logo

పెట్రోల్‌ బాంబు దాడులు చేస్తామని బెదిరింపు

పొళ్లాచ్చిలో 16 చోట్ల పెట్రోల్‌ బాంబులతో దాడిచేస్తారని పోలీస్‌స్టేషన్‌కి గుర్తు తెలియని వ్యక్తులు ఉత్తరం రాయడంతో కలకలం ఏర్పడింది. కోయంబత్తూరు జిల్లా పొళ్లాచ్చి కుమరన్‌నగర్‌ ప్రాంతంలో హిందూ మున్నని, భాజపా నిర్వాహకుల ఇంటి ముందు ఆపిన కారు మొదలైన

Published : 30 Sep 2022 02:08 IST

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: పొళ్లాచ్చిలో 16 చోట్ల పెట్రోల్‌ బాంబులతో దాడిచేస్తారని పోలీస్‌స్టేషన్‌కి గుర్తు తెలియని వ్యక్తులు ఉత్తరం రాయడంతో కలకలం ఏర్పడింది. కోయంబత్తూరు జిల్లా పొళ్లాచ్చి కుమరన్‌నగర్‌ ప్రాంతంలో హిందూ మున్నని, భాజపా నిర్వాహకుల ఇంటి ముందు ఆపిన కారు మొదలైన వాహనాలను ద్వంసం చేసి నిప్పంటించడానికి యత్నించారు. ఈ ఘటనలకు పాల్పడిన పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా, ఎస్‌డీపీఐకి చెందిన ఆరుగురిని వెస్ట్‌ పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో వెస్ట్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌కు గుర్తు తెలియని వ్యక్తులు ఉత్తరం పంపారు. లేఖలో పొళ్లాచ్చిలో 16 చోట్ల పెట్రోల్‌ బాంబు దాడి జరుగుతుందని, పోలీసులు తమకి శత్రువులు కాదని, శాంతి భద్రతలకు సమస్య కలిగించాలని ఎస్‌డీపీఐ, పీఎఫ్‌ఐ అని ఉత్తరంలో రాశారు. ఉత్తరం పంపిన వారికోసం పోలీసులు విచారిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని