logo

కుక్కల దాడిలో చుక్కలదుప్పి మృతి

పాతపట్నం మండలం సూర్యనారాయణపురంలో వీధి కుక్కల దాడిలో గురువారం ఉదయం ఓ చుక్కల దుప్పి మృతిచెందగా, మరొకటి గాయపడింది.

Published : 02 Dec 2022 03:07 IST

చుక్కల దుప్పికి వైద్య సేవలందిస్తున్నఅటవీశాఖ సిబ్బంది, స్థానిక యువకులు

పాతపట్నం, న్యూస్‌టుడే: పాతపట్నం మండలం సూర్యనారాయణపురంలో వీధి కుక్కల దాడిలో గురువారం ఉదయం ఓ చుక్కల దుప్పి మృతిచెందగా, మరొకటి గాయపడింది. అటవీశాఖ ఎఫ్‌.ఎస్‌.ఒ. యశస్వి తెలిపిన వివరాల ప్రకారం.. అంతరాబ అటవీ ప్రాంతం నుంచి రెండు దుప్పిలు గురువారం వేకువ జామున సూర్యనారాయణపురం గ్రామానికి వచ్చాయి. వీధి కుక్కల దాడిలో ఒకటి మృతిచెందగా గాయపడిన మరొకదాన్ని స్థానికులు గుర్తించి వాటి బారి నుంచి సంరక్షించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఎఫ్‌.బి.ఒ. లక్ష్మీనారాయణ అక్కడికి వచ్చి గాయపడిన దానికి వైద్య సేవలందించి, స్థానిక యువత సహకారంతో అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. మృతిచెందిన దానికి పోస్టుమార్టం నిర్వహించి, దహనపరిచినట్లు ఆయన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని