‘డబ్బులడిగితే ఎమ్మెల్యే బెదిరిస్తున్నారు’
‘రూ. 15 లక్షలు ఇస్తానని చెప్పి రూ. 2 కోట్ల విలువైన గ్రావెల్ను తవ్వి అమ్ముకున్నారు. ఆ తర్వాత ఇవ్వాల్సిన డబ్బులడిగితే ఆ ఎమ్మెల్యే బెదిరిస్తున్నారు.
మంత్రి నాగార్జునకు ఫిర్యాదు చేస్తున్న దళిత సంఘాల నాయకులు సుజన్ మాదిగ, వెంగళరావు తదితరులు
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: ‘రూ. 15 లక్షలు ఇస్తానని చెప్పి రూ. 2 కోట్ల విలువైన గ్రావెల్ను తవ్వి అమ్ముకున్నారు. ఆ తర్వాత ఇవ్వాల్సిన డబ్బులడిగితే ఆ ఎమ్మెల్యే బెదిరిస్తున్నారు. పోలీసులతో భయభ్రాంతులకు గురిచేయిస్తున్నారు..’ అని సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్.సుధాకర్బాబుపై దళిత సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాగార్జునను వెలగపూడిలోని సచివాలయంలో సోమవారం వారు కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. నిరుపేద దళితుడైన కావూరి దేవదాస్కు మద్దిపాడు మండలం బూరేపల్లి గ్రామ సర్వే నంబర్: 456లో 1992లో 2.98 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందన్నారు. అతని కుటుంబం ఆ భూమి పైనే ఆధారపడి జీవనం సాగిస్తోందన్నారు. సుధాకర్బాబు సంతనూతలపాడు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత బూరేపల్లి గ్రామ సర్పంచి శేషయ్య, మద్దిపాడుకు చెందిన అనిల్ అనే వ్యక్తులు దేవదాస్తో సంప్రదింపులు సాగించినట్టు చెప్పారు. భూమిలో గ్రావెల్ తవ్వుకునేందుకు అనుమతిస్తే ప్రతిఫలంగా ఎమ్మెల్యే రూ.15 లక్షలు ఇస్తామని చెప్పడంతో దేవదాస్ అంగీకరించారన్నారు. రెండెకరాల్లో సుమారు 20 అడుగుల లోతు తవ్వకాలు చేపట్టి రూ.రెండు కోట్ల విలువైన గ్రావెల్ అమ్ముకున్నట్టు తెలిపారు. అనంతరం దేవదాస్ ఎమ్మెల్యే సుధాకర్బాబు వద్దకు వెళ్లి ముందుగా చెప్పినట్టు రూ.15 లక్షలు ఇవ్వాలని కోరగా ఆయన కోపోద్రిక్తుడయ్యారన్నారు. ఎంత ధైర్యం ఉంటే తననే డబ్బులు అడుగుతావంటూ భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా అప్పటి మద్దిపాడు ఎస్సైను తరచూ ఇంటికి పంపి వేధింపులకు గురిచేసినట్టు మంత్రి నాగార్జునకు వివరించారు. దీనికి స్పందించిన మంత్రి నాగార్జున త్వరలో ఎమ్మెల్యే సుధాకర్బాబుతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చినట్టు మాదిగ సంక్షేమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము సుజన్ మాదిగ, దళిత సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు చప్పిడి వెంగళరావు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జండ్రాజుపల్లి ఆంజనేయులు తదితరులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిరుద్యోగులకు ‘జగనన్న ద్రోహం’
[ 07-05-2024]
ఏటా జాబ్ క్యాలెండర్..మెగా డీఎస్సీ..ఆపై ఏపీపీఎస్సీ..ఇంకా పోలీసు పోస్టులు..మీకిక ఉద్యోగాలే ఉద్యోగాలు. అయిదేళ్ల క్రితం జగన్ ఇలా తన వంచనాపూరిత హామీలతో జిల్లాను హోరెత్తించేశారు. -
‘భూ’చోళ్లు.. జగనన్నే వెన్నుదన్ను
[ 07-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో భూ మాఫియా రెచ్చిపోయింది. కొండలు, గుట్టలు, కాలువ గట్లు, జల వనరులు, అసైన్డ్, పశువుల పోరంబోకు, దేవుని మాన్యం, శ్మశాన భూములు ఆక్రమించారు. -
ఓటేయకుంటే... గొంతులూ తడపం
[ 07-05-2024]
గొంతులెండుతున్నాయి. గుక్కెడు మంచినీళ్లు ఇవ్వండని జనం వేడుకుంటుంటే.. ‘మీరు మా పార్టీ కాదు కదా’ అని ప్రశ్నిస్తూ అమానుషంగా ప్రవర్తిన్నారు వైకాపా నాయకులు. -
అంతర్జాతీయ రాగం.. బతుకులు ఆగమాగం..
[ 07-05-2024]
‘రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్య అందిస్తున్నాం. అందుకు విద్య, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నాం’ ఇవీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకొంటున్న మాటలు. -
కొనసాగుతున్న తపాలా.. ఇంటి వద్దే ఓటు
[ 07-05-2024]
జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఇతర శాఖల ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
అరాచక పాలనను అంతమొందిద్దాం
[ 07-05-2024]
రాష్ట్రంలో అరాచక పాలన అంతమొందించడానికి కాపులంతా జనసేన కూటమికి మద్దతుగా నిలవాలని టీబీకే రాష్ట్ర అధ్యక్షుడు దాసరి రాము కోరారు. -
అధికారం ఉన్నోడిదే భూమి!
[ 07-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పేదల ఆస్తులు, భూములకు రక్షణ లేకుండా పోయింది. రైతుల పట్టాదారు పాసుపుస్తకాలపై వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూరక్ష పథకం అనే పట్టాదారు పుస్తకాలు జారీచేసి దానిపైన సీఎం జగన్ మోహన్రెడ్డి పుస్తకాలను జారీచేశారు. -
తెదేపా హయాంలోనే సంక్షేమానికి పెద్దపీట
[ 07-05-2024]
వైకాపా పాలనలో కంటే తెదేపా హయాంలోనే సంక్షేమానికి బడ్జెట్లో ఎక్కువ ఖర్చుచేసినట్లు ఒంగోలు పార్లమెంటు తెదేపా అధ్యక్షులు నూకసాని బాలాజీ అన్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
[ 07-05-2024]
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో హత్య చేయించిన భార్యను, మరో ముగ్గురు నిందితులను గుంటూరులోని కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!
-
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..