జీవో 117 .. ప్రాథమిక విద్యపై పిడుగు
ప్రాథమిక విద్యపై కొత్త జీవో 117 తీవ్ర ప్రభావం చూపనుంది. విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తి, ఒకే మాధ]్యమం, ఇతర అంశాలు పరిశీలిస్తే జిల్లాలో భారీగా పోస్టులు మిగులు ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామాల్లో ఒకటి, రెండు తరగతులకు ఇక
న్యూస్టుడే, సోంపేట
* సోంపేట మండలం గొనకపాడు ఉన్నత పాఠశాలలో 440 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాత విధానం ప్రకారం ఇక్కడ 20 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. కొత్త జీవో మేరకు ఇక్కడ ఏడు పోస్టులు మిగులు చూపించాల్సి వస్తోంది.
* సోంపేట మండలం గొల్లగండి, బుషాభద్ర, గొల్లూరు, రామక్రిష్ణాపురం, రుషికుద్ద ప్రాథమికోన్నత పాఠశాలల్లో హేతుబద్ధీకరణ చర్యలతో స్కూలు అసిస్టెంట్ పోస్టులు ఉండవు. దీంతో ఆరు, ఏడు, ఎనిమిది తరగతులకు కూడా ఎస్జీటీలతోనే బోధన సాగించాల్సి ఉంటుంది. గణితం, సైన్సు అంశాల బోధనలో వీరు ఏమేరకు న్యాయం చేయగలుగుతారు.
* కవిటి మండలం బొరివంక ఉన్నత పాఠశాలలో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు నిర్వహిస్తున్నారు. కొత్త ఉత్తర్వుల మేరకు ఏదో ఒక మాధ్యమం మాత్రమే చదవాలి. 460 మందికి పైగా విద్యార్ధులుండగా 23 మంది ఉపాధ్యాయులున్నారు. ఎనిమిది పోస్టులు మిగులు చూపాలి. కర్రివానిపాలెం, ఇద్దివానిపాలెం, దూగానపుట్టుగ యూపీ స్కూళ్లకు చెందిన 80 నుంచి 90 మంది విద్యార్థులు ఇక్కడ చేరుతారు. కొత్తగా చేరే పిల్లలను పరిగణలోకి తీసుకోకుండా హేతుబద్ధీకరణ చేపడుతుండడంతో బోధన, ఇతర నిర్వహణల పరిస్థితి భారం కానుంది.
ప్రాథమిక విద్యపై కొత్త జీవో 117 తీవ్ర ప్రభావం చూపనుంది. విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తి, ఒకే మాధ]్యమం, ఇతర అంశాలు పరిశీలిస్తే జిల్లాలో భారీగా పోస్టులు మిగులు ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామాల్లో ఒకటి, రెండు తరగతులకు ఇక ఏకోపాధ్యాయ పాఠశాలలే మిగలనున్నాయి. ‘ప్రాథమిక’ ఉనికి ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి నెలకొనగా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఏదో ఒక మాధ్యమంతో సరిపెట్టుకోవాల్సి రావడంతో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చదువులపై తీవ్ర ప్రభావం
ప్రాథమిక పాఠశాలల పరంగా 30 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. దీంతో ఒక్కో మండలంలో 40 నుంచి 70 వరకు ఉపాధ్యాయుల మిగులు ఏర్పడనుంది. వీరిని కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఉన్నత పాఠశాలలకు సర్దుబాటు చేసినా ఇంకా మిగులే కన్పించే అవకాశముంది. ప్రాథమిక స్థాయిలో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమిస్తామన్న హామీకి దిక్కు లేకపోగా ప్రాథమికోన్నత తరగతులకూ సబ్జెక్టు టీచర్లనూ నియమించే పరిస్థితి లేకపోవడం దురదృష్టకరమని వారంటున్నారు.
తరగతికి ఒకరుండాలి
-నగరి శరత్బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పీఆర్టీయూ
ప్రాథమిక బడికి హేతుబద్దీకరణ సరికాదు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయులు ఉండకపోతే నాణ్యతగల చదువులెలా సాధ్యం. మార్పు మెరుగైన విద్య అందించేలా ఉండాలి. ఉన్నవాటిని తీసేయడం కాదు.
ప్రాథమిక విద్యావ్యవస్థ నాశనం
-లండ బాబూరావు, జిల్లా సహధ్యక్షుడు, యూటీఎఫ్
ఈ విధానంతో ప్రాథమిక విద్యావ్యవస్థ నాశనమవుతుంది. ఉపాధ్యాయులపై పనిభారం పెరుగుతుంది. కొత్తగా డీఎస్సీ వచ్చే అవకాశం లేక నిరుద్యోగులు పెరుగుతారు. గ్రామాల్లో పాఠశాలలు అందుబాటులో ఉంచాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కనికరం లేని మావయ్యా.. కనీస వసతులేవయ్యా..!
[ 26-04-2024]
అంగన్వాడీ కేంద్రాలు.. పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసే ఆలయాలు. అలాంటి వాటిని అభివృద్ధి చేయకుండా వైకాపా నేతలు ఐదేళ్లపాటు గాలికొదిలేశారు. కార్పొరేట్ ప్రీ స్కూళ్లకు దీటుగా తయారుచేస్తామని జగన్ చెప్పిన మాటలు ప్రసంగాలకే పరిమితమయ్యాయి. -
ఎండప్రచండం
[ 26-04-2024]
జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రంగా ఉంటోంది. అత్యవసర సమయంలో తప్ప మిగిలిన వేళల్లో బయటకు వచ్చేందుకు జనాలు సాహసించడం లేదు. -
శెభాష్.. సతీష్..
[ 26-04-2024]
జేఈఈ మెయిన్-2024 (సెషన్-2) ఫలితాల్లో సిక్కోలు విద్యార్థి సత్తా చాటాడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసిన ఫలితాల్లో జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన చింతు సతీష్కుమార్ అదరగొట్టాడు. -
నామినేషన్ల ఘట్టానికి తెర
[ 26-04-2024]
జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 175 మంది అభ్యర్థులు 223 నామినేషన్లు వేశారు. వాటిల్లో రెండుసార్లు వచ్చిన వాటిని తీసివేయగా 123 మంది అభ్యర్థులు మిగిలారు. -
వైకాపా స్థావరాలపై పసుపు జెండా..!
[ 26-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టెక్కలి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన మరుసటి రోజే ఆయువుపట్టు లాంటి వైకాపా స్థావరాల్లో పసుపు జెండా ఎగురవేశారు. -
జేఈఈలో సిక్కోలు సత్తా..
[ 26-04-2024]
జాతీయస్థాయిలో ఐఐటీ, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. -
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవరు మృతి
[ 26-04-2024]
జాతీయ రహదారిపై ఎచ్చెర్ల గ్రామం వద్ద ఫ్లైఓవర్ వంతెనపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన మజ్జి అచ్చెప్పడు (38) అనే ఆటో డ్రైవర్ మృతిచెందాడు. -
27న పాలిసెట్-2024
[ 26-04-2024]
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఏపీ పాలిసెట్-2024 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
గొంతు తడవాలంటే.. సొమ్ము పెట్టాల్సిందే
[ 26-04-2024]
ప్రతి ఇంటికి తాగునీరు అత్యవసరం. తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన మౌలిక సౌకర్యం. అది కల్పించకుండా అంత చేశాం.. ఇంత చేశామని పాలకులు ఊదరగొడితే సమస్యలు పరిష్కారమైపోవు. పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. -
మలుపులు.. మృత్యులోగిళ్లు
[ 26-04-2024]
పలు గ్రామాల్లోని మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. ఆయా ఘటనల్లో మృతులు, గాయాల పాలైన వారూ ఉన్నారు. -
దారికి రాని విస్తరణ
[ 26-04-2024]
నిత్యం అత్యంత రద్దీగా ఉండే కళింగపట్నం- పార్వతీపురం రహదారిని శ్రీకాకుళం నగరంలో విస్తరణ పనులు చేపడతామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు