logo

తిరుమాతో కృష్ణారావు భేటీ

ద్రావిడ దేశం వ్యవస్థాపక అధ్యక్షులు వి.కృష్ణారావు విడుదలై సిరుత్తైగల్‌ కట్చి (వీసీకే) అధినేత తిరుమావళవన్‌ను గురువారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. గత నాలుగు దశాబ్దాలుగా ద్రావిడ దేశం నిర్వహిస్తున్న సేవలను వివరించారు.

Published : 01 Oct 2022 01:04 IST


కృష్ణారావును సత్కరిస్తున్న తిరుమావళవన్‌

చెన్నై (సాంస్కృతికం), న్యూస్‌టుడే: ద్రావిడ దేశం వ్యవస్థాపక అధ్యక్షులు వి.కృష్ణారావు విడుదలై సిరుత్తైగల్‌ కట్చి (వీసీకే) అధినేత తిరుమావళవన్‌ను గురువారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. గత నాలుగు దశాబ్దాలుగా ద్రావిడ దేశం నిర్వహిస్తున్న సేవలను వివరించారు. ఈ సందర్భంగా తిరుమావళవన్‌ కృష్ణారావును శాలువాతో సత్కరించి తాము కూడా ద్రావిడ దేశం చేపట్టే కార్యక్రమాలకు చేయూతనిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎంకే శాసనసభ్యులు కలైసెల్వన్‌, సీపీఐ కార్యదర్శి ముత్తరసన్‌, సీపీఎం కార్యదర్శి బాలకృష్ణన్‌లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని