నేర వార్తలు
ఒంగోలు మండలం వలేటివారిపాలెం వద్ద 2016లో జరిగిన హత్య కేసుకు సంబంధించి నిందితుడికి జైలు శిక్ష విధించారు.
హత్య కేసులో జీవిత శిక్ష
ఒంగోలు గ్రామీణం: ఒంగోలు మండలం వలేటివారిపాలెం వద్ద 2016లో జరిగిన హత్య కేసుకు సంబంధించి నిందితుడికి జైలు శిక్ష విధించారు. పోలీసుల కథనం ప్రకారం.. గుండాయపాలేనికి చెందిన వలేటి వెంకటేశ్వరమ్మ(50) 2016లో రొయ్యల విక్రయ నిమిత్తం వలేటివారిపాలేనికి వచ్చి అక్కడి నుంచి ఒంగోలు వైపు వెళుతుండగా ఆమెపై దాడి జరిగింది. తన కూతురు, అల్లుడి మధ్య గొడవను ఆమె ప్రోత్సహిస్తోందన్న అనుమానంతో గొల్లపోతు కృష్ణ తన అక్క వెంకటేశ్వరమ్మను తాడుతో మెడకు బిగించి హత్య చేశాడు. దీనిపై అప్పట్లో తాలుకా సీఐ ఆంథోనిరాజ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి పత్రాలు సమర్పించారు. దీనిపై విచారణ చేపట్టిన 8వ ఏడీజే అమ్మన రాజా నిందితుడు గొల్లపోతు కృష్ణకు జీవిత కాలం జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందిని ఎస్పీ మలికాగర్గ్ అభినందించారు.
గిద్దలూరులోని మూడు ఇళ్లల్లో చోరీలు
రూ.3.2 లక్షల సొత్తు దొంగతనం
గిద్దలూరు పట్టణం, న్యూస్టుడే : గిద్దలూరు నగర పంచాయతీలో సోమవారం రాత్రి తాళంవేసి ఉన్న మూడు ఇళ్లల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. పోలీసుల కథనం మేరకు .. గిద్దలూరు నగర పంచాయతీ వివేకానంద కాలనీలో నివాసముండే పూజారి కె.శ్రీనివాసులు ఈ నెల 1న ఇంటికి తాళం వేసి హైదరాబాద్కు వెళ్లారు. మంగళవారం ఇంటికి వచ్చి చూడగా, ఇంటి తలుపు గడియ పగులగొట్టి ఉంది. బీరువాలోని 6 తులాల బంగారు నగలు, రూ.20 వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సొత్తు విలువు రూ. 3.2 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. పట్టణంలోని అంకాళ్లమ్మవీధిలో నివాసముండే శేగు మోహన్రావు ఇంటికి తాళం వేసి బెంగళూరుకు వెళ్లారు. సోమవారం రాత్రి ఆ ఇంట్లోకి ఆగంతకులు ప్రవేశించి బీరువా పగులగొట్టగా .. అందులో విలువైన వస్తువులు లేకపోవడంతో వెనుదిరిగారు. గిద్దలూరు - నంద్యాల రహదారిలోని మరో ఇంటి తాళం పగులగొట్టి దొంగతనానికి యత్నించారు. సదరు ఇంటి యజమాని వివరాలు తెలియరాలేదు. చోరీలు జరిగిన ఇళ్లను గిద్దలూరు సీఐ ఫిరోజ్, ఎస్ఐ బ్రహ్మనాయుడు, మార్కాపురం క్లూస్టీమ్ సిబ్బంది పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దుప్పి మాంసం స్వాధీనం
రాచర్ల, న్యూస్టుడే : చినగానిపల్లిలో దుప్పి మాంసాన్ని కలిగివున్న ముగ్గురు వ్యక్తులను ఆటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేశారు. డీఆర్వో మాధవరావు కథనం ప్రకారం .. చినగానిపల్లికి చెందిన ఏసెపోగు దినేష్కుమార్ తన పొలానికి విద్యుత్తు కంచె ఏర్పాటు చేయగా, తీగలు తగిలి చుక్కల దుప్పి చనిపోయింది. దుప్పి కళేబరాన్ని దినేష్కుమార్తో పాటు ఈర్నపాటి కుమార్, వై.ప్రదీప్కుమార్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దుప్పిని కోసి మాంసాన్ని గ్రామంలోకి తీసుకురాగా, సమాచారం అందుకున్న తురిమెళ్ల రేంజ్ అధికారిణి మధుప్రియాంక, ఇతర అధికారులు విచారించి స్వాధీనం చేసుకున్నారు. మాంసంతో పాటు తల, చర్మం, కొమ్ములు, కత్తులు స్వాధీనం చేసుకొని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు డీఆర్వో తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
[ 27-04-2024]
పేరుకే పోలీసులు. నిత్యం వైకాపాకు వంతపాడుతుంటారు. ఆ నాయకులతో అంటకాగుతుంటారు.. అధికార పార్టీ నేతల సేవలో తరిస్తూ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. -
30న నేతల ఆగమనం.. ఒకేరోజు జగన్, లోకేష్, బాలకృష్ణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల తేదీ సమీపించే కొద్ది ప్రధాన పార్టీల కీలక నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఇకపై ప్రచారం జోరందుకోనుంది. -
