డీఎస్పీలొస్తుంటారు.. పోతుంటారు ఆ కంత్రీ కానిస్టేబుళ్లు లోకల్
పశ్చిమంలోని కీలకమైన పోలీస్ సబ్ డివిజన్ కేంద్రంలో ఇద్దరు కానిస్టేబుళ్లు దీర్ఘకాలికంగా విధులు నిర్వర్తిస్తున్నారు. అధికార పార్టీ నేతలపై ఎనలేని స్వామి భక్తి చాటుకుంటున్నారు. కార్యాలయంలోని కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి చేరవేస్తున్నారు.
‘పురం’లో పాతుకుపోయి విధులు
అధికార పార్టీ ముఖ్యనేతకు వేగులు
ప్రతిపక్షాల సమాచారం చేరవేతలు
న్యూస్టుడే, మార్కాపురం నేర విభాగం
పశ్చిమంలోని కీలకమైన పోలీస్ సబ్ డివిజన్ కేంద్రంలో ఇద్దరు కానిస్టేబుళ్లు దీర్ఘకాలికంగా విధులు నిర్వర్తిస్తున్నారు. అధికార పార్టీ నేతలపై ఎనలేని స్వామి భక్తి చాటుకుంటున్నారు. కార్యాలయంలోని కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి చేరవేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష నేతల ప్రచార అనుమతులతో పాటు ఇతర ముఖ్య విషయాలకు మోకాలడ్డుతున్నారు. సంబంధిత సమాచారాన్ని క్షణాల్లో వైకాపా నేతలకు చేరవేస్తున్నారు. ఓ కానిస్టేబుల్ హయాంలో ఇప్పటికి ఎనిమిది మంది డీఎస్పీలు మారి... తొమ్మిదో అధికారి వచ్చారు. అయినప్పటికీ అతన్ని కదిలించలేకపోయారు. ఉన్నతాధికారులను కూడా తప్పుదోవ పట్టిస్తూ అన్నీ తామై చక్రం తిప్పుతున్నారు.
అధికారి హోదాలో అజమాయిషీ...: సాధారణంగా ఓ కానిస్టేబుల్ డీవో పరిమిత కాలం మూడు నుంచి అయిదేళ్లు ఉంటుంది. ఏవైనా ఆరోపణలు వస్తే మధ్యలోనే బదిలీ చేస్తుంటారు. మార్కాపురం డీఎస్పీ కార్యాలయంలో పని చేసే ఓ కానిస్టేబుల్ మాత్రం ఇందుకు విరుద్ధం. ఎలాంటి డీవోలు, అటాచ్మెంట్లు లేకుండా కేవలం డీఎస్పీల ప్రాప్తంతో డూయింగ్ డ్యూటీ అంటూ ఏకంగా పదమూడేళ్లుగా పాతుకుపోయారు. 2010-15లో కంభం, 2015-20 త్రిపురాంతకం పూర్తి చేసుకుని నాలుగేళ్ల క్రితం పెద్దారవీడు పోలీస్ స్టేషన్కి ఆయన్ను కేటాయించారు. అయినప్పటికీ డీఎస్పీ కార్యాలయంలోనే డూయింగ్ డ్యూటీ పేరుతో కొనసాగుతున్నారు. పదమూడేళ్లుగా లా అండ్ ఆర్డర్ విధులకు దూరంగా ఉండి అధికారి హోదాలో విధులు వెలగబెడుతున్నారు. ఈ విషయం సొంత శాఖలో చర్చనీయాంశమైంది.
ఏడాదిన్నరగా సీసీ పోస్టు ఖాళీ...: సాధారణంగా డీఎస్పీ స్థాయి కార్యాలయాల్లో సీసీలు అన్ని కార్యక్రమాలు చూస్తుంటాంటారు. మార్కాపురంలో సంబంధిత కుర్చీ ఏడాదిన్నరగా ఖాళీగా ఉంది. ఇదే అదునుగా సదరు ‘లోకల్’ కానిస్టేబుల్ కీలక వ్యవహారాలను అనధికారికంగా తానే చక్కబెడుతున్నారు. కీలక అధికారి సెలవుపై వెళ్లినప్పుడు తానే షాడోగా మారతారనే విమర్శలున్నాయి. ఓ ఏఎస్సై కూడా అటాచ్మెంట్ మెమోపై డీఎస్పీ కార్యాలయంలోనే తొమ్మిదేళ్లుగా కొనసాగుతుండటం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ కేసులతో పాటు పలు తీవ్రమైన నేరాలకు సంబంధించిన వాటిపై ఈయన ఆసక్తి చూపుతుంటారు. వాటిల్లో తీవ్రతను బట్టి చేతివాటం ప్రదర్శిస్తుంటారనే ఆరోపణలున్నాయి.
రాజకీయాల్లోనూ తల దూరుస్తూ..: డీఎస్పీ కార్యాలయంలో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న కానిస్టేబుల్, ఏఎస్సైలకు వైకాపా నేతల అండదండలున్నాయి. దీంతో వారు స్వామిభక్తి చాటుకుంటున్నారు. కార్యాలయానికి వచ్చే రాజకీయ సభల అనుమతులకు సంబంధించిన దరఖాస్తులు, ఇతర ముఖ్య కేసుల పరిణామాలను ఎప్పటికప్పుడు అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నేతకు చేరవేస్తున్నారనే విమర్శలున్నాయి. ప్రతిపక్ష నాయకులు కార్యాలయానికి వచ్చే సమాచారం కూడా వెంటనే అధికార పక్ష నేతకు అందిస్తారని ఆరోపణలున్నాయి. వీరితో పాటు స్థానిక సర్కిల్ అధికారి వద్ద డ్రైవర్గా పని చేసే మరో కానిస్టేబుల్ తీరు కూడా వివాదాస్పదంగా మారింది. స్థానికుడు కావడంతో ఇక్కడి రాజకీయ వ్యవహారల్లో తల దూరుస్తున్నారంటూ ఆ శాఖలోనే పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న నేతల ఆగమనం.. ఒకేరోజు జగన్, లోకేష్, బాలకృష్ణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల తేదీ సమీపించే కొద్ది ప్రధాన పార్టీల కీలక నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఇకపై ప్రచారం జోరందుకోనుంది. -
రూ. 4.92 కోట్ల ఖర్చు.. రూ.2.21 కోట్ల జప్తు
[ 27-04-2024]
ఎన్నిల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు జిల్లాలో రూ.2,21,90,514 విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఓటర్లను ప్రభావితం చేసేలా పంచేందుకు సిద్ధం చేసినట్లుగా అనుమానిత వస్తువులను సీజ్ చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. -
హెచ్చరిక.. కండువాలు మారిస్తే జరిమానా
[ 27-04-2024]
ప్రస్తుతం ఎవరు ఏ పార్టీనో ఇతమిత్థంగా చెప్పలేం. ఈ రోజు ఉదయం ఒక రాజకీయ పార్టీ కండువా కప్పుకొంటే.. సాయంత్రానికే మరో పార్టీ పిలిచిందంటూ అక్కడ ప్రత్యక్షమవుతుంటారు. -
246మంది అభ్యర్థులు415నామినేషన్లు48తిరస్కరణలు
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. -
పేరుకే పోలీసులు..పుత్రరత్నం సేవలో బానిసలు
[ 27-04-2024]
పేరుకే పోలీసులు. నిత్యం వైకాపాకు వంతపాడుతుంటారు. ఆ నాయకులతో అంటకాగుతుంటారు.. అధికార పార్టీ నేతల సేవలో తరిస్తూ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. -
18,22,470 మంది చేతుల్లో భవిత
[ 27-04-2024]
మే 13 నాటి సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల చేర్పులు, మార్పులు, తొలగింపుల సవరణల ప్రక్రియ పూర్తయింది. -
తాడేపల్లి జలగ.. రక్త మాంసాలు పీల్చ
[ 27-04-2024]
అధికారంలోకి వస్తానే జగన్ విడతల వారీగా మద్య నిషేధాన్ని గాలికొదిలేశారు. ఏకంగా ప్రభుత్వంతోనే మద్యం దుకాణాలు ఏర్పాటు చేయించారు. ఊరూరా మద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. -
పైసా విదిల్చింది లేదు
[ 27-04-2024]
గిద్దలూరు నియోజకవర్గం అర్థవీడు మండల కేంద్రంలోని బాలుర గురుకుల మైదానంలో గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.కోటి నిధులతో మినీ ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను 2018లో చేపట్టింది. -
తెదేపా పాలనలోనే అభివృద్ధి
[ 27-04-2024]
తెదేపా పాలనలోనే అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా గిద్దలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి పేర్కొన్నారు.. ఆయన శుక్రవారం గిద్దలూరు నగర పంచాయతీలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. -
కన్నీరే మిగిల్చావ్.. జగన్
[ 27-04-2024]
బొప్పాయి పంట పండించి ఆదాయాన్ని సాధించాలన్న రైతుల కల కలగానే మిగిలింది. ఉద్యాన పంటలకు గత ప్రభుత్వం రాయితీలిచ్చి ప్రోత్సహించడంతో రైతులు ఈ పంట సాగుపై దృష్టి పెట్టారు. -
నిధులు నిలిపివేసి.. కేంద్రానివీ మింగేసి.. పురాల గొంతు నులిమిన పాలకుడు
[ 27-04-2024]
రోడ్ల విస్త‘రణం’..ఊసేలేని కాలువల నిర్మాణం..వీధి దీపాల ఏర్పాటులో నిర్లక్ష్యం..ఇక పత్తాయే లేని పారిశుద్ధ్యం ! జిల్లాలోని నగర, పుర సంస్థల్లో గత అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం ఒరగబెట్టిందిదే ! వసతులు కల్పించడం లేదు మొర్రో అని స్వయంగా వైకాపా వార్డు సభ్యులే గళమెత్తడం పాలకుల వైఫల్యాలకు అద్దం పడుతోంది. -
కక్ష కట్టి కడుపు కొడతారు
[ 27-04-2024]
2019 ఎన్నికల్లో వైకాపా ప్రభంజనం వీచినా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో (ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్నాయి) తెదేపా ఎమ్మెల్యేలే విజయం సాధించారు. -
తెదేపాకు మద్దతుగా ఉన్నారని నీళ్ల నిలిపివేత
[ 27-04-2024]
బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో వైకాపా నేతల దాష్టీకాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా రేపల్లె, నగరం మండలాల్లోని మూడు, నాలుగు గ్రామాల్లో దళిత కాలనీలకు తాగునీరు సరఫరా చేసే విషయంలో ఆ కాలనీల్లో ఉండే వైకాపా నాయకులు రాజకీయ కోణంలో ఆలోచించి వివక్ష చూపడంతో గుక్కెడు నీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. -
ఐ ప్యాక్ సర్వేలన్నీ బోగస్
[ 27-04-2024]
రాష్ట్రంలో వైకాపా పనైపోయిందని, ఐప్యాక్ సర్వేలన్నీ బోగస్ అని నరసరావుపేట కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.