రాహుల్.. సాధించి చూపెన్
దేశంలోనే అత్యున్నత సర్వీస్.. కఠిన పరీక్షగా చెప్పుకొనే సివిల్స్ సాధించడం అంటే అంత సులువేమీ కాదు. కొలువులందరికీ అంత తేలిగ్గా దక్కవు. లక్షల మందికి అదో చిరకాల స్వప్నం.. సాకారం కాని కలగానే మిగిలిపోతుంటుంది మరి.
సివిల్స్లో మెరిసిన మొగుళ్లూరు యువకుడు
కనిగిరి, న్యూస్టుడే
తల్లిదండ్రులు రత్నకుమార్, వయోలారాణి, సతీమణి ప్రియాంకలతో రాహుల్ కుమార్
దేశంలోనే అత్యున్నత సర్వీస్.. కఠిన పరీక్షగా చెప్పుకొనే సివిల్స్ సాధించడం అంటే అంత సులువేమీ కాదు. కొలువులందరికీ అంత తేలిగ్గా దక్కవు. లక్షల మందికి అదో చిరకాల స్వప్నం.. సాకారం కాని కలగానే మిగిలిపోతుంటుంది మరి. మెరికల్లాంటి అభ్యర్థుల నుంచి ఎదురయ్యే గట్టి పోటీని అంచెలంచెలుగా అధిగమించి ముందు వరుసలో నిలవడం అంటే అంత ఆషామాషీ కాదు. ఒత్తిడిని తట్టుకునే ఓర్పు ఉండాలి. విఫలమైనా తిరిగి సాధించాలనే బలమైన సంకల్పాన్ని ఒంటబట్టించుకోవాలి. అంతకుమించి అకుంఠిత దీక్ష, కఠోరశ్రమ అవసరం. ఈ లక్షణాలున్నందునే వెలిగండ్ల మండలం మొగుళ్లూరుకు చెందిన వంగేపురం రాహుల్ కుమార్ సివిల్స్ సాధించి చూపారు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో 504 ర్యాంకుతో మెరిశారు.
చిన్న నాటి నుంచే లక్ష్య నిర్దేశం...: రాహుల్ కుమార్ స్వగ్రామం వెలిగండ్ల మండలం మొగుళ్లూరు. తండ్రి వంగేపురం రత్నకుమార్ పశు సంవర్ధక శాఖలో తాత్కాలిక ఉద్యోగి. తల్లి వయోలారాణి కనిగిరి మున్సిపాలిటీ చింతలపాలెం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు. ఉద్యోగరీత్యా కనిగిరిలో నివాసం ఉంటున్నారు. రాహుల్ ఒకటో తరగతి నుంచి 3వ తరగతి వరకు కనిగిరి సెయింట్ జోసెఫ్ స్కూల్, 4వ తరగతి నుంచి 10 తరగతి వరకు కనిగిరి ప్రగతి విద్యానిలయం, ఇంటర్మీడియట్ నెల్లూరు నారాయణ కళాశాల, బీటెక్ కాకినాడ జేఎన్టీయూలో పూర్తిచేశారు. తల్లిదండ్రుల మాటలతో సివిల్స్ సాధించాలని చిన్ననాటి నుంచే లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.
అపజయాలే గెలుపు మెట్లు...
ఇంజినీరింగ్ విద్య పూర్తయిన తర్వాత రాహుల్ సివిల్స్ శిక్షణ కోసం దిల్లీ వెళ్లారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సన్నద్ధమయ్యారు. రోజుకు 7 నుంచి 9 గంటలపాటు చదివేవారు. మొదటి నాలుగు ప్రయత్నాల్లో అతన్ని పరాజయాలే పలకరించాయి. కొన్నిసార్లు ప్రిలిమ్స్లో, మరికొన్ని సార్లు ముఖాముఖి వరకు వెళ్లి వెనుదిరగాల్సి వచ్చింది. అయినప్పటికీ అతను నిరాశ పడలేదు. తానెక్కడ విఫలమవుతున్నదీ విశ్లేషించుకున్నారు. అపజయాలనే గెలుపు మెట్లుగా మలుచుకున్నారు. ఈ ఏడాది అయిదో ప్రయత్నంలో విజయం సాధించారు. సివిల్స్కు సిద్ధమవుతున్న తరుణంలోనే రాహుల్కు ప్రియాంక అనే యువతితో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. ఇన్నాళ్ల తన ప్రస్థానంలో తల్లిదండ్రుల పాత్ర ఎనలేనిదని.. భార్య అందించిన సహకారం కూడా ఎంతగానో ఉందంటారు. ఓటముల వేళ నిరాశ దరి చేరకుండా ఒత్తిళ్లను అధిగమించడానికి వారెంతగానో దిశానిర్దేశం చేసినట్లు చెబుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బానిస పోలీసులపై వేటు
[ 01-05-2024]
పోలీసు శాఖ నుంచి వేతనం తీసుకుంటున్న కానిస్టేబుల్ ఒకరు అధికార పార్టీకి చెందిన యువనేతకు ప్రైవేట్ వ్యక్తిగత అంగరక్షకుడిలా మారారు. మరొకరు ఏళ్ల తరబడి స్టేషన్ ముఖం చూడకుండానే వ్యక్తిగత సేవలో తరిస్తున్నారు. -
భరోసాల తెదేపా... ప్రలోభాల వైకాపా
[ 01-05-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారంతో ముగిసింది. గెలుపే ధ్యేయంగా నాయక గణం ప్రచారపర్వాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటాపోటీగా సభలు ఏర్పాటు చేస్తున్నారు. -
దుకాణాల మూత.. అక్రమంగా చేరవేత
[ 01-05-2024]
ఎన్నికల వేళ అధికార వైకాపా బరితెగించింది. ఓటర్లను మద్యం మత్తులో ముంచి లబ్ధి పొందే కుటిల యత్నాలకు తెర లేపింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో తాము నియమించిన సిబ్బందిని వినియోగించుకుని ఇప్పటికే పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున అక్రమంగా నిల్వ చేసింది. -
మీకంటే రౌడీషీటర్లు నయం
[ 01-05-2024]
‘ఎన్నికల ప్రక్రియలో మీరు ఘోరంగా విఫలమవుతున్నారు. నామినేషన్ల వేళే మీ సామర్థ్యం ఏంటో తెలిసింది. వంద మీటర్ల పరిధి దాటకుండా పార్టీల కార్యకర్తల్ని అడ్డుకోలేకపోయారు. మీతో పోల్చుకుంటే గ్రామాల్లో రౌడీషీటర్లే ప్రజలను నియంత్రిస్తున్నారు. -
ఉపాధి హరీ.. శ్రమజీవికి ఉరి
[ 01-05-2024]
శ్రమను పెట్టుబడిగా..స్వేదాన్ని ఇంధనంగా మార్చి పారిశ్రామిక వెలుగులు పూయించిన కార్మిక వర్గం నేడు చీకట్లో మగ్గుతోంది. తెదేపా హయాంలో మద్దిపాడు గ్రోత్ సెంటర్..గెలాక్సీపురిలో గ్రానైట్ యూనిట్లు..మార్కాపురంలో పలకల పరిశ్రమలు శ్రమజీవులతో కళకళలాడేవి. -
ప్రాజెక్టులు, పాత హామీల దాటవేత
[ 01-05-2024]
అసలే వెనుకబడిన ఎస్సీ నియోజకవర్గం..దానికితోడు గత అయిదేళ్లుగా ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని చేపట్టిందీ లేదు. ఈ నేపథ్యంలో మంగళవారం టంగుటూరులో ప్రచారానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్.. స్థానికుల సహనానికి పరీక్ష పెట్టారు. -
ప్రజల ఆస్తులు కొట్టేసేందుకు జగన్ పన్నాగాలు
[ 01-05-2024]
ఆంధ్ర రాష్ట్రాన్ని దుర్మార్గుల బారి నుంచి కాపాడుకునేందుకు సమర్థులకు మద్దతుగా నిలవాలని తెదేపా హిందూపురం ఎమ్మెల్యే, సినీ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కోరారు. మర్రిపూడిలో మంగళవారం నిర్వహించిన రోడ్డు షోలో ఆయన మాట్లాడారు. -
రాష్ట్రంలో ఒంగోలు నుంచే మార్పు మొదలు
[ 01-05-2024]
‘2019 ఎన్నికల్లో రాష్ట్రంలో వైకాపా గాలి వీచినా.. ఉమ్మడి ప్రకాశంలో తెదేపా నెగ్గింది. మీరంతా కలిసి పౌరుషాల గడ్డ ప్రకాశం నుంచి పార్టీకి నాలుగు స్థానాలిచ్చారు. ఒంగోలు మహానాడు విజయవంతం నుంచి యువగళం పాదయాత్ర వరకు అన్నింటా అండగా నిలిచారు. -
నిలువునా ఎండిన ఉద్యాన తోటలు
[ 01-05-2024]
చినుకు జాడ లేదు.. అడుగంటిన భూగర్భ జలం.. ఫలితంగా బోరు బావుల్లో నీళ్లు లేక ఉద్యాన తోటలు నిలువెల్లా ఎండిపోతున్నాయి. దీంతో రైతులు తీవ్ర నష్టాలు చవి చూస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడు మృతి
-
ప్రపంచకప్కి రింకూని విస్మరించడమా? ఇదో చెత్త సెలక్షన్!
-
పోలీసుల అదుపులో భారాస నేత క్రిశాంక్
-
మద్యం మత్తులో పైలట్.. విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ లైన్స్
-
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్
-
సల్మాన్ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన.. కస్టడీలో నిందితుడి ఆత్మహత్య