బానిస పోలీసులపై వేటు
పోలీసు శాఖ నుంచి వేతనం తీసుకుంటున్న కానిస్టేబుల్ ఒకరు అధికార పార్టీకి చెందిన యువనేతకు ప్రైవేట్ వ్యక్తిగత అంగరక్షకుడిలా మారారు. మరొకరు ఏళ్ల తరబడి స్టేషన్ ముఖం చూడకుండానే వ్యక్తిగత సేవలో తరిస్తున్నారు.
దొడ్లో నుంచి విధుల్లోకి కానిస్టేబుళ్లు
చర్యలపై పుత్రరత్నం హూంకరింపు
ఒంగోలు, న్యూస్టుడే
పోలీసు శాఖ నుంచి వేతనం తీసుకుంటున్న కానిస్టేబుల్ ఒకరు అధికార పార్టీకి చెందిన యువనేతకు ప్రైవేట్ వ్యక్తిగత అంగరక్షకుడిలా మారారు. మరొకరు ఏళ్ల తరబడి స్టేషన్ ముఖం చూడకుండానే వ్యక్తిగత సేవలో తరిస్తున్నారు. సదరు పుత్రరత్నానికి కారు డ్రైవర్గా వ్యవహరిస్తూ దొరికిపోయారు. పోలీసు శాఖలో ఆర్డర్లీ వ్యవస్థను రద్దు చేసినా ఆ మాజీ అమాత్యుడి దొడ్లో మాత్రం సదరు సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. అమాత్యగిరీ ఊడి రెండున్నరేళ్లు దాటినా జిల్లాలోని తన నివాసంతో పాటు విజయవాడలోని ఇంటిలోనూ హోంగార్డును వ్యక్తిగత సేవలకు వినియోగించుకుంటున్నారు. నిన్నటి వరకు ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగింది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత బయటపడింది. ఈ విషయాలను తెలుపుతూ ‘ఈనాడు’లో కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో అధికార యంత్రాంగం ఇప్పటికే ఒక కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు వేసింది. మరొకరి పైనా వేటుకు రంగం సిద్ధం చేసింది. ఒంగోలు, విజయవాడల్లోని మాజీ అమాత్యుని నివాసం ఆర్డర్లీ విధుల్లో ఉన్న హోంగార్డులను వెనక్కి పిలిపించింది.
యూనిఫాం ధరించేందుకు విముఖం...: జిల్లా పోలీసు కేంద్రం నుంచి ఆదేశాలు వెళ్లినా సదరు హోంగార్డులు తిరిగి విధుల్లోకి వచ్చేందుకు తొలుత ససేమిరా అన్నారు. మా తరపున పీఏ సారు మాట్లాడుతారంటూ మొండికేశారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి అర్డర్లీ విధుల్లోనే కొనసాగేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ సాధ్యం కాకపోవడంతో ఏళ్ల విరామం తర్వాత యూనిఫారం ధరించి విధులకు హాజరుకావాల్సి వచ్చింది. గత ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థికి అనుకూలంగా పోస్టల్ బ్యాలెట్ల సేకరణలో క్రియాశీలకంగా వ్యవహరించినట్లు ఓ హెడ్ కానిస్టేబుల్ బహిరంగంగా ప్రకటించారు. అయినా ఆయన్ను ఇటీవల వరకు స్పెషల్ బ్రాంచిలో అదీ ఒంగోలులోనే కొనసాగించారు. ఈ విషయం కూడా వెలుగులోకి రావటంతో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఆయన్ను దోర్నాల చెక్పోస్టు వద్ద విధులకు పంపారు. ఈ చర్యలపై అధికార పార్టీ నేతలు ఆగ్రహించినట్లు తెలిసింది. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హూంకరించినట్లు సమాచారం. తాము ఎన్నికల నియమావళి మేరకు మాత్రమే చర్యలు తీసుకున్నామని అధికారులు కూడా గట్టిగానే బదులిచ్చినట్లు తెలిసింది. మొత్తంగా ఈ వ్యవహారం ఇప్పుడు జిల్లా పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటుకు ఊపిరిలూదిన ఊళ్లు
[ 22-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లింది. తమ హక్కు వినియోగంలో ఓటర్లు ఎనలేని చైతన్యం చాటారు. ఫలితంగా రాష్ట్రంలోనే అత్యధికంగా 87.12 శాతం పోలింగ్ శాతం నమోదయ్యేలా చేశారు. -
స్పందన లేని గణం.. కుంగిపోతున్న జనం
[ 22-05-2024]
పశ్చిమ ప్రకాశంలో ఏళ్లు గడుస్తున్నా రెవెన్యూ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో బాధితులకు కుంగిపోతున్నారు. కాళ్లరిగేలా తిరుగుతున్నా స్పందించకపోవడంతో కొంతమంది ఆత్యాయత్యా యత్నాలకు పాల్పడుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. -
జిల్లాలో రక్తం లేదు
[ 22-05-2024]
రక్తం అవసరమైన బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసం నుంచి కొరత ఏర్పడింది. అత్యవసరమైన రోగులు, ప్రమాద బాధితులకు అవసరమైన గ్రూపు రక్తం సమకూర్చుకోవడం కష్టంగా మారింది. -
వేసవి చెరువులు ఖాళీ!
[ 22-05-2024]
ఒంగోలు నగరంలోని తాగునీటి సమస్య తీవ్రస్థాయికి చేరింది. చెరువుల్లో నీరు 30 శాతానికి పడిపోయింది. దీంతో మోటార్లకు అందటం లేదు.. వీధుల్లోని చివరి కుళాయిలకు సరఫరా కావడం లేదు. -
కార్యాలయంలో కీచకుడు
[ 22-05-2024]
మహిళా ఉద్యోగినులను లైంగికంగా వేధించడమే అతని పని. ఇప్పటికే కేసు నమోదైంది. ఉన్నతాధికారులు అతనిపై బదిలీ వేటు వేశారు. అయినా బుద్ధి మార్చుకోలేదు.. తీరు మారలేదు. -
ఫలితాల వేళ శాంతికి విఘాతం కలిగిస్తే చర్యలు
[ 22-05-2024]
ఎన్నికల ఫలితాల వేళ..శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ హెచ్చరించారు. -
ఆగని వైకాపా నేతల ఆగడాలు
[ 22-05-2024]
గిద్దలూరు నగర పంచాయతీ పాములపల్లె రహదారిలో మసీదు సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని వైకాపా నాయకులు ఆక్రమించేందుకు ప్రయత్నించారు. -
ఓట్ల లెక్కింపు ఏర్పాట్ల పరిశీలన
[ 22-05-2024]
జూన్ 4న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపునకు అవసరమైన ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. -
మాన్యం భూమిలో కబ్జా పర్వం
[ 22-05-2024]
ప్రభుత్వ భూములు, మాన్యం భూములకు రక్షణ లేకుండా పోయింది. ఒంగోలు ఆశ్రమం సమీపంలోని పేర్నమిట్ట రెవెన్యూ పరిధిలోని మాన్యం భూమి కబ్జాల పాలవుతోంది. -
వృద్ధురాలి హత్యకేసులో ఇద్దరి అరెస్ట్
[ 22-05-2024]
ఇటీవల జరిగిన వృద్ధురాలి హత్య కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి కథనం ప్రకారం.. కొత్తపట్నంలోని రెడ్డిపాలెం గ్రామానికి చెందిన గుడిపల్లి నాగేశ్వరమ్మ(75) కల్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గొంతుపై కాలుతో తొక్కి.. భార్య ప్రాణం తీసిన భర్త
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..