గ్రామీణ అంకురాలకు నాంది
దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు. అలాంటి గ్రామీణ వ్యవస్థ బలపడేందుకు ఐఐటీ మద్రాస్ కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టింది. అక్కడే స్టార్టప్లు స్థాపించేలా, ఆ స్థాయికి యువతను నడపించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ క్రతువును తమిళనాడు నుంచే చేపట్టింది.
రాష్ట్రంలో మొదలుపెట్టిన ఐఐటీఎం
2030 నాటికి వేయి స్టార్టప్లే లక్ష్యం
ఐఐటీ మద్రాస్ ఇంకుబెటర్ భవనం
దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు. అలాంటి గ్రామీణ వ్యవస్థ బలపడేందుకు ఐఐటీ మద్రాస్ కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టింది. అక్కడే స్టార్టప్లు స్థాపించేలా, ఆ స్థాయికి యువతను నడపించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ క్రతువును తమిళనాడు నుంచే చేపట్టింది.
ఈనాడు, చెన్నైఇప్పుడు ఎక్కడ విన్నా నగరీకరణ, పట్టణీకరణ గురించే. ఉద్యోగాలు, సంపాదన లేకనో గ్రామాల్ని వదిలిపెట్టేవారి సంఖ్య పెరుగుతోంది. గ్రామీణ వ్యవస్థ నిర్వీర్యం అయ్యే పరిస్థితులు పలు రాష్ట్రాల్లో ఉన్నాయి. దీని నుంచి దేశం బయటపడేలా, గ్రామీణ వ్యవస్థల్ని బలోపేతం చేసేలా ఐఐటీఎంలోని ఇంకుబేషన్ సెల్ ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. గ్రామాల్లో సవాళ్లను గుర్తించి వాటి పరిష్కారాల దిశగా అవసరమైన స్టార్టప్లను నెలకొల్పేందుకు యువతను సిద్ధం చేసేలా నడుంబిగించింది. మండల, నియోజకర్గ, జిల్లా కేంద్రం స్థాయుల్లో యువతలోని ప్రతిభను వెలికితీయడంతోపాటు పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులుగా వారు ఎదిగేందుకు వినూత్న ప్రాజెక్టును రూపొందించింది. ఇందుకు అవసరమైన సాంకేతిక, జ్ఞానసంపద, ప్రత్యేక శిక్షణ అందించనుంది.
తొలి విడతలో కీలకరంగాలు
కొన్ని రంగాల స్టార్టప్ల జాబితాను ఐఐటీ మద్రాస్ ఇంకుబేషన్ సెల్ తయారుచేసింది. తొలివిడతగా వాటిని స్థానికంగానే ఏర్పాటు చేయించనుంది. వ్యవసాయాధారిత అగ్రిటెక్, వ్యాపార మెలకువల్లో రిటైల్, అలాగే ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పర్యావరణం, సామాజిక, పరిపాలన నేపథ్యంలో సమస్యల్ని పరిష్కరించే స్టార్టప్లకు పెద్దపీట వేస్తోంది. ఈ తరహా స్టార్టప్లను 2030లోపు కనీసం వెయ్యి ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి నేటివ్ లీడ్ ఫౌండేషన్తో చేతులు కలిపింది. ఈ స్వచ్ఛంద సంస్థ తమిళనాడులో ఇప్పటికే యువతలో మార్పు తెచ్చేపనిలో ఉంది. వీరిద్వారా యువతకు శిక్షణ ఇప్పించేలా ఒప్పందం కుదుర్చుకుంది.
వారి కోసం వారే..
‘దేశానికి ఇప్పటికీ గ్రామాలే వెన్నెముక. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామ వ్యవస్థలు మరింత అవసరం. వ్యవసాయ ప్రధాన దేశంలో ఆ రంగం క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో దాన్ని రక్షించాలి. గ్రామాలకు ఉపయోగపడే ప్రాథమికాంశాల్లో వ్యవస్థలు బలపడేలా స్టార్టప్లు తేవాలని నిర్ణయించాం’ అని ఐఐటీ మద్రాస్ ఇంకుబేషన్ సెల్ అధ్యక్షులు ప్రొఫెసర్ అశోక్ జున్జున్వాలా తెలిపారు. అక్కడి సమస్యలకు స్టార్టప్ల ద్వారా పరిష్కారాల్ని చూపే ప్రక్రియ మొదలైనప్పుడు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లో ఉపాధి పెరుగుతుంది. స్థానిక (లోకల్) స్టార్టప్ల వ్యవస్థ వచ్చేస్తుంది అని వివరించారు. ఇందుకు అనువైన పరిస్థితుల్ని కల్పించేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. తమిళనాడులో మొదలైన సంస్కృతి ఇతరచోట్లకు విస్తరిస్తుందని, భారత్ను అఖండంగా చూసేరోజు వస్తుందని నేటివ్ లీడ్ సంస్థ ఛైర్మన్ నాగరాజ ప్రకాశం తెలిపారు. ప్రస్తుతం మదురై, కోయంబత్తూరు, ఈరోడ్, కరూర్, తిరుచ్చి, తూత్తుకుడిలో తమ కేంద్రాలు తెరిచామని చెప్పారు. వీటితో చెన్నై, విదేశాల్లోని వాషింగ్టన్, టోక్యో కేంద్రాలతో సమన్వయం చేసుకుని తమిళనాడులో స్టార్టప్లను వృద్ధి చేస్తామని వెల్లడించారు.
పరిశోధనల్లో మేటి
ఐఐటీ మద్రాస్ ఇంకుబేషన్ సెల్ దేశంలోనే ప్రసిద్ధి చెందిన సాంకేతిక పరిశోధన సంస్థగా పేరుపొందింది. ప్రధానంగా సాంకేతికతపరంగా లోతైన విశ్లేషణలు చేసి దేశానికి వినూత్న స్టార్టప్లను అందించడంలో తనదైన శైలిలో ముందుకెళ్తోంది. ఈ కేంద్రం ఇప్పటికే దేశంలోని 70 పరిశోధన కేంద్రాలతో కలిసి పనిచేస్తోంది. 13 రంగాల్లో 200కు పైగా స్టార్టప్లను ఏర్పాటు చేయించింది. అలాగే కేంద్రం పరిధిలో 200కు పైగా వివిధరకాల ల్యాబొరేటరీలున్నాయి. 1300కు పైగా పేటెంట్లను కూడా దక్కించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు