logo

ప్రజలను మోసగిస్తున్న ప్రభుత్వం: ఎడప్పాడి

ప్రజలను మోసం చేసేలా ప్రభుత్వ తీరు ఉందని అన్నాడీఎంకే తాత్కాలిక కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ధ్వజమెత్తారు. విరుదునగర్‌ జిల్లా శివకాశి అన్నాడీఎంకే తరఫున గురువారం ఉదయం నిరసన సభ నిర్వహించారు. జిల్లా కార్యదర్శి,

Published : 30 Sep 2022 02:08 IST

సభలో మాట్లాడుతున్న పళనిస్వామి

వేలచ్చేరి, న్యూస్‌టుడే: ప్రజలను మోసం చేసేలా ప్రభుత్వ తీరు ఉందని అన్నాడీఎంకే తాత్కాలిక కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ధ్వజమెత్తారు. విరుదునగర్‌ జిల్లా శివకాశి అన్నాడీఎంకే తరఫున గురువారం ఉదయం నిరసన సభ నిర్వహించారు. జిల్లా కార్యదర్శి, మాజీ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం సీఎం ద్రావిడ మాడల్‌ ప్రభుత్వమని చెబుతున్నారని, అసలు ఏం చేశారని పేర్కొన్నారు. తాము ప్రవేశపెట్టిన పలు ప్రజోపయోగ పథకాలను ప్రభుత్వం రద్దు చేసిందని ధ్వజమెత్తారు. హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం ప్రజలను మోసగిస్తోందని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని