పంచాయతీలకు ‘దొంగ’ దెబ్బ
పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. స్వయంప్రతిపత్తి కలిగిన పాలనా యూనిట్లుగా గ్రామాలను ఎదగనిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని జాతి నిర్మాతలు ఆశించారు.
పల్లెల ఉసురు తీసిన జగన్ సర్కారు
తెలియకుండానే నిధులు, విధుల మళ్లింపు
అయిదేళ్లుగా లాగేసుకున్నది రూ.180 కోట్లు
విద్యుత్తు బకాయిలు చెల్లించాలని మళ్లీ ఒత్తిళ్లు
పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. స్వయంప్రతిపత్తి కలిగిన పాలనా యూనిట్లుగా గ్రామాలను ఎదగనిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని జాతి నిర్మాతలు ఆశించారు. వీటిని జగన్ ప్రభుత్వం తుంగలో తొక్కింది. సచివాలయాల పేరిట గ్రామపంచాయతీల ఊపిరి తీసే సొంత యంత్రాంగాన్ని సృష్టించింది. సచివాలయాలపై నియంత్రణాధికారాన్ని సర్పంచుల చేతుల్లోంచి దొడ్డి దారిన తీసేశారు. కొన్ని మేజర్ పంచాయతీలకు తప్ప మిగిలిన వాటికి సొంత ఆదాయ వనరులు చాలా తక్కువ. ప్రత్యేకంగా నిధులు కేటాయించి పల్లెల ప్రగతికి ప్రభుత్వాలే చేయూతనిస్తుంటాయి. జగన్ ప్రభుత్వం.. ఆ పని చేయడం లేదు. సరికదా పంచాయతీలకు వచ్చిన కేంద్ర ఆర్థిక సంఘం నిధులనూ సర్పంచులకు తెలియకుండానే దొంగతనంగా మళ్లించింది.
న్యూస్టుడే, ఒంగోలు గ్రామీణం
- ఆందోళనలు చేసినా ఉలుకేదీ..!: విద్యుత్తు బకాయిలకంటూ ఇప్పటికి జిల్లాలో రూ.180 కోట్లు కొట్టేశారు. తాగునీరు, పారిశుద్ధ్యం వంటి పనులకు కూడా పైసా లేని దుస్థితిలోకి స్థానిక సంస్థలను నెట్టేశారు. మురుగు కాల్వలు శుభ్రం చేయించడానికి సొమ్ముల్లేని పరిస్థితి కల్పించారు. తాగునీటి పైప్లైన్ల మరమ్మతులకు పైసల్లేవు. రహదారులకు చిన్నపాటి మరమ్మతులు చేయించడం మొదలు చెరువుల్లో చెత్త తొలగింపు వరకు అన్నిటికీ కాసుల కటకటనే మిగిల్చారు. వీధిదీపాలను వెలిగించడం నుంచి కార్మికులకు జీతాలివ్వడం వరకూ ప్రతిదీ సమస్యగా మార్చారు. నిధి వంచనపై సొంత పార్టీ సర్పంచులే ఆందోళన చేసినప్పటికీ పట్టించుకోలేదు. పల్లెల్లో ప్రగతి దీపాలను స్వహస్తాలతో కొండెక్కించారు.
- రూ. 38 కోట్ల పైనా కన్ను...: ఇంటి పన్ను రూపంలో వచ్చిన సాధారణ నిధులనూ గత ఏడాది వదల్లేదు. సార్వత్రిక ఎన్నికల ప్రకటన వచ్చాక కూడా తాజాగా విడుదలైన ఆర్థిక సంఘం నిధులను మరోసారి విద్యుత్తు బకాయిలకు చెల్లించాలంటూ పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి తెస్తున్నారు. 2022-23 సంవత్సరానికి సంబంధించి రెండో విడత 15 ఆర్థిక సంఘం నిధుల కింద గత నెలలో గ్రామ పంచాయతీ ఖాతాలకు సుమారు రూ.38 కోట్ల మేర నిధులు విడుదలయ్యాయి. పైగా ఏడాది తర్వాత కేటాయించారు. వీటి పైనా రాష్ట్ర ప్రభుత్వం కన్నేసింది. తాజాగా వచ్చిన నిధుల్లో 15 శాతం విద్యుత్తు బకాయిలకు జమ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే బకాయిలు జమ చేయాలంటూ మండల స్థాయిలో ఈవోఆర్డీ, గ్రామ కార్యదర్శులపై ఒత్తిడి తెస్తున్నారు
ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న సర్పంచులు(పాత చిత్రం)
జీతాలకే సాధారణ పన్నులు సరి...
టంగుటూరు మేజర్ పంచాయతీ జనాభా 22 వేలు. గత మూడేళ్లుగా ఆర్థిక సంఘం నిధుల కింద రూ.3 కోట్ల మేర నిధులు పంచాయతీ ఖాతాకు జమయ్యాయి. అందులో సర్పంచికి ఎలాంటి సమాచారం లేకుండానే రూ.2.75 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీల కింద లాగేసుకుంది. ఇంటి పన్నుల రూపంలో సాధారణ నిధులు రూ.80 లక్షల వరకు ఏటా వస్తాయి. ప్రస్తుతం పంచాయతీలో 70 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. సదరు నిధులు వారి జీతాల చెల్లింపునకే సరిపోతున్నాయి.
మద్దిరాల మమత, సర్పంచి, టంగుటూరు
నిధులు, అధికారాలు లాగేశారు...
పంచాయతీ ఖాతాలకు జమైన ఆర్థిక సంఘం నిధులను మాకు చెప్పకుండానే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి లాగేసుకోవడం దుర్మార్గం. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి పంచాయతీకి ఉన్న అధికారులు తీసేశారు. సచివాలయాలతో పాటు, గ్రామాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా, కేంద్రం ఇచ్చిన నిధులను విద్యుత్తు బకాయిల పేరుతో మళ్లించింది. పంచాయతీల్లో చిన్నపాటి పనులు చేసేందుకు కూడా పైసలు లేవు.
మండవ వెంకట సుబ్బయ్య, సర్పంచి, మండువవారిపాలెం, ఒంగోలు మండలం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బానిస పోలీసులపై వేటు
[ 01-05-2024]
పోలీసు శాఖ నుంచి వేతనం తీసుకుంటున్న కానిస్టేబుల్ ఒకరు అధికార పార్టీకి చెందిన యువనేతకు ప్రైవేట్ వ్యక్తిగత అంగరక్షకుడిలా మారారు. మరొకరు ఏళ్ల తరబడి స్టేషన్ ముఖం చూడకుండానే వ్యక్తిగత సేవలో తరిస్తున్నారు. -
భరోసాల తెదేపా... ప్రలోభాల వైకాపా
[ 01-05-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారంతో ముగిసింది. గెలుపే ధ్యేయంగా నాయక గణం ప్రచారపర్వాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటాపోటీగా సభలు ఏర్పాటు చేస్తున్నారు. -
దుకాణాల మూత.. అక్రమంగా చేరవేత
[ 01-05-2024]
ఎన్నికల వేళ అధికార వైకాపా బరితెగించింది. ఓటర్లను మద్యం మత్తులో ముంచి లబ్ధి పొందే కుటిల యత్నాలకు తెర లేపింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో తాము నియమించిన సిబ్బందిని వినియోగించుకుని ఇప్పటికే పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున అక్రమంగా నిల్వ చేసింది. -
మీకంటే రౌడీషీటర్లు నయం
[ 01-05-2024]
‘ఎన్నికల ప్రక్రియలో మీరు ఘోరంగా విఫలమవుతున్నారు. నామినేషన్ల వేళే మీ సామర్థ్యం ఏంటో తెలిసింది. వంద మీటర్ల పరిధి దాటకుండా పార్టీల కార్యకర్తల్ని అడ్డుకోలేకపోయారు. మీతో పోల్చుకుంటే గ్రామాల్లో రౌడీషీటర్లే ప్రజలను నియంత్రిస్తున్నారు. -
ఉపాధి హరీ.. శ్రమజీవికి ఉరి
[ 01-05-2024]
శ్రమను పెట్టుబడిగా..స్వేదాన్ని ఇంధనంగా మార్చి పారిశ్రామిక వెలుగులు పూయించిన కార్మిక వర్గం నేడు చీకట్లో మగ్గుతోంది. తెదేపా హయాంలో మద్దిపాడు గ్రోత్ సెంటర్..గెలాక్సీపురిలో గ్రానైట్ యూనిట్లు..మార్కాపురంలో పలకల పరిశ్రమలు శ్రమజీవులతో కళకళలాడేవి. -
ప్రాజెక్టులు, పాత హామీల దాటవేత
[ 01-05-2024]
అసలే వెనుకబడిన ఎస్సీ నియోజకవర్గం..దానికితోడు గత అయిదేళ్లుగా ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని చేపట్టిందీ లేదు. ఈ నేపథ్యంలో మంగళవారం టంగుటూరులో ప్రచారానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్.. స్థానికుల సహనానికి పరీక్ష పెట్టారు. -
ప్రజల ఆస్తులు కొట్టేసేందుకు జగన్ పన్నాగాలు
[ 01-05-2024]
ఆంధ్ర రాష్ట్రాన్ని దుర్మార్గుల బారి నుంచి కాపాడుకునేందుకు సమర్థులకు మద్దతుగా నిలవాలని తెదేపా హిందూపురం ఎమ్మెల్యే, సినీ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కోరారు. మర్రిపూడిలో మంగళవారం నిర్వహించిన రోడ్డు షోలో ఆయన మాట్లాడారు. -
రాష్ట్రంలో ఒంగోలు నుంచే మార్పు మొదలు
[ 01-05-2024]
‘2019 ఎన్నికల్లో రాష్ట్రంలో వైకాపా గాలి వీచినా.. ఉమ్మడి ప్రకాశంలో తెదేపా నెగ్గింది. మీరంతా కలిసి పౌరుషాల గడ్డ ప్రకాశం నుంచి పార్టీకి నాలుగు స్థానాలిచ్చారు. ఒంగోలు మహానాడు విజయవంతం నుంచి యువగళం పాదయాత్ర వరకు అన్నింటా అండగా నిలిచారు. -
నిలువునా ఎండిన ఉద్యాన తోటలు
[ 01-05-2024]
చినుకు జాడ లేదు.. అడుగంటిన భూగర్భ జలం.. ఫలితంగా బోరు బావుల్లో నీళ్లు లేక ఉద్యాన తోటలు నిలువెల్లా ఎండిపోతున్నాయి. దీంతో రైతులు తీవ్ర నష్టాలు చవి చూస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడు మృతి
-
ప్రపంచకప్కి రింకూని విస్మరించడమా? ఇదో చెత్త సెలక్షన్!
-
పోలీసుల అదుపులో భారాస నేత క్రిశాంక్
-
మద్యం మత్తులో పైలట్.. విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ లైన్స్
-
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్
-
సల్మాన్ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన.. కస్టడీలో నిందితుడి ఆత్మహత్య