పెట్రోల్ బాంబు దాడులు చేస్తామని బెదిరింపు
పొళ్లాచ్చిలో 16 చోట్ల పెట్రోల్ బాంబులతో దాడిచేస్తారని పోలీస్స్టేషన్కి గుర్తు తెలియని వ్యక్తులు ఉత్తరం రాయడంతో కలకలం ఏర్పడింది. కోయంబత్తూరు జిల్లా పొళ్లాచ్చి కుమరన్నగర్ ప్రాంతంలో హిందూ మున్నని, భాజపా నిర్వాహకుల ఇంటి ముందు ఆపిన కారు మొదలైన
కోయంబత్తూరు, న్యూస్టుడే: పొళ్లాచ్చిలో 16 చోట్ల పెట్రోల్ బాంబులతో దాడిచేస్తారని పోలీస్స్టేషన్కి గుర్తు తెలియని వ్యక్తులు ఉత్తరం రాయడంతో కలకలం ఏర్పడింది. కోయంబత్తూరు జిల్లా పొళ్లాచ్చి కుమరన్నగర్ ప్రాంతంలో హిందూ మున్నని, భాజపా నిర్వాహకుల ఇంటి ముందు ఆపిన కారు మొదలైన వాహనాలను ద్వంసం చేసి నిప్పంటించడానికి యత్నించారు. ఈ ఘటనలకు పాల్పడిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఎస్డీపీఐకి చెందిన ఆరుగురిని వెస్ట్ పోలీస్స్టేషన్ సిబ్బంది అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో వెస్ట్ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్కు గుర్తు తెలియని వ్యక్తులు ఉత్తరం పంపారు. లేఖలో పొళ్లాచ్చిలో 16 చోట్ల పెట్రోల్ బాంబు దాడి జరుగుతుందని, పోలీసులు తమకి శత్రువులు కాదని, శాంతి భద్రతలకు సమస్య కలిగించాలని ఎస్డీపీఐ, పీఎఫ్ఐ అని ఉత్తరంలో రాశారు. ఉత్తరం పంపిన వారికోసం పోలీసులు విచారిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.