logo

పీహెచ్‌సీలకు కేంద్ర బృందాల రాక!

జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిశీలనకు కేంద్ర బృందాలు వస్తున్నాయని.. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్‌ బొడ్డేపల్లి మీనాక్షి అన్నారు.

Published : 03 Feb 2023 03:05 IST

అక్కులపేట పీహెచ్‌సీలో దస్త్రాలు పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో మీనాక్షి

ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిశీలనకు కేంద్ర బృందాలు వస్తున్నాయని.. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్‌ బొడ్డేపల్లి మీనాక్షి అన్నారు. ఆమదాలవలస మండలం అక్కులపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ రికార్డులు సక్రమంగా ఉంచాలని సూచించారు. ఆరోగ్య కేంద్ర పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. గతంలో ఈ కేంద్రానికి జిల్లా, రాష్ట్ర స్థాయి పురస్కారాలు వచ్చాయని, మరోసారి వచ్చేలా కృషి చేయాలని కోరారు. ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న సమస్యలను అధికారులు ఆమె దృష్టికి తీసుకెళ్లగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆమె వెంట సీసీ నారాయణరావు, వైద్యాధికారులు మీనాకుమారి, వసంత తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని