంకా పోలీసు పోస్టులు..మీకిక ఉద్యోగాలే ఉద్యోగాలు. అయిదేళ్ల క్రితం జగన్ ఇలా తన వంచనాపూరిత హామీలతో జిల్లాను హోరెత్తించేశారు. -
‘భూ’చోళ్లు.. జగనన్నే వెన్నుదన్ను
[ 07-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో భూ మాఫియా రెచ్చిపోయింది. కొండలు, గుట్టలు, కాలువ గట్లు, జల వనరులు, అసైన్డ్, పశువుల పోరంబోకు, దేవుని మాన్యం, శ్మశాన భూములు ఆక్రమించారు. -
ఓటేయకుంటే... గొంతులూ తడపం
[ 07-05-2024]
గొంతులెండుతున్నాయి. గుక్కెడు మంచినీళ్లు ఇవ్వండని జనం వేడుకుంటుంటే.. ‘మీరు మా పార్టీ కాదు కదా’ అని ప్రశ్నిస్తూ అమానుషంగా ప్రవర్తిన్నారు వైకాపా నాయకులు. -
అంతర్జాతీయ రాగం.. బతుకులు ఆగమాగం..
[ 07-05-2024]
‘రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్య అందిస్తున్నాం. అందుకు విద్య, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నాం’ ఇవీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకొంటున్న మాటలు. -
కొనసాగుతున్న తపాలా.. ఇంటి వద్దే ఓటు
[ 07-05-2024]
జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఇతర శాఖల ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
అరాచక పాలనను అంతమొందిద్దాం
[ 07-05-2024]
రాష్ట్రంలో అరాచక పాలన అంతమొందించడానికి కాపులంతా జనసేన కూటమికి మద్దతుగా నిలవాలని టీబీకే రాష్ట్ర అధ్యక్షుడు దాసరి రాము కోరారు. -
అధికారం ఉన్నోడిదే భూమి!
[ 07-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పేదల ఆస్తులు, భూములకు రక్షణ లేకుండా పోయింది. రైతుల పట్టాదారు పాసుపుస్తకాలపై వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూరక్ష పథకం అనే పట్టాదారు పుస్తకాలు జారీచేసి దానిపైన సీఎం జగన్ మోహన్రెడ్డి పుస్తకాలను జారీచేశారు. -
తెదేపా హయాంలోనే సంక్షేమానికి పెద్దపీట
[ 07-05-2024]
వైకాపా పాలనలో కంటే తెదేపా హయాంలోనే సంక్షేమానికి బడ్జెట్లో ఎక్కువ ఖర్చుచేసినట్లు ఒంగోలు పార్లమెంటు తెదేపా అధ్యక్షులు నూకసాని బాలాజీ అన్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
[ 07-05-2024]
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో హత్య చేయించిన భార్యను, మరో ముగ్గురు నిందితులను గుంటూరులోని కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!
-
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి
-
రష్యా అధినేతగా ఐదోసారి.. ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం
-
సరదా సరదాగానే సిక్స్లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్లోనైతే..: రవిశాస్త్రి
-
టాప్ 5 మలయాళీ చిత్రాలు.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?