రూ. 4.92 కోట్ల ఖర్చు.. రూ.2.21 కోట్ల జప్తు
[ 27-04-2024]
ఎన్నిల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు జిల్లాలో రూ.2,21,90,514 విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఓటర్లను ప్రభావితం చేసేలా పంచేందుకు సిద్ధం చేసినట్లుగా అనుమానిత వస్తువులను సీజ్ చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. -
హెచ్చరిక.. కండువాలు మారిస్తే జరిమానా
[ 27-04-2024]
ప్రస్తుతం ఎవరు ఏ పార్టీనో ఇతమిత్థంగా చెప్పలేం. ఈ రోజు ఉదయం ఒక రాజకీయ పార్టీ కండువా కప్పుకొంటే.. సాయంత్రానికే మరో పార్టీ పిలిచిందంటూ అక్కడ ప్రత్యక్షమవుతుంటారు. -
246మంది అభ్యర్థులు415నామినేషన్లు48తిరస్కరణలు
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. -
18,22,470 మంది చేతుల్లో భవిత
[ 27-04-2024]
మే 13 నాటి సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల చేర్పులు, మార్పులు, తొలగింపుల సవరణల ప్రక్రియ పూర్తయింది. -
తాడేపల్లి జలగ.. రక్త మాంసాలు పీల్చ
[ 27-04-2024]
అధికారంలోకి వస్తానే జగన్ విడతల వారీగా మద్య నిషేధాన్ని గాలికొదిలేశారు. ఏకంగా ప్రభుత్వంతోనే మద్యం దుకాణాలు ఏర్పాటు చేయించారు. ఊరూరా మద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. -
పైసా విదిల్చింది లేదు
[ 27-04-2024]
గిద్దలూరు నియోజకవర్గం అర్థవీడు మండల కేంద్రంలోని బాలుర గురుకుల మైదానంలో గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.కోటి నిధులతో మినీ ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను 2018లో చేపట్టింది. -
తెదేపా పాలనలోనే అభివృద్ధి
[ 27-04-2024]
తెదేపా పాలనలోనే అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా గిద్దలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి పేర్కొన్నారు.. ఆయన శుక్రవారం గిద్దలూరు నగర పంచాయతీలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. -
కన్నీరే మిగిల్చావ్.. జగన్
[ 27-04-2024]
బొప్పాయి పంట పండించి ఆదాయాన్ని సాధించాలన్న రైతుల కల కలగానే మిగిలింది. ఉద్యాన పంటలకు గత ప్రభుత్వం రాయితీలిచ్చి ప్రోత్సహించడంతో రైతులు ఈ పంట సాగుపై దృష్టి పెట్టారు. -
నిధులు నిలిపివేసి.. కేంద్రానివీ మింగేసి.. పురాల గొంతు నులిమిన పాలకుడు
[ 27-04-2024]
రోడ్ల విస్త‘రణం’..ఊసేలేని కాలువల నిర్మాణం..వీధి దీపాల ఏర్పాటులో నిర్లక్ష్యం..ఇక పత్తాయే లేని పారిశుద్ధ్యం ! జిల్లాలోని నగర, పుర సంస్థల్లో గత అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం ఒరగబెట్టిందిదే ! వసతులు కల్పించడం లేదు మొర్రో అని స్వయంగా వైకాపా వార్డు సభ్యులే గళమెత్తడం పాలకుల వైఫల్యాలకు అద్దం పడుతోంది. -
కక్ష కట్టి కడుపు కొడతారు
[ 27-04-2024]
2019 ఎన్నికల్లో వైకాపా ప్రభంజనం వీచినా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో (ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్నాయి) తెదేపా ఎమ్మెల్యేలే విజయం సాధించారు. -
తెదేపాకు మద్దతుగా ఉన్నారని నీళ్ల నిలిపివేత
[ 27-04-2024]
బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో వైకాపా నేతల దాష్టీకాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా రేపల్లె, నగరం మండలాల్లోని మూడు, నాలుగు గ్రామాల్లో దళిత కాలనీలకు తాగునీరు సరఫరా చేసే విషయంలో ఆ కాలనీల్లో ఉండే వైకాపా నాయకులు రాజకీయ కోణంలో ఆలోచించి వివక్ష చూపడంతో గుక్కెడు నీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. -
ఐ ప్యాక్ సర్వేలన్నీ బోగస్
[ 27-04-2024]
రాష్ట్రంలో వైకాపా పనైపోయిందని, ఐప్యాక్ సర్వేలన్నీ బోగస్ అని నరసరావుపేట కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.