కొడైక్కానల్లో వేసవి పుష్ప ప్రదర్శన
కొడైక్కానల్లో ఏటా వేసవి ఉత్సవాల పేరిట పుష్ప ప్రదర్శన నిర్వహిస్తుంటారు. గత రెండేళ్లు కరోనా వ్యాప్తి కారణంగా జరుపలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడు ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో మంగళవారం పుష్ప ప్రదర్శనను మంత్రులు ఇ.పెరియస్వామి, ఎమ్మార్కే పన్నీర్సెల్వం, మదివేందన్, చక్రపాణి హాజరై ప్రారంభించారు
ప్రారంభించిన మంత్రులు
ప్రదర్శనను ప్రారంభిస్తున్న మంత్రులు
విల్లివాక్కం, న్యూస్టుడే: కొడైక్కానల్లో ఏటా వేసవి ఉత్సవాల పేరిట పుష్ప ప్రదర్శన నిర్వహిస్తుంటారు. గత రెండేళ్లు కరోనా వ్యాప్తి కారణంగా జరుపలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడు ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో మంగళవారం పుష్ప ప్రదర్శనను మంత్రులు ఇ.పెరియస్వామి, ఎమ్మార్కే పన్నీర్సెల్వం, మదివేందన్, చక్రపాణి హాజరై ప్రారంభించారు. ప్రదర్శనలో భాగంగా బ్రైంట్ పార్కులో పర్యాటకులను ఆకర్షించేలా పుష్పాలతో రూపొందించిన నెమలి, డైనోసర్, భౌగోళిక గుర్తింపు పొందిన తెల్ల వెల్లుల్లి వంటి వాటిని కొలువు దీర్చారు. వేసవి ఉత్సవాలను తిలకించడానికి రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు కొడైక్కానల్కి చేరుకుంటున్నారు. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యాటకులను ఆహ్లాదపరిచేలా పలు పోటీలు నిర్వహిస్తున్నారు. తమిళనాడు క్రీడాభివృద్ధి అథారిటీ (ఎస్డీఏటీ) తరఫున బ్రైంట్ పార్కులో మ్యూజికల్ చైర్ పోటీలు నిర్వహించారు. బుధవారం ఉదయం తాడు లాగుడు పోటీలు నిర్వహిస్తారు. 26న స్లో సైక్లింగ్, శాకింగ్ రేస్ 27న ముంజిక్కల్ క్రీడా మైదానంలో పురుషులు, మహిళలకు వాలీబాల్ పోటీలు, 28న హాకీ పోటీలు, 29న కబడ్డీ, 30, 31న ఫుట్బాల్ పోటీలు నిర్వహిస్తారు. జూన్ 1న బ్రైంట్ పార్కులో పురుషులు, మహిళలకు మినీ మారథాన్ పోటీలు నిర్వహిస్తారు. ప్రతి పోటీలో విజేతలైన వారికి బహుమతులు పంపిణీ చేస్తారు. వీటితో పాటు పడవ అలంకార పోటీలు, బాతులు పట్టే పోటీలు, శునక ప్రదర్శనతో పాటు పలు పోటీలు నిర్వహించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..