logo

బాలికపై అత్యాచారయత్నం... పోక్సో కేసు నమోదు

సంతనూతలపాడు స్టేషన్‌లో బుధవారం పోక్సో కేసు నమోదైంది. ఎస్సై శ్రీకాంత్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

Published : 02 Feb 2023 03:37 IST

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: సంతనూతలపాడు స్టేషన్‌లో బుధవారం పోక్సో కేసు నమోదైంది. ఎస్సై శ్రీకాంత్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంతనూతలపాడుకు చెందిన పదకొండేళ్ల బాలిక ఓ పాఠశాలలో చదువుతోంది. ఈ నెల 30న అదే గ్రామానికి చెందిన దుంపా వెంకట ప్రసన్నరెడ్డి అనే యువకుడు... మీ ఇంట్లో వారు పిలుస్తున్నారంటూ పాఠశాలలో ఉన్న బాలికను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని గ్రామ శివారుకు తీసుకువెళ్లాడు. అక్కడ అత్యాచారానికి ప్రయత్నించగా... ఓ మహిళ చూసి కేకలు వేయడంతో, బాలికను తిరిగి పాఠశాలలో విడిచిపెట్టాడు. తరువాతి రోజు బాలిక పాఠశాలకు వెళ్లకుండా దిగాలుగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఆరా తీశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని