బటన్ నొక్కుడు ఇంకెప్పుడు!
నవరత్నాల అమలులో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు మూడో విడత ఆసరా అమలు చేసేందుకు డీఆర్డీఏ అధికారులు చేపట్టిన కసరత్తు పూర్తయింది.
అక్కా చెల్లెమ్మలకు ఇంకా అందని ఆసరా
మూడో విడత రుణ మాఫీకి ఎదురు చూపులు
ఒంగోలు మండలంలో సమావేశమైన స్వయం సహాయక సంఘం సభ్యులు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: నవరత్నాల అమలులో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు మూడో విడత ఆసరా అమలు చేసేందుకు డీఆర్డీఏ అధికారులు చేపట్టిన కసరత్తు పూర్తయింది. రుణ మాఫీ సాయం జమ చేసేందుకు బయోమెట్రిక్ నమోదు తప్పనిసరి అనే నిబంధన పెట్టారు. ఈ మేరకు డిసెంబరు నెలాఖరుకు జిల్లాలోని అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేశారు. మొదటి విడతగా అర్హులైన సంఘాల మహిళల ఖాతాలకు 2020 సెప్టెంబర్లో; రెండో విడత 2021 అక్టోబరులో రుణ మాఫీ నగదు జమ చేశారు. ఇక మూడో విడత ఈ ఏడాది జనవరిలో జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సంక్రాంతి పండగను పురస్కరించుకుని గత నెల మొదటి, రెండు వారాల్లో జమ చేస్తారని అంతా భావించినప్పటికీ.. ఫిబ్రవరి వచ్చినా ఆ ఊసే లేదు. దీంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి నిధులు జమ చేయడం కోసం సంఘాల మహిళలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
పారదర్శకం పేరుతో ప్రత్యేక యాప్...: ‘స్వయం సహాయక సంఘాల మహిళలు 2019 ఏప్రిల్ 11 నాటికి తీసుకుని బకాయి ఉన్న బ్యాంక్ లింకేజీ రుణాలను వైఎస్సార్ ఆసరా పథకం కింద నాలుగు విడతల్లో మాఫీ చేస్తాం..’ ఇదీ నవరత్నాల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన. అందులో భాగంగా గత రెండేళ్లుగా రెండు విడతల్లో కొంత జమ చేయగా.. తాజాగా మూడో విడత అమలుకు జిల్లా అధికార యంత్రాంగం తుది ప్రక్రియ పూర్తి చేసింది. మరింత పారదర్శకతలో భాగంగా ఈ ఏడాది లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలో కొన్ని మార్పులూ చేశారు. అందుకు ప్రత్యేకంగా యాప్ను అందుబాటులోకి తెచ్చారు.
5.80 లక్షల మంది సభ్యులు...: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అప్పట్లో 58,006 స్వయం సహాయక సంఘాలుండగా; వీటిలో 5.80 లక్షల మంది సభ్యులున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి బ్యాంక్ లింకేజీ ద్వారా రూ.1,804.34 కోట్ల రుణాలు తీసుకున్నట్టు గుర్తించారు. ఈ మొత్తాన్ని ఆసరా పథకంలో భాగంగా అందించే రుణ మాఫీ సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నాలుగు విడతల్లో జమ చేయాలని భావించారు. రెండో విడత కింత గత ఏడాది రూ.455.44 కోట్ల నగదును బ్యాంక్ ఖాతాలకు జమ చేశారు. తొలి విడత రుణ మాఫీ అమలులోనే సంఘాల వారీగా రుణ మొత్తం, మహిళల బ్యాంక్ పొదుపు ఖాతా వివరాలు సేకరించి జమ చేశారు. అప్పట్లో కొన్ని సంఘాలకు చెందిన లీడర్లు.. తక్కువ మొత్తంలోనే జమ అయిందంటూ మిగతా మహిళలకు నగదు తగ్గించి ఇచ్చారు. దీనిపై అప్పట్లో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సభ్యురాలి వాటా ప్రకారం వ్యక్తిగత పొదుపు ఖాతాలో జమ చేసేలా బ్యాంకర్లకు అవకాశం ఇచ్చారు. ఈ సారి కూడా వ్యక్తిగత ఖాతాలకు జమ చేసేలా ఆదేశాలందాయి. అయితే ఫిబ్రవరి వచ్చినా ఆ నగదు అందలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం