logo

విగ్రహం తొలగింపుపై నిరసన

కందులాపురం కూడలిలో అంబేడ్కర్‌ విగ్రహం పక్కన ఏర్పాటు చేసిన జగ్జీవన్‌రాం విగ్రహాన్ని తొలగించడంపై ఎమ్మార్పీఎస్‌ నాయకుడు జయరాజ్‌ మంగళవారం కూడలిలోని సిగ్నల్‌ టవర్‌ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు.

Published : 07 Jun 2023 03:27 IST

టవర్‌పై ఉన్న ఎమ్మార్పీఎస్‌ నాయకులు

కంభం, న్యూస్‌టుడే : కందులాపురం కూడలిలో అంబేడ్కర్‌ విగ్రహం పక్కన ఏర్పాటు చేసిన జగ్జీవన్‌రాం విగ్రహాన్ని తొలగించడంపై ఎమ్మార్పీఎస్‌ నాయకుడు జయరాజ్‌ మంగళవారం కూడలిలోని సిగ్నల్‌ టవర్‌ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. తొలగించిన విగ్రహాన్ని వెంటనే అక్కడే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు ఎమ్మార్పీఎస్‌ నాయకులతో మాట్లాడారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పడంతో నిరసన విరమించి టవర్‌ పై నుంచి దిగివచ్చారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర నాయకులు పానుగంటి షాలెంరాజు, పీపుల్స్‌ యాక్షన్‌ ఫోరం అధ్యక్షుడు కొత్తపల్లి విజయ్‌, దాసరి యోబు, రమేష్‌, బూదాల ఆనంద్‌, మనోజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని