మంత్రులకు నోటి దురుసు ఎక్కువ
మహిళలు ఓసీ ప్రయాణం చేస్తున్నారని మంత్రి ఒకరు వ్యాఖ్యానించారని, రాష్ట్ర అమాత్యులకు నోటి దురుసు ఎక్కువని అన్నాడీఎంకే సీనియర్ నేత సెల్లూర్ రాజు ఆరోపించారు.
అన్నాడీఎంకే నేత సెల్లూర్ రాజు ఆరోపణ
ఆర్కేనగర్, న్యూస్టుడే: మహిళలు ఓసీ ప్రయాణం చేస్తున్నారని మంత్రి ఒకరు వ్యాఖ్యానించారని, రాష్ట్ర అమాత్యులకు నోటి దురుసు ఎక్కువని అన్నాడీఎంకే సీనియర్ నేత సెల్లూర్ రాజు ఆరోపించారు. మదురైలో స్వచ్ఛంద సంస్థ తరఫున ఉచిత వైద్య శిబిరం ఆదివారం జరిగింది. దీనిని ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..... పండుగ సమయంలో ఆమ్ని బస్సు ఛార్జీలు పెంచారన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి స్టాలిన్ దృష్టి సారించి చర్యలు తీసుకోవాలన్నారు. దీపావళి రానున్న సమయంలో పలురెట్లు పెంచడం న్యాయం కాదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గించాలని చెప్పారు. ప్రభుత్వం ప్రత్యేక బస్సులు ఎక్కువగా నడపాలని తెలిపారు. మంత్రులందరూ ప్రజల సొమ్ముతో దర్జాగా జీవిస్తున్నారని తెలిపారు. మహిళలను చూసి ఓసీ ప్రయాణం అని ఓ మంత్రి అన్నారన్నారు. మంత్రులకు నోటి దురుసు ఎక్కువని ఆరోపించారు. ఉచిత బస్సు ప్రయాణం అనే బదులు మహిళలకు ఛార్జీల్లేని బస్సులుగా వాటి పేర్లు మార్చాలని తెలిపారు. ప్రస్తుతం రేషన్బియ్యం అక్రమరవాణా పలురెట్లు పెరిగిందన్నారు. చర్యలు తీసుకోవాల్సిన ఐఎఏస్ అధికారుల చేతులు కట్టేశారన్నారు. మదురై మేయర్ స్వేచ్ఛగా పనిచేయడం లేదని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.