నల్లమలలో బాల సంస్కార కేంద్రాలు
బయటి ప్రపంచానికి దూరంగా ఉన్న నల్లమల చెంచు పిల్లలకు చదువుతో పాటు సంస్కారం నేర్పించేందుకు త్వరలో మరో సంస్థ ముందుకు రానుంది.
డిసెంబర్ 1 నుంచి ప్రారంభం
ఎన్టీఆర్ విజ్ఞాన కళా క్షేత్రం ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాట్లు
యర్రగొండపాలెం పట్టణం, న్యూస్టుడే
చీరాలలోని బాలసంస్కార కేంద్రంలో యోగాసనాలపై శిక్షణ
బయటి ప్రపంచానికి దూరంగా ఉన్న నల్లమల చెంచు పిల్లలకు చదువుతో పాటు సంస్కారం నేర్పించేందుకు త్వరలో మరో సంస్థ ముందుకు రానుంది. ఇప్పటికే స్వచ్ఛంద సంస్థ ఆర్డీటీ చెంచుల అభివృద్ధి కోసం పనిచేస్తోంది. తాజాగా ఎన్టీఆర్ విజ్ఞాన కళా క్షేత్రం ట్రస్టు ఆధ్వర్యంలో ‘బాల సంస్కార కేంద్రాలు’ ఏర్పాటుకానున్నాయి. యర్రగొండపాలెం మండలంలోని హనుమంతుని చెంచు గూడెం, పునరావాసకాలనీ, అంకమ్మ చెంచుగూడేల్లో ఇటీవల ఆ ట్రస్టు ఆధ్వర్యంలో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పర్యటించి గిరిజనులతో మాట్లాడారు. అక్కడి చెంచుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. గిరిజనులు పిల్లలను వదలి అడవిలోకి వెళ్లి ఉసిరి కాయలు, సుగంధ గడ్డలు, తేనె, కుంకుడు తదితర అటవీ సంపద కోసం నాలుగు రోజుల నుంచి పది రోజుల పాటు ఉండి పోతుంటారు. ఆ సమయంలో ఇంటి వద్దే పిల్లలు ఉండటంతో కొందరు బడికి సక్రమంగా వెళ్లడం లేదు. మరికొందరు చెట్టు, పుట్టల వెంట తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో గూడేల్లో బాల సంస్కార కేంద్రాలు ఏర్పాటుచేయాలని ఈ ట్రస్టు సంకల్పించింది. సాయంత్రం రెండు గంటలు, ఉదయం ఒక గంట పిల్లలకు చదువుతో పాటు వివిధ సంప్రదాయాలు నేర్పించనున్నారు.
ఇటీవల నల్లమల చెంచుగూడేల్లో పర్యటిస్తున్న దగ్గుబాటి
ఉమ్మడి ప్రకాశంలో 22 కేంద్రాలు
దశాబ్దకాలంగా ఎన్టీఆర్ విజ్ఞాన కళా క్షేత్రం ట్రస్టు కింద తమ సొంత ఖర్చులతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి దంపతులు ‘బాల సంస్కార కేంద్రాలు’ ఏర్పాటు చేసి మత్స్య కారుల పిల్లలను ఉచితంగా చదివిస్తున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 24 కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చీరాల నుంచి చినగంజాం వరకు 22 గ్రామాల్లో ఉపాధ్యాయులను నియమించి పిల్లలకు ప్రతి రోజు రెండు గంటల పాటు విద్యా బోధన తోపాటు క్రమశిక్షణ, సత్ప్రవర్తన, నీతి కథలు, ఆటలు, యోగాసనాలు, శ్లోకాలు, సుభాషితాలు వంటివి బోధిస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లడం వల్ల వారి పిల్లల మీద అజమాయిషీ తగ్గి విద్యాపరంగా వారిని సరైన నడవడికలో పెట్ట లేకపోతున్నారు. ఈ విషయాన్ని గమనించి ట్రస్టు పిల్లలకు మంచి విద్యను నడవడికను, కళలు, ఆచార సంప్రదాయాలను నేర్పిస్తుంది.
సిబ్బందిని ఎంపిక చేశాం
ఆవుల తిరుపతి, కేంద్రాల ఇన్ఛార్జి
ప్రకాశం జిల్లాలో 82 గిరిజన చెంచు గూడేలు ఉన్నాయి. ఎక్కువగా వై.పాలెం నియోజకవర్గంలోని చెంచు గిరిజనులు బయటి ప్రపంచానికి దూరంగా అటవీ ప్రాంతాల్లో జీవిస్తున్నారు. ఇక్కడి పిల్లల దీన పరిస్థితులను తెలుసుకుని విద్యను అందించేందుకు ఈ ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. మొదట దశలో 12 కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం. డిసెంబర్ 1వ తేదీ నుంచి కేంద్రాలు ప్రారంభించనున్నాం. వీటిలో పని చేసేందుకు ఇప్పటికే కొంత మంది సిబ్బందిని ఎంపిక చేశాం. వీటిలో నియమితులయ్యే ఉపాధ్యాయులకు రూ.2 వేల నుంచి రూ.7 వేల వరకు జీతం ఇవ్వనున్నాం. ఏడు నుంచి పది మంది ఉపాధ్యాయులపై ఒక పర్యవేక్షకుడిని సైతం నియమించనున్నాం. తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను గౌరవించేలా విద్యా బుద్ధులు నేర్పి ఆట పాటలతో కూడిన విద్యను అందించేందుకు ఈ బాల సంస్కార కేంద్రాలు ఎంతో దోహదపడతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న నేతల ఆగమనం.. ఒకేరోజు జగన్, లోకేష్, బాలకృష్ణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల తేదీ సమీపించే కొద్ది ప్రధాన పార్టీల కీలక నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఇకపై ప్రచారం జోరందుకోనుంది. -
రూ. 4.92 కోట్ల ఖర్చు.. రూ.2.21 కోట్ల జప్తు
[ 27-04-2024]
ఎన్నిల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు జిల్లాలో రూ.2,21,90,514 విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఓటర్లను ప్రభావితం చేసేలా పంచేందుకు సిద్ధం చేసినట్లుగా అనుమానిత వస్తువులను సీజ్ చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. -
హెచ్చరిక.. కండువాలు మారిస్తే జరిమానా
[ 27-04-2024]
ప్రస్తుతం ఎవరు ఏ పార్టీనో ఇతమిత్థంగా చెప్పలేం. ఈ రోజు ఉదయం ఒక రాజకీయ పార్టీ కండువా కప్పుకొంటే.. సాయంత్రానికే మరో పార్టీ పిలిచిందంటూ అక్కడ ప్రత్యక్షమవుతుంటారు. -
246మంది అభ్యర్థులు415నామినేషన్లు48తిరస్కరణలు
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. -
పేరుకే పోలీసులు..పుత్రరత్నం సేవలో బానిసలు
[ 27-04-2024]
పేరుకే పోలీసులు. నిత్యం వైకాపాకు వంతపాడుతుంటారు. ఆ నాయకులతో అంటకాగుతుంటారు.. అధికార పార్టీ నేతల సేవలో తరిస్తూ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. -
18,22,470 మంది చేతుల్లో భవిత
[ 27-04-2024]
మే 13 నాటి సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల చేర్పులు, మార్పులు, తొలగింపుల సవరణల ప్రక్రియ పూర్తయింది. -
తాడేపల్లి జలగ.. రక్త మాంసాలు పీల్చ
[ 27-04-2024]
అధికారంలోకి వస్తానే జగన్ విడతల వారీగా మద్య నిషేధాన్ని గాలికొదిలేశారు. ఏకంగా ప్రభుత్వంతోనే మద్యం దుకాణాలు ఏర్పాటు చేయించారు. ఊరూరా మద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. -
పైసా విదిల్చింది లేదు
[ 27-04-2024]
గిద్దలూరు నియోజకవర్గం అర్థవీడు మండల కేంద్రంలోని బాలుర గురుకుల మైదానంలో గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.కోటి నిధులతో మినీ ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను 2018లో చేపట్టింది. -
తెదేపా పాలనలోనే అభివృద్ధి
[ 27-04-2024]
తెదేపా పాలనలోనే అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా గిద్దలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి పేర్కొన్నారు.. ఆయన శుక్రవారం గిద్దలూరు నగర పంచాయతీలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. -
కన్నీరే మిగిల్చావ్.. జగన్
[ 27-04-2024]
బొప్పాయి పంట పండించి ఆదాయాన్ని సాధించాలన్న రైతుల కల కలగానే మిగిలింది. ఉద్యాన పంటలకు గత ప్రభుత్వం రాయితీలిచ్చి ప్రోత్సహించడంతో రైతులు ఈ పంట సాగుపై దృష్టి పెట్టారు. -
నిధులు నిలిపివేసి.. కేంద్రానివీ మింగేసి.. పురాల గొంతు నులిమిన పాలకుడు
[ 27-04-2024]
రోడ్ల విస్త‘రణం’..ఊసేలేని కాలువల నిర్మాణం..వీధి దీపాల ఏర్పాటులో నిర్లక్ష్యం..ఇక పత్తాయే లేని పారిశుద్ధ్యం ! జిల్లాలోని నగర, పుర సంస్థల్లో గత అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం ఒరగబెట్టిందిదే ! వసతులు కల్పించడం లేదు మొర్రో అని స్వయంగా వైకాపా వార్డు సభ్యులే గళమెత్తడం పాలకుల వైఫల్యాలకు అద్దం పడుతోంది. -
కక్ష కట్టి కడుపు కొడతారు
[ 27-04-2024]
2019 ఎన్నికల్లో వైకాపా ప్రభంజనం వీచినా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో (ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్నాయి) తెదేపా ఎమ్మెల్యేలే విజయం సాధించారు. -
తెదేపాకు మద్దతుగా ఉన్నారని నీళ్ల నిలిపివేత
[ 27-04-2024]
బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో వైకాపా నేతల దాష్టీకాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా రేపల్లె, నగరం మండలాల్లోని మూడు, నాలుగు గ్రామాల్లో దళిత కాలనీలకు తాగునీరు సరఫరా చేసే విషయంలో ఆ కాలనీల్లో ఉండే వైకాపా నాయకులు రాజకీయ కోణంలో ఆలోచించి వివక్ష చూపడంతో గుక్కెడు నీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. -
ఐ ప్యాక్ సర్వేలన్నీ బోగస్
[ 27-04-2024]
రాష్ట్రంలో వైకాపా పనైపోయిందని, ఐప్యాక్ సర్వేలన్నీ బోగస్ అని నరసరావుపేట కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.