అటు ఈడీ... ఇటు సీఐడీ
దిల్లీ మద్యం కుంభకోణంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరు వెలుగు చూడటం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.
రసవత్తరంగా జిల్లా రాజకీయాలు
చర్చనీయాంశమైన తనిఖీలు.. దాడులు
ప్రకాశంలో రాజకీయ పరిస్థితులు రసవత్తరంగా మారాయి. ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), మరోవైపు నేర పరిశోధన విభాగం(సీఐడీ) జిల్లాపై దృష్టి సారించాయి. దేశ రాజధాని దిల్లీ మద్యం కేసులో భాగస్వామ్యం/అనుమానం ఉన్నట్టు తెలుపుతూ అమిత్ అరోడా అనే నిందితుడిని ఈడీ అక్కడి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ రిపోర్ట్ సమర్పించింది. అందులో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా చేరింది. తాజాగా జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంటున్న భూకుంభకోణంపై సీఐడీ దృష్టి పెట్టింది. ఒంగోలు పరిసర ప్రాంతాల్లో గత కొన్నాళ్లుగా సాగుతున్న భూదందాలపై తమకు అందిన ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులకు సీఐడీ తాఖీదులు పంపింది. ఇప్పుడు ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జిల్లాకేంద్రంలో రూ.వందల కోట్ల విలువైన భూములను అత్యంత వివాదాస్పదంగా కొందరికి కట్టబెట్టారు. ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించి ఈనాం భూములకు కూడా పట్టాలు సృష్టించిన వైనం ప్రస్తుతం ప్రకంపనలు రేపుతోంది. రాజకీయ నాయకుల ప్రాప్తం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడిన యంత్రాంగం చిక్కుల్లో చిక్కుకుంది. ఈ వ్యవహారమంతా జిల్లా కేంద్రానిదే కావడంతో అందరి దృష్టి మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన తనయుడు ప్రణీత్రెడ్డిపై పడింది.
న్యూస్టుడే, ఒంగోలు నేరవిభాగం
మద్యం కేసులో మాగుంట...: దిల్లీ మద్యం కుంభకోణంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరు వెలుగు చూడటం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. తనిఖీలు, ప్రశ్నల పరంపర ఈ కేసులో వేడిని పెంచుతున్నాయి. వైకాపాలో అత్యంత కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడైన శరత్ చంద్రారెడ్డి అరెస్టు తర్వాత ఈ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. నిందితులు సాక్ష్యాలను చెరిపేయడం కోసం వందల సంఖ్యలో చరవాణులను ధ్వంసం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో అమిత్ అరోడా అరెస్టు, అతని రిమాండ్ రిపోర్టులో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరుండటం సంచలనం సృష్టిస్తోంది. ఈ కుంభకోణంలో తనకూ, తన కుమారుడు రాఘవరెడ్డికి ఎటువంటి సంబంధం లేదనీ, తామస్సలు దిల్లీ మద్యం వ్యాపారంలోనే లేమని ఎంపీ మాగుంట చెబుతున్నారు. ఈడీ విచారణలో వెలుగులోకి వస్తున్న అంశాలు మాత్రం విస్తుగొలిపేలా చేస్తున్నాయి.
నిన్న పదవి తొలగింపు.. నేడు విచారణ...: రాష్ట్రంలో ప్రస్తుతం సీఐడీ దృష్టి పూర్తిగా ప్రతిపక్ష నేతల పైనే ఉంది. అర్ధరాత్రి అరెస్టులు, బెయిళ్లు, జైలు నిత్యకృత్యంగా మారాయి. ఇటువంటి తరుణంలో ఒంగోలులో జరిగిన భూదందాలపై సీఐడీ దృష్టి సారించడం, రెవెన్యూ అధికారులకు నోటీసులు జారీ చేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ఒంగోలు నియోజకవర్గంలో అక్రమాలపై విచారణ రాజకీయ వర్గాల్లో చర్చకు తావిస్తోంది. గతంలో బాలినేనిని మంత్రి పదవి నుంచి తొలగించడం, వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న ఆయన్ను ప్రకాశం, బాపట్ల జిల్లాల బాధ్యతల నుంచి తొలగించటం ఇప్పటికే చర్చకు దారి తీసింది. ఈ తరుణంలో భూ అక్రమాలపై విచారణ సహజంగానే అందరినీ ఆలోచింపజేస్తోంది. ఒకవైపు ఎంపీ మాగుంటపై ఈడీ, మరోవైపు బాలినేని నియోజకవర్గంలో సీఐడీ విచారణలో ఇప్పుడు జిల్లాలో రాజకీయ చర్చలు వాడీవేడిగా సాగుతున్నాయి.
ఆ తొమ్మిది అంశాలకు సమాధానమివ్వండి...
కొంతకాలంగా ఒంగోలు నగరంలో పెద్దఎత్తున భూ ఆక్రమణలు చోటుచేసుకున్నాయి. వీటిపై సీఐడీ దృష్టి సారించింది. ఒంగోలు తహసీల్దార్కు నోటీసులు జారీ చేసింది. భూపందేరానికి సంబంధించి తొమ్మిది అంశాలను ప్రస్తావించింది. వీటిపై సమాధానం ఇవ్వాలని కోరింది..
అవి ఏమిటంటే..: భూముల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తహసీల్దార్లు నయీమ్ అహ్మద్; బి.వి.రమణారావు, కె.చిరంజీవి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఝాన్సీ ఒంగోలులో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశారు. ప్రస్తుతం ఏ ప్రాంతాల్లో, ఏ హోదాల్లో పనిచేస్తున్నారు. * ఆ సమయంలో ఒంగోలులో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, విలేజ్ రెవెన్యూ అధికారులుగా పనిచేసిన వారి వివరాలు.* సర్వే నెం: 138, 264-పి, 264-పి1 సంఖ్యలోని భూములకు అసలైన యజమానులు ఎవరు.. యాజమాన్య హక్కులు ఎలా సంక్రమించాయి. * ప్రభుత్వానివా, ప్రైవేట్వా..?* పట్టాలు కేటాయించడానికి రెవెన్యూ అధికారులకు ఎంతమేరకు అధికారం ఉంది.* ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉన్నాయి.* ఆ భూములను సబ్ డివిజన్ ఎలా చేశారు.. అందుకు సంబంధించి సర్వేయర్, వీఆర్వో, ఆర్ఐ తయారుచేసిన స్కెచ్లు, రికార్డులు ఉన్నాయా.
* ఆర్ఎస్ఆర్ మేరకు సర్వే నెం: 138, 264, 267లో భూములను ఈనాంగా చూపారు. ఆ తర్వాత వాటిని సబ్ డివిజన్లుగా మార్చి పలువురికి పట్టాలు కేటాయించారు. ఈనాంగా చూపిన వాటిని డ్రై, ప్రభుత్వ భూములుగానూ చూపారు. ఇదెలా జరిగింది. వాటిని వెబ్ ల్యాండ్లో ఎలా నమోదు చేశారు. కేటాయింపులో ప్రమేయం ఉన్న రెవెన్యూ అధికారుల పేర్లు ఇవ్వగలరు.* యజమాని ఎవరన్నది వివరాలు లేకుండా ఖాతా నెం: 9099లో 0.02 సెంట్ల భూమిని వెబ్ల్యాండ్లో ఎలా నమోదు చేశారు. ఈ భూమి మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నది ఎవరు.
* అడకత్తెరలో పోకచెక్కలా అధికారులు...: తమ తొమ్మిది అంశాలకు సంబంధించిన వివరాలతో ఈ నెల తొమ్మిదో తేదీలోపు విచారణకు హాజరుకావాలని రెవెన్యూ అధికారులకు సీఐడీ తాఖీదులు జారీ చేసింది. రెవెన్యూ అధికారుల చర్యలతో లాభపడింది ఎవరైనా, మొత్తానికి ఇరుకున పడింది మాత్రం అధికార యంత్రాగమే. ఒత్తిళ్లు, ఇతర ప్రలోభాలకు లొంగి వ్యవహరించారు. వివాదాస్పద భూములకు అడ్డగోలుగా పట్టాలు జారీ చేశారు. తద్వారా లాభం పొందినవారుండగా, ఆ కేటాయింపులు చేసిన అధికారులు మాత్రం దోషుల్లా నిలవాల్సి వచ్చింది. వీరిపై వచ్చిన అభియోగాలు రుజువైతే మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న నేతల ఆగమనం.. ఒకేరోజు జగన్, లోకేష్, బాలకృష్ణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల తేదీ సమీపించే కొద్ది ప్రధాన పార్టీల కీలక నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఇకపై ప్రచారం జోరందుకోనుంది. -
రూ. 4.92 కోట్ల ఖర్చు.. రూ.2.21 కోట్ల జప్తు
[ 27-04-2024]
ఎన్నిల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు జిల్లాలో రూ.2,21,90,514 విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఓటర్లను ప్రభావితం చేసేలా పంచేందుకు సిద్ధం చేసినట్లుగా అనుమానిత వస్తువులను సీజ్ చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. -
హెచ్చరిక.. కండువాలు మారిస్తే జరిమానా
[ 27-04-2024]
ప్రస్తుతం ఎవరు ఏ పార్టీనో ఇతమిత్థంగా చెప్పలేం. ఈ రోజు ఉదయం ఒక రాజకీయ పార్టీ కండువా కప్పుకొంటే.. సాయంత్రానికే మరో పార్టీ పిలిచిందంటూ అక్కడ ప్రత్యక్షమవుతుంటారు. -
246మంది అభ్యర్థులు415నామినేషన్లు48తిరస్కరణలు
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. -
పేరుకే పోలీసులు..పుత్రరత్నం సేవలో బానిసలు
[ 27-04-2024]
పేరుకే పోలీసులు. నిత్యం వైకాపాకు వంతపాడుతుంటారు. ఆ నాయకులతో అంటకాగుతుంటారు.. అధికార పార్టీ నేతల సేవలో తరిస్తూ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. -
18,22,470 మంది చేతుల్లో భవిత
[ 27-04-2024]
మే 13 నాటి సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల చేర్పులు, మార్పులు, తొలగింపుల సవరణల ప్రక్రియ పూర్తయింది. -
తాడేపల్లి జలగ.. రక్త మాంసాలు పీల్చ
[ 27-04-2024]
అధికారంలోకి వస్తానే జగన్ విడతల వారీగా మద్య నిషేధాన్ని గాలికొదిలేశారు. ఏకంగా ప్రభుత్వంతోనే మద్యం దుకాణాలు ఏర్పాటు చేయించారు. ఊరూరా మద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. -
పైసా విదిల్చింది లేదు
[ 27-04-2024]
గిద్దలూరు నియోజకవర్గం అర్థవీడు మండల కేంద్రంలోని బాలుర గురుకుల మైదానంలో గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.కోటి నిధులతో మినీ ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను 2018లో చేపట్టింది. -
తెదేపా పాలనలోనే అభివృద్ధి
[ 27-04-2024]
తెదేపా పాలనలోనే అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా గిద్దలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి పేర్కొన్నారు.. ఆయన శుక్రవారం గిద్దలూరు నగర పంచాయతీలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. -
కన్నీరే మిగిల్చావ్.. జగన్
[ 27-04-2024]
బొప్పాయి పంట పండించి ఆదాయాన్ని సాధించాలన్న రైతుల కల కలగానే మిగిలింది. ఉద్యాన పంటలకు గత ప్రభుత్వం రాయితీలిచ్చి ప్రోత్సహించడంతో రైతులు ఈ పంట సాగుపై దృష్టి పెట్టారు. -
నిధులు నిలిపివేసి.. కేంద్రానివీ మింగేసి.. పురాల గొంతు నులిమిన పాలకుడు
[ 27-04-2024]
రోడ్ల విస్త‘రణం’..ఊసేలేని కాలువల నిర్మాణం..వీధి దీపాల ఏర్పాటులో నిర్లక్ష్యం..ఇక పత్తాయే లేని పారిశుద్ధ్యం ! జిల్లాలోని నగర, పుర సంస్థల్లో గత అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం ఒరగబెట్టిందిదే ! వసతులు కల్పించడం లేదు మొర్రో అని స్వయంగా వైకాపా వార్డు సభ్యులే గళమెత్తడం పాలకుల వైఫల్యాలకు అద్దం పడుతోంది. -
కక్ష కట్టి కడుపు కొడతారు
[ 27-04-2024]
2019 ఎన్నికల్లో వైకాపా ప్రభంజనం వీచినా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో (ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్నాయి) తెదేపా ఎమ్మెల్యేలే విజయం సాధించారు. -
తెదేపాకు మద్దతుగా ఉన్నారని నీళ్ల నిలిపివేత
[ 27-04-2024]
బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో వైకాపా నేతల దాష్టీకాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా రేపల్లె, నగరం మండలాల్లోని మూడు, నాలుగు గ్రామాల్లో దళిత కాలనీలకు తాగునీరు సరఫరా చేసే విషయంలో ఆ కాలనీల్లో ఉండే వైకాపా నాయకులు రాజకీయ కోణంలో ఆలోచించి వివక్ష చూపడంతో గుక్కెడు నీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. -
ఐ ప్యాక్ సర్వేలన్నీ బోగస్
[ 27-04-2024]
రాష్ట్రంలో వైకాపా పనైపోయిందని, ఐప్యాక్ సర్వేలన్నీ బోగస్ అని నరసరావుపేట కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